ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి.
ఏటా భారీగా రుసుముల పెంపు
కొన్ని పాఠశాలల్లో ప్లేస్కూల్కు రూ.లక్ష.. ఒకటో తరగతికి రూ.2.5 లక్షలు
పుస్తకాలు, యూనిఫాంలూ బడిలో కొనాల్సిందే..
యాజమాన్యాల ఇష్టారాజ్యంతో తల్లిదండ్రులకు ఇబ్బందులు
ఈనాడు, హైదరాబాద్
- హైదరాబాద్ ఉప్పల్లో చిరుద్యోగి ఆనంద్ తన కుమార్తెను ప్లేస్కూల్లో చేర్పించడానికి వెళ్లారు. నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేల రుసుముతో పాటు యూనిఫాం, బూట్లు, బెల్టు, టై, ఇతరత్రా సామగ్రి కోసం రూ.12 వేలు కలిపి మొత్తం రూ.60 వేలు చెల్లించాలని యాజమాన్యం సూచించింది.
- హైదరాబాద్ కోకాపేటలో హరినాథ్ తన కుమారుడిని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించేందుకు యాజమాన్యాన్ని సంప్రదించగా.. రూ.లక్షన్నర ఫీజుతో పాటు ఇతరత్రా రుసుములు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
- వరంగల్లో కుమార్ తన కుమారుడిని మూడో తరగతిలో చేర్పించడానికి ఓ కార్పొరేట్ పాఠశాలకు వెళ్లారు. రూ.లక్ష డొనేషన్తో పాటు నెలకు రూ.8 వేల రుసుము, ఇతరత్రా ఛార్జీలు కలిపి మొత్తం రూ. రూ.2.5 లక్షలు అడిగారు.
- రంగారెడ్డి జిల్లాలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో ఈ ఏడాది 4వ తరగతికి రూ.2.60 లక్షల రుసుము ఉంది. వచ్చే సంవత్సరం ఐదో తరగతిలో రూ.3.12 లక్షల రుసుములు చెల్లించాలని తల్లిదండ్రులకు యాజమాన్యం సందేశం పంపింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. తమ పాఠశాలకు ఉన్న డిమాండ్ను బట్టి ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ప్రభుత్వపరంగా రుసుముల నియంత్రణ లేకపోవడం వాటికి అనువుగా మారింది. 2024-25 విద్యాసంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నగరాల్లోని పలు కార్పొరేట్ పాఠశాలలు 40-50 శాతం పెంచాయి.
నిర్ణీత ప్రాతిపదిక లేకుండానే..
పాఠశాలల్లో ఏటా రుసుముల పెంపు ఆనవాయితీగా మారింది. నిర్ణీత ప్రాతిపదిక ఏమీ లేకుండానే 15 నుంచి 20 శాతం వరకు పెంచేస్తున్నాయి. కరోనా తర్వాతి సంవత్సరంలోనూ పెంపుదల ఆగలేదు. డిమాండ్ ఉన్న పాఠశాలలు మెరిట్ ఉన్న విద్యార్థులకే సీట్లు ఇస్తామని చెబుతున్నా.. అవీ భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. మరోవైపు యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల ధరలను పెంచేస్తున్నాయి. రూ.200కి లభించే చిన్నారుల బూట్లకు రూ.500 నుంచి రూ.1,000, మూడు జతల యూనిఫాంకు రూ.3 వేలు, బెల్టుకు రూ.300, టైకి రూ.300 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. వీటిని బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నా ససేమిరా అంటున్నాయి. తాము ప్రత్యేకంగా తయారు చేయించామని, తమ పాఠశాల చిహ్నం ఉన్నందువల్ల ఇక్కడే కొనాలని కరాఖండిగా చెబుతున్నాయి. పుస్తకాలను సైతం బయటి మార్కెట్లో కొనడానికి ఒప్పుకోవడం లేదు. తాము చెప్పిన ముద్రణా సంస్థల పుస్తకాలనే కొనాలంటున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఒక పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థుల నుంచి పుస్తకాల కోసం రూ.10 వేలు వసూలు చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రుసుముల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారం పడుతోంది. కొందరు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా తన జీతం ఏమాత్రం పెరగలేదని, పాఠశాల రుసుములు మాత్రం 60 శాతం పెరిగాయని మంచిర్యాలకు చెందిన చిరుద్యోగి మహేందర్ వాపోయారు.
కార్యరూపం దాల్చని సిఫారసులు..
ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల పెంపుదలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం యాజమాన్యాలకు వరంగా మారింది. భారీ రుసుములపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల రుసుముల నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. అది పలు సిఫారసులు చేసినా కార్యరూపం దాల్చలేదు.
నియంత్రణకు నిర్దిష్ట విధానంపై దృష్టి
ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు ప్రతిఏటా పెరుగుతున్న మాట వాస్తవమే. అది సహేతుకం కాదు. రుసుములు భారమైనా తల్లిదండ్రులు వాటిల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతుండటం వల్లే ఈ సమస్య వస్తోంది. ఇప్పటివరకు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు నిర్దిష్ట విధానం లేదు. మంత్రివర్గ ఉపసంఘం గతంలో పలు సిఫారసులు చేసింది. వాటిని పరిశీలించి, ప్రభుత్వస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
బుర్రా వెంకటేశం, తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు. -
అన్నదాతకు అందలం
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాధాన్య పథకాలు, అవసరాల దృష్ట్యా ఆ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే