సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనాడు, హైదరాబాద్-సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ను సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శ్రీనివాస్తోపాటు సెర్ప్లో పనిచేస్తున్న మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆర్.చంద్రశేఖర్రెడ్డి వాదనలు వినిపిస్తూ భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 129, 134 కింద సస్పెన్షన్ వేటు వేశారని, పిటిషనర్లకు ఈ సెక్షన్లు వర్తించవని తెలిపారు. పిటిషనర్లు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించలేదన్నారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు పొందడంలేదని, సెర్ప్ నుంచి రూ.5 వేలు గౌరవ వేతనం మాత్రమే పొందుతున్నారని చెప్పారు. అందువల్ల పిటిషనర్లను నియమించే లేదా తొలగించే అధికారం కలెక్టర్కు లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 26కు వాయిదా వేశారు.
రాజకీయ కుట్రదారులకు చెంపపెట్టు: వెంకట్రామిరెడ్డి
పొరుగుసేవల ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ కుట్రదారులకు చెంపపెట్టు లాంటిదని మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. స్వార్థబుద్ధితో కుట్రలు చేసినా ధర్మమే గెలిచిందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది తీర్పు కూడా వారికి అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అరూరికి భద్రత కల్పించండి
ఈనాడు, హైదరాబాద్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్కు 1+1 పోలీసు భద్రత కల్పించాలంటూ శుక్రవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భద్రతను ఉపసంహరించారని, తనకు 2+2 భద్రత కల్పించాలంటూ అరూరి రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పిటిషనర్కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భద్రతను ఉపసంహరించారన్నారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున రాజకీయ కక్షలతో దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నందున రమేశ్కు 1+1 భద్రత కల్పించాలంటూ వరంగల్ నగర పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?