రాష్ట్రంలో ఎండలు భగభగ

రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి.

Published : 15 Apr 2024 03:26 IST

ఏడు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
నేడు, రేపు మరింత పెరుగుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఆదివారం ఏడు జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. మరో రెండు జిల్లాల్లో 41.5 డిగ్రీలపైన ఉంది. అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు..  మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6, ములుగు జిల్లా తాడ్వాయి మండలం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలాల్లో 42.5, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 42.4, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో 42.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోనూ ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోయారు. మూసాపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని