క్రమశిక్షణ.. రుణ నియంత్రణ..!
పాత బాకీలపై వడ్డీ, అసలు కింద కిస్తీలకు సొమ్ము చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. గత 4 నెలల్లో రూ.25,911 కోట్లు ఇలా కిస్తీలకు చెల్లించింది.
రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రభుత్వ నిర్దేశం
4 నెలల్లో కొత్త అప్పులు రూ.17,618 కోట్లు
పాత బాకీలకు చెల్లింపు రూ.25,911 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: పాత బాకీలపై వడ్డీ, అసలు కింద కిస్తీలకు సొమ్ము చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. గత 4 నెలల్లో రూ.25,911 కోట్లు ఇలా కిస్తీలకు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 4 నెలల్లో కొత్తగా రూ.17,618 కోట్ల రుణాలను సేకరించింది. కానీ పాతబాకీల కిస్తీలకు చెల్లింపు అంతకుమించి ఉండటంతో ప్రభుత్వం వ్యయంపై పలు నియంత్రణలతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. రాష్ట్ర ఖజానాపై మోయలేనంతగా పెరిగిన రుణభారం తగ్గించేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం దుబారా నివారణ, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని నిర్దేశించింది.
ప్రజోపయోగమైన పనులకూ ప్రాధాన్యం
పాతబాకీలకు సొమ్ము చెల్లింపులే కాకుండా ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు గత 4 నెలల్లో మరో రూ.5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేశారు. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. కొత్త అప్పులు తీసుకోవడంలో కొంతమేరకు నియంత్రణ సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2023 డిసెంబరు నుంచి మార్చి వరకూ నాలుగు నెలల్లో రూ.15,118 కోట్లు అప్పుగా తీసుకుంది. భారాస హయాం(2022-23)లో ఇదే 4 నెలల వ్యవధిలో రూ.19,569 కోట్లు, 2021-22లో రూ.26,995 కోట్ల అప్పులు తీసుకున్నట్లు ఆర్థికశాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఏడాది 2024-25 ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో రూ.59,625 కోట్ల రుణాలను సేకరించాలని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు రూ.2,500 కోట్లు అప్పుగా తీసుకుంది. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) పెరిగినందున రుణాలు తీసుకునే పరిమితి పెరిగింది. అయినప్పటికీ తక్కువగానే అప్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రభుత్వాలు పాతబాకీలకు చెల్లించాల్సిన కిస్తీల సొమ్ము కంటే ఎక్కువ మొత్తాన్ని రుణాలుగా తీసుకోవడం ఆనవాయితీ. కానీ గత 4 నెలల్లో అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త రుణాల కంటే ఎక్కువ సొమ్మును పాత అప్పుల కిస్తీలకు చెల్లించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!