ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సొమ్ము తరలింపు!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఎస్సైని ఏమార్చి రవాణా బాధ్యతల అప్పగింత
రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో విస్మయకర అంశాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో భారాసకు మద్దతుగా.. ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. భారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో భారాస ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్గా వినియోగించుకున్న ఓ ఎస్సైకి రాధాకిషన్రావు తప్పుడు సమాచారమిచ్చి బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ.. నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని, సహకరించాలని ఎస్సైని రాధాకిషన్రావు నమ్మించినట్లు వెల్లడైంది. రాధాకిషన్రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్సైని ఎంచుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్దఎత్తున నగదును తరలించారు. భారాస ఎమ్మెల్సీ, విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్రావు ఆదేశాలతో ఎస్సై పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్డేల్ విల్లాస్లో వెంకట్రామిరెడ్డ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్రెడ్డి అలియాస్ చరణ్ను కలవాలని రాధాకిషన్రావు ఎస్సైకి సూచించారు. అనంతరం శివచరణ్రెడ్డి కొత్త ఐఫోన్ను, సిమ్కార్డును తీసుకొచ్చి ఎస్సైకి అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్రావు ఆ ఫోన్కే కాల్ చేస్తూ.. ఎస్సైకి ఆదేశాలిచ్చేవారు.
విశ్రాంత ఎస్పీకి సొమ్ము అప్పగింత
- రాధాకిషన్రావు సూచనతో ఎస్సై ఓ సందర్భంలో సికింద్రాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్రావును కలిశారు. ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్సై రాణీగంజ్కు వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్రావుకు ఆ డబ్బును అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్గంజ్ వెళ్లారు. అక్కడ రూ.కోటి తీసుకొని మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్రావుకు అప్పగించారు.
- మరోసారి శివచరణ్రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్సై వెళ్లి అక్కడి నుంచి రూ.కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. అక్టోబరు మూడో వారంలో రెండు, మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రూ.కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్కు అప్పగించారు.
అనుమానం వచ్చినా ప్రశ్నించలేక..
తరచూ డబ్బు తరలింపుపై ఎస్సైకి అనుమానం వచ్చినా, ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావును ప్రశ్నించలేకపోయారు. రాధాకిషన్రావును ఎన్నికల కమిషన్ తొలగించిన తర్వాత.. ఆయన భారాసకు అనుకూలంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎస్సైకి అర్థమైంది. భారాస ఓటమి పాలైన అనంతరం డిసెంబరు 4న రాధాకిషన్రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తన రెండు సెల్ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆ ఫోన్లను తర్వాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకొంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే (రిట్రీవ్) దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డ్డి తన బాల్యస్నేహితుడు కావడంతోనే ఎన్నికల వేళ ఆయన తరలించే సొమ్ముకు ఎస్సైని ఎస్కార్ట్గా పంపించినట్లు రాధాకిషన్రావు పోలీసు విచారణలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్