ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు.
70 వేల మందితో భారీ బందోబస్తు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్గదర్శకాలు జారీ చేసిందని చెప్పారు. సుమారు 70 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం 160 కంపెనీల సాయుధ బలగాలను రాష్ట్రానికి కేటాయించిందని, ఇప్పటికే 60 కంపెనీల బలగాలు వచ్చాయని తెలిపారు. గురువారం 42 మంది అభ్యర్థులు 46 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికాస్రాజ్ మాట్లాడారు.
పత్రాల భర్తీలో జాగ్రత్త
‘‘నామినేషన్, అఫిడవిట్ పత్రాల్లోని అన్ని అంశాలను అభ్యర్థులు నింపాలి. ఖాళీలు వదిలేస్తే అభ్యర్థులకు అధికారులు నోటీసులు జారీ చేస్తారు. నిర్దిష్ట గడువులోగా సరిచేసి ఇవ్వని పక్షంలో ఆ నామినేషన్ను తిరస్కరిస్తారు. అభ్యర్థులకు సహకరించేందుకు ప్రతి నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే.. నిర్దేశిత సమయాల్లో కేసుల వివరాలను పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ప్రచురించాలి. నామినేషన్లను ఆన్లైన్లోనూ దాఖలు చేయవచ్చు. ఆ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని.. నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అభ్యర్థి మరో పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన పక్షంలో ఆ విషయాన్ని ఎన్నికల సంఘం న్యాయవిభాగం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
3న ‘ఇంటి నుంచి ఓటు’ ప్రారంభం
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,010 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 మంది ఓటర్లు నమోదయ్యారు. 18-19 సంవత్సరాల యువ ఓటర్లు 9,01,942 మంది, వయోవృద్ధలు 1,93,641, దివ్యాంగులు 5,27,034 మంది ఉన్నారు. ఓటరుగా నమోదుకు ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉంది. ‘ఇంటి నుంచి ఓటు’ హక్కు వినియోగించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 3 నుంచి 8లోగా వారి ఓటు నమోదు చేస్తారు.
2022 నుంచి 60.60 లక్షల ఓట్ల తొలగింపు
2022 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళనను ఎన్నికల సంఘం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 60.60 లక్షల ఓట్లు తొలగించాం. 32.81 లక్షల మంది అదనంగా నమోదయ్యారు. 30.68 లక్షల మంది మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి ఓటరు సమాచార పత్రాలు పంపిణీ చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రతినిధులను పంపి.. పంపిణీ తీరును పరిశీలించవచ్చు.
ఎన్నికల విధులకు రాని ఉద్యోగులపై చర్యలు
రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి అదనంగా 452 సహాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ అనుమతి ఇచ్చింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎన్నికల విధుల్లో 2.90 లక్షల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. ఇంకా 40 వేల మంది ఉద్యోగులు ఒకటీరెండు రోజుల్లో నమోదు చేసుకోవాలి. ఎన్నికల విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలుంటాయి.
కేసీఆర్ సమయం కోరారు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు భారాస అధ్యక్షుడు కేసీఆర్ మరో వారం రోజుల గడువు కోరారు. ఆయన వివరణ ఇవ్వాల్సిన గడువు గురువారం ఉదయం 11 గంటలకు ముగిసింది. గడువు పెంపు కోరుతూ ఆయన రాసిన లేఖను ఈసీకి పంపాం. దానిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఉల్లంఘనలపై రాజకీయ పార్టీల నుంచి 20 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 4,099 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరో 1,107 ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,355 వివిధ నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. గురువారం వరకు రూ.136 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని వికాస్రాజ్ వివరించారు. సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు లోకేశ్కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?