ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భూపాలపల్లి జిల్లా కొంపెల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు
కుట్రపూరితంగా అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై విచారణ జరపాలని ఆదేశం
ఈనాడు, దిల్లీ: భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఏఎస్ నం.145/1994కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, రివ్యూ పిటిషన్పై ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు తనకు అధికారంలేని విషయంలో జోక్యం చేసుకొందని.. హక్కులు నిరూపించుకోలేని ప్రైవేటు వ్యక్తికి అటవీభూమిని బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భిన్న విధానాలు అనుసరించిన ప్రభుత్వంతోపాటు, ప్రతివాది రూ.5 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సంబంధిత కోర్టుల ముందు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కుట్రపూరితంగా అఫిడవిట్లు దాఖలుచేసిన అంశంపై విచారణ జరిపి, అందుకు బాధ్యులైన వారి నుంచి ఖజానాకు జరిగిన నష్టాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశంపై హైకోర్టుముందు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు 624/2021ని మూసేయాలని ఆదేశించింది. అలాగే మరో వ్యాజ్యకాలీన దరఖాస్తును డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది.
1971లో నోటిఫికేషన్ జారీ..
కొంపెల్లి గ్రామ శివారులో జాతీయ రహదారికి అతి సమీపంలోని 106.34 ఎకరాలు తనదేనంటూ మహ్మద్ అబ్దుల్ ఖాసీం అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకోగా, అది అతనిది కాదు.. రిజర్వ్ఫారెస్ట్ భూమి అని ఏపీ ప్రభుత్వం 1971 నవంబర్ 11న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. సదరు భూమి తనదేనని ఖాసీం దాఖలు చేసుకున్న దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తర్వాత ఆ కేసు జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లడంతో అక్కడా అతనికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత రిజర్వ్ఫారెస్ట్గా ప్రకటిస్తూ జారీచేసిన నోటిఫికేషన్ను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా 1984 సెప్టెంబర్ 1న దాన్ని డిస్మిస్ చేశారు. దాంతో అబ్దుల్ఖాసీం 1985 ఏప్రిల్ 23న వరంగల్ అదనపు సబ్ జడ్జి-1 ముందు సూట్ దాఖలుచేసి ఆ భూమిపై హక్కులు కల్పిస్తూ శాశ్వత ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 1993 డిసెంబరు 6న ఆ కోర్టు సదరు వ్యక్తికి టైటిల్ మంజూరుచేస్తూనే, దాన్ని స్వాధీనంచేస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దానిపై దాఖలైన అప్పీల్పై విచారించిన హైకోర్టు.. ట్రయల్కోర్టు అతనికి టైటిల్ మంజూరుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతోపాటు, ఆ కేసులో అతనికి అనుకూలంగా ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడాన్ని సమర్థించింది. మొత్తంగా ఆ సూట్లోని భూమి అంతా అటవీభూమేనని 2018 జులై 20న తీర్పు వెలువరించింది. దాన్ని సవాల్చేస్తూ అదే ఏడాది నవంబర్ 18న ఖాసీం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేయగా దాన్ని విచారించి అతనికి అనుకూలంగా 2021 మార్చి 19న తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 4న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలుచేసింది. కేసు పూర్వాపరాలు, ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తొలి అప్పీల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రివ్యూ పిటిషన్పై ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ కేసులో రెవెన్యూ అధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్ను ప్రతివాది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 15 కింద సవాలే చేయలేదు. తన పేరిట హక్కులు ఖరారు చేయాలని, ఆ భూమిలోకి ప్రభుత్వ అధికారులు అడుగుపెట్టకుండా శాశ్వతంగా ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని మాత్రమే కోరారు. కాబట్టి ట్రయల్కోర్టులో అతను దాఖలుచేసిన సూట్కు విచారణార్హతే లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు
ఈ కేసులో ప్రభుత్వ అధికారులు స్పష్టమైన విధానం తీసుకోకుండా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ప్రతివాదులకూ రూ.5లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ‘‘సూట్లో పేర్కొన్న ఆస్తి అటవీభూమి అని స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భిన్న విధానాలు అనుసరించింది. అంతిమంగా సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లో ఆ తప్పును సరిదిద్దుకొంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అందుకే ప్రతివాదితోపాటు ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నాం. ఆ మొత్తాన్ని వారు రెండునెలలలోపు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలి’ అని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే