సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది.
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. మూడుముళ్ల బంధంతో సీతారాములు ఒక్కటైన మధుర క్షణాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆలయంలోని మిథిలా మండపంలో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ మహోత్సవానికి విష్వక్సేనుల ఆరాధన, పుణ్యాహవచనంతో శ్రీకారం చుట్టారు. సీతారాములకు రక్షాసూత్రాలు కట్టి.. గృహస్థాశ్రమసిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు. వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మూడు పతకాలు కలిగిన మాంగల్యాన్ని సీతమ్మ మెడలో ధరింపజేయడంతో కల్యాణ ప్రాంగణం భక్తుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. అనంతరం తలంబ్రాల ఘట్టం నయనానందకరంగా సాగింది. సీతారాముల వారి కల్యాణ తలంబ్రాల విశిష్టతపై సాగిన వేద పండితుల ప్రవచనాలు ఆధ్యాత్మికజ్ఞానాన్ని పంచాయి. ‘సర్వలోకాలకు రక్షకుడు రాముడు. అలాంటి పరమాత్మకు జరిగే కల్యాణమే లోకకల్యాణం. ఆయన సేవే మనకు పరమానందం’ అని దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రవచించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన ఉన్నతాధికారులు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎస్ శాంతికుమారి దంపతులు, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరీ పీఠం, చినజీయర్ స్వామి, భక్త రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ల తరఫున వారి ప్రతినిధులు పట్టువస్త్రాలు బహూకరించారు.
విచ్చేసిన ప్రముఖులు
సీతారాముల కల్యాణ వేడుకను కనులారా చూసి తరించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ దంపతులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ జస్టిస్ సుదర్శన్రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ శ్రీనివాస్రెడ్డి, జస్టిస్ ఎన్.హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి తదితరులు కల్యాణాన్ని వీక్షించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం
- మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కల్యాణోత్సవానికి హాజరయ్యారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని రాములవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా సామాన్య భక్తుల మాదిరిగానే టికెట్ కొని కల్యాణం తిలకించామన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. రాములవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూడగలగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాముల వారి దయతో రాష్ట్రంలో సకలజనులందరికీ ఇందిరమ్మ పాలన అందిస్తామని చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తరఫున ఆయన కుమారుడు నయన్రాజ్.. స్వర్ణంతో పొదిగిన పచ్చలహారాన్ని సీతారాముల వారికి బహూకరించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఐజీలు రంగనాథ్, రాజేశ్, సింగరేణి ఎండీ బలరాం, తితిదే మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు కిషన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్రాజు తదితరులు కల్యాణోత్సవానికి హాజరైన వారిలో ఉన్నారు.
ఈటీవీ, ఖమ్మం - న్యూస్టుడే, భద్రాచలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’