సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం
ఈనాడు, హైదరాబాద్: ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం. దీంతో వారికి పాస్పోర్టు జారీ మరింత ఆలస్యమవుతోంది..
రాష్ట్ర వ్యాప్తంగా 5 పాస్పోర్టు సేవా కేంద్రాలు, 14 పీవో పీఎస్కేలు ఉండగా రోజూ 3,800కి పైగా అపాయింట్మెంట్ల ప్రక్రియ సాగుతోంది. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడం, ఆధార్, దరఖాస్తులో వివరాలు వేర్వేరుగా ఉండడం తదితర కారణాలతో 10శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలాంటి వారు ఆయా సేవా కేంద్రాల్లో మళ్లీ ఇచ్చే అపాయింట్మెంట్ తేదీ లోపు అధికారులు సూచించిన వివరాలతో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది దరఖాస్తుదారులు మాత్రం.. అధికారులు సూచించిన తేదీని పట్టించుకోకుండా ప్రాంతీయ పాస్పోర్టు సేవాకేంద్రంలో ఎంక్వయిరీ అపాయింట్మెంట్లు తీసుకొని అక్కడ ధ్రువపత్రాలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. తీరా సర్టిఫికెట్లు తీసుకొని అక్కడికి వెళ్లాక తదుపరి ప్రక్రియను అక్కడ పూర్తి చేయరని తెలియడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరుగుతున్నారు. ఈ క్రమంలోనే రీజనల్ పాస్పోర్టు అధికారులు వారికి అదే పీఎస్కేలో మరో అపాయింట్మెంట్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో...
దరఖాస్తుదారులు హడావుడిగా దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేస్తుండడంతో పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దుకోవడానికి ‘ఎడిట్’ ఆప్షన్ను వెబ్సైట్లో పొందుపరచలేదు. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఎడిట్ ఆప్షన్తో సంబంధం లేకుండానే ధ్రువపత్రాల పరిశీలన, సమర్పణ సమయంలోనే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏఆర్ఎన్, ధ్రువపత్రాలు సమర్పించే సమయంలో అదనపు కాపీలను తమ వద్ద పెట్టుకొని పొరపాట్లు జరిగినచోట పెన్సిల్తో మార్క్ చేసి పత్రాలను పరిశీలించి మార్పులు చేయాలని కోరవచ్చు. ఒరిజినల్స్ను అధికారులు పరిశీలించి అక్కడికక్కడే వాటిని సరిదిద్దుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
ఉదయం 11 గంటలకు పది ఫలితాలు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!