అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా ఫుడ్పార్కు
మార్కెట్యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, ఎండలకు వారు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
మార్కెట్యార్డుల్లో రైతులకు వసతులు కల్పించాలి
లక్ష్యం చేరని ఆయిల్పామ్ సంస్థలపై చర్యలు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
ఈనాడు, హైదరాబాద్: మార్కెట్యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, ఎండలకు వారు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆయిల్పామ్ సంస్థలు మూడేళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలవారీగా కంపెనీల పనితీరును సమీక్షించి సరైన పురోగతి లేని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండల బుగ్గపాడులో 60 ఎకరాల్లో రూ.109.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రస్థాయిలో మెగా ఫుడ్పార్కును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయిల్పామ్, కొబ్బరి, మామిడి శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని.. పూర్తిస్థాయిలో కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, ప్యాకింగ్ హౌస్, గిడ్డంగులు, శిక్షణ కేంద్రం, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల రైతులకు ఉపయుక్తంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దాలన్నారు. అందులో యూనిట్ల స్థాపనకు పలు కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని.. ఇప్పటికే ఆరు ముందుకొచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యాన పథకాలను సైతం ఈ పార్కు అభివృద్ధికి వినియోగించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!