ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సొమ్ము తరలింపు!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఎస్సైని ఏమార్చి రవాణా బాధ్యతల అప్పగింత
రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో విస్మయకర అంశాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో భారాసకు మద్దతుగా.. ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. భారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో భారాస ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్గా వినియోగించుకున్న ఓ ఎస్సైకి రాధాకిషన్రావు తప్పుడు సమాచారమిచ్చి బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ.. నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని, సహకరించాలని ఎస్సైని రాధాకిషన్రావు నమ్మించినట్లు వెల్లడైంది. రాధాకిషన్రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్డేల్ విల్లాస్లో వెంకట్రామిరెడ్డ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్రెడ్డి అలియాస్ చరణ్ను కలవాలని రాధాకిషన్రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్రెడ్డి కొత్త ఐఫోన్ను, సిమ్కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్రావు ఆ ఫోన్కే కాల్ చేస్తూ.. ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు.
విశ్రాంత ఎస్పీకి సొమ్ము అప్పగింత
- రాధాకిషన్రావు సూచనతో ఎస్సై ఓ సందర్భంలో సికింద్రాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్రావును కలిశారు. ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్సై రాణీగంజ్కు వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్రావుకు ఆ డబ్బును అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్గంజ్ వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్రావుకు అప్పగించారు.
- మరోసారి శివచరణ్రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్సై వెళ్లి అక్కడి నుంచి రూ.కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. అక్టోబరు మూడో వారంలో రెండు, మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రూ.కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్కు అప్పగించారు.
అనుమానం వచ్చినా ప్రశ్నించలేక..
తరచూ డబ్బు తరలింపుపై ఎస్సైకి అనుమానం వచ్చినా, ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావును ప్రశ్నించలేకపోయారు. రాధాకిషన్రావును ఎన్నికల కమిషన్ తొలగించిన తర్వాత.. ఆయన భారాసకు అనుకూలంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎస్సైకి అర్థమైంది. భారాస ఓటమి పాలైన అనంతరం డిసెంబరు 4న రాధాకిషన్రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తన రెండు సెల్ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆ ఫోన్లను తర్వాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకొంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే (రిట్రీవ్) దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డ్డి తన బాల్యస్నేహితుడు కావడంతోనే ఎన్నికల వేళ ఆయన తరలించే సొమ్ముకు ఎస్సైని ఎస్కార్ట్గా పంపించినట్లు రాధాకిషన్రావు పోలీసు విచారణలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’