చేటు చేస్తున్న సిమ్లపై వేటు
సిమ్కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు. దగాకోరులు ఉపయోగించే ఈ సిమ్లను పసిగట్టి... నిలువరించగలిగితే మోసగాళ్ల ఆట కట్టించవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టారు.
రోజుకు 110 కార్డులు రద్దు
సైబర్ సెక్యూరిటీ విభాగం కఠిన చర్యలు
ఈనాడు, హైదరాబాద్: సిమ్కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు. దగాకోరులు ఉపయోగించే ఈ సిమ్లను పసిగట్టి... నిలువరించగలిగితే మోసగాళ్ల ఆట కట్టించవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్.సి.సి.ఆర్.పి)కు వస్తున్న సమాచారం ఆధారంగా సిమ్లను గుర్తించి వాటిని రద్దు చేయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకు 110 సిమ్ కార్డులను రద్దు చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మోసాలకు కారణమవుతున్న ఫోన్లను బ్లాక్ చేయిస్తున్నారు.
సైబర్నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్న తెలంగాణలో ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక్క హైదరాబాద్లోనే సైబర్ నేరగాళ్లు రోజుకు రూ.5 కోట్లు కొట్టేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏటా దాదాపు రూ.1800 కోట్లు లూటీ అవుతున్నాయన్నమాట. నిరుద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు... రైతు నుంచి వ్యాపారి వరకు అందరూ ఈ నేరాల బాధితులే. ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశాల నుంచి కూడా సైబర్ నేరగాళ్లు దోపిడీని కొనసాగిస్తున్నారు. మాయమాటలతో నమ్మించి, నిలువు దోపిడీ చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినా నేరగాళ్లను గుర్తించడం కష్టమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని అరెస్టు చేసి, ఇక్కడకు తీసుకొని రావడం సాధ్యంకావడం లేదు. అందుకే సైబర్నేరాలు అదుపు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఎన్సీసీఆర్పీని ఏర్పాటుచేసి ..1930 నంబర్ సౌకర్యం కల్పించింది. ఈ నంబర్కు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు మోసానికి కారణమైన సిమ్కార్డు ఏ చిరునామాతో కొనుగోలు చేశారో గుర్తిస్తారు. సంబంధిత రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తారు. వారు సర్వీస్ ప్రొవైడర్కు లేఖ రాసి, దాన్ని బ్లాక్ చేయిస్తారు. కానీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత తక్షణమే స్పందిస్తున్నారు. గత ఏడాది జూన్ 1 నుంచి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తుండగా అప్పటి నుంచి మార్చి 31 వరకూ అంటే పది నెలల కాలంలో తెలంగాణ చిరునామాతో ఉన్న 33,029 సిమ్కార్డులు, ఐఎంఈఐ నంబర్ ఆధారంగా 3,769 మొబైల్ ఫోన్లు బ్లాక్ చేయించారు. అంటే సగటున రోజుకు 110 సిమ్కార్డులు, 12 ఫోన్లు బ్లాక్ చేయిస్తున్నారన్నమాట. సైబర్నేరాలకు అడ్డుకట్టవేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.