మాటల మంత్రం.. ఓట్ల తంత్రం!
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ప్రచార ఎజెండాలకు పదును పెడుతున్నాయి. వీటితోపాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి.
క్రమంగా వేడెక్కుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం
మహిళలు, యువతకు గాలం.. ప్రత్యర్థి వైఫల్యాలపై విమర్శలు
ఈనాడు - హైదరాబాద్
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ప్రచార ఎజెండాలకు పదును పెడుతున్నాయి. వీటితోపాటు ప్రధానంగా ప్రత్యర్థి లోపాలను అస్త్రాలుగా వినియోగిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఖరారైన చోట ప్రచారం ప్రారంభించాయి. రాష్ట్రంలోని హైదరాబాద్ సీటు మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, భారాస, భాజపాల మధ్య ఈసారి కీలక పోరు సాగనుంది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, భాజపాలు హోరాహోరీ తలపడనుండగా.. కొన్నిచోట్ల కాంగ్రెస్, భారాసల మధ్య పోరు నెలకొంది. ప్రచారంలో ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా అన్ని పార్టీలు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను అంచనా వేసుకుంటూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా మహిళలు, యువతపై గురి పెట్టాయి.
గ్యారంటీలపై కాంగ్రెస్ నమ్మకం
శాసనసభ ఎన్నికల్లో కలిసి వచ్చిన గ్యారంటీ కార్డును కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ ఉపయోగించుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలును చాటి చెబుతూ ఇటీవల తుక్కుగూడ సభావేదికగా రాహుల్గాంధీ ఆవిష్కరించిన పాంచ్ న్యాయ్ గ్యారంటీలను కూడా ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాయితీ గ్యాస్బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర గ్యారంటీల అమలును అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినా.. రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెడుతూనే పథకాల అమల్లో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు. భారాస ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, మేడిగడ్డ కుంగుబాటు, ఉద్యోగాల కల్పనలో వైఫల్యాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ధరణి భూ సమస్యలతోపాటు రాష్ట్రంలో కరవుకు కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని కాంగ్రెస్ నేతలు ప్రచారంలో ఆరోపిస్తున్నారు. విభజన హామీలను కేంద్రంలోని భాజపా అమలు చేయకపోవడంతో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రాలేదని, నిధులు పెద్దఎత్తున నిలిచిపోయాయంటూ ఆ పార్టీపైనా విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ తరహాలో ఒక భారీ పరిశ్రమ, ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల్లో భారీ సభలకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులు, కీలక నాయకులను చేర్చుకుంటూ ఎన్నికల ముందు ఆ పార్టీలను బలహీనపర్చే వ్యూహాలను అమలు చేస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలపై భారాస దృష్టి
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ అస్త్రశస్త్రాలుగా మలుచుకుని భారాస ఎన్నికల సమరంలోకి దిగుతోంది. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ముందుగా రాష్ట్రంలో కరవు పరిస్థితులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ కుంగితే మరమ్మతు చేయాలి గానీ పంటలను ఎండబెడతారా అని.. ప్రశ్నిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతను తమ ప్రభుత్వం ప్రారంభిస్తే కాంగ్రెస్ అసలు పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టుల నిర్మాణాల ఊసుకూడా లేదని ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తూనే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారంటూ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారు. రైతుల గోస ఈ ప్రభుత్వానికి పట్టదంటూ భారాస అధినేత కేసీఆర్ పంటల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు వర్గాలను ఆకర్షిస్తున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని, సాధ్యం కాని హామీలిచ్చారని, రైతుబంధు లాంటి పథకాలను కాంగ్రెస్ పక్కన పెట్టిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, భాజపాలు ఒక్కటేనన్న ఆరోపణలతో భారాస ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ప్రత్యర్థుల లోపాలే భాజపా అస్త్రాలు
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని కీలకమైన ప్రచారాస్త్రంగా భాజపా వినియోగిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం, ప్రత్యర్థి పార్టీల నుంచి కీలక నేతల చేరికలు.. పెద్ద ఎత్తున లోక్సభ స్థానాలు కైవసం చేసుకునేందుకు దోహదం చేస్తాయని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు అగ్ర నాయకత్వాన్ని ప్రచారానికి తీసుకురావడం, రోడ్షోలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పసుపుబోర్డు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణం, ఎస్సీ వర్గీకరణకు భరోసా వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. అర్బన్ ఓటర్లపై కీలకంగా దృష్టి సారించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు భారాస అవినీతిపై విమర్శలు చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చర్యలు లేవని.. ఆ రెండు ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు. అయోధ్య రామమందిరం అక్షితల పంపిణీతో భక్తుల మనసు గెలవడం లాంటి అంశాలు కూడా ఓటర్లు భాజపావైపు ఆకర్షితులయ్యేందుకు దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు