ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి.
రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా ప్రత్యేక చర్యలు
ఈనాడు, హైదరాబాద్: మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. అక్కడ గత మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు చనిపోవడం, ఆ తర్వాత కూడా భద్రతా బలగాలు విస్తృత గాలింపులు కొనసాగిస్తుండటంతో.. మావోయిస్టులు ఇటువైపు రావచ్చన్న ఉద్దేశంతో తెలంగాణ సరిహద్దులను దాదాపు మూసివేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మారుమూల ప్రాంతాల్లోనూ పర్యటిస్తుంటారు. దీన్ని అవకాశంగా తీసుకొని మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. ఇందుకు తావులేకుండా చూడాలన్న లక్ష్యంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
అడవుల్లో విస్తృత గాలింపులతో..
2018లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కసన్సూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు చనిపోగా.. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగింది రెండో అతిపెద్ద ఎన్కౌంటర్. మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఛత్తీస్గఢ్లో గత కొద్దిరోజులుగా భద్రతా బలగాలు విస్తృత గాలింపులు చేపడుతున్నాయి. కేంద్ర బలగాల సహకారంతో, ఆధునిక పరిజ్ఞానం సాయంతో దట్టమైన అటవీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్తున్నాయి. ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేయడం.. వామపక్ష తీవ్రవాదంలో అనుసరించే వ్యూహం. అందుకే వారికి పట్టున్న ప్రాంతాల్లోకి వెళ్లినపుడు మావోయిస్టులు తమను తాము రక్షించుకునేందుకు కొత్త సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తారని, ఆ సమయంలో వారి ఆనుపానులు కనిపెట్టవచ్చన్నది భద్రతా బలగాల వ్యూహం. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ను తాము సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొంటున్న భద్రతా బలగాలు.. ఇదే ఊపుతో గాలింపులు చేపడుతూ వ్యూహాన్ని కొనసాగిస్తున్నాయి.
రాష్ట్రంలోకి చొరబడటం సులభమే!
ఛత్తీస్గఢ్లో ఒత్తిడి పెరిగితే మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడే అవకాశం ఉంది. పైగా మావోయిస్టు ఉద్యమంలో ఇప్పటికీ తెలుగు నాయకులదే ఆధిపత్యం. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి రావడం కూడా సులభమే. అందుకే తాజా పరిణామాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో తెలంగాణ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రేహౌండ్స్కు చెందిన అదనపు బలగాలను రంగంలోకి దింపారు. నిరంతర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రోడ్డు మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. గోదావరిని దాటడానికి అవకాశం ఉన్న అన్నిచోట్లా నిఘా పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. ఒకవేళ భద్రతా బలగాల కళ్లుగప్పి మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే.. వారి వల్ల నాయకులకు ముప్పు పొంచి ఉంటుంది. వామపక్ష తీవ్రవాదం పరంగా గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఒక్క సంఘటన జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న ఘటనకూ తావులేకుండా చూడాలన్న లక్ష్యంతో పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరస్పర సహకారం కోసం సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?