ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం

దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.

Published : 18 Apr 2024 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలలో కలిపి రూ.20,339.36 కోట్ల మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. జోన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే అత్యధిక మొత్తం. 2022-23లో రాబడి రూ.18,976 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 7 శాతం అధికం. వివరాల్ని జోన్‌ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023-24లో ప్రయాణికుల ద్వారా ద.మ.రైల్వేకు రూ.5,731.8 కోట్ల ఆదాయం వచ్చింది. 26.2 కోట్ల మంది ప్రయాణించారు. 2022-23లో ప్రయాణికుల సంఖ్య 25.55 కోట్లు కాగా ఈ ఏడాది ప్రత్యేక రైళ్లను నడిపించడం, డిమాండ్‌కు అనుగుణంగా అదనపు కోచ్‌లను జోడించడంతో ప్రయాణికులతో పాటు ఆదాయం కూడా పెరిగిందని ద.మ.రైల్వే తెలిపింది. సరకు రవాణాలో గతేడాది కంటే 4.4శాతం అధికంగా రూ.13,620 కోట్ల ఆదాయం వచ్చిందని ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని