ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
కరెంటు రాకపోతే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తాం
మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి
ఈనాడు, హైదరాబాద్: పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటుచేసిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘చాలామందిని ఫోన్ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేశారని పత్రికల్లో కూడా వచ్చింది. ఇలాంటివి ఏ పాలకులు చేసినా ఖండించాల్సిందే. మిగతా వారికన్నా తెలంగాణ సమాజం భావస్వేచ్ఛను, వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. గత ప్రభుత్వం వ్యక్తిగత జీవితాల్లో, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో కూడా చొరబడింది. ఫోన్ట్యాపింగ్ చేయాల్సిన అవసరం, కర్మ మాకు లేవు. అందరూ సర్వస్వతంత్రంగా బతకాలని మేం కోరుకుంటున్నాం. వారి ఆలోచనలే మిగతావారికి ఉంటాయని ఊహించుకుని భారాస నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రానికి చాలా మంచిపనులు చేస్తున్నారు. ఆయన ప్రధాని మోదీని కలిశారని కావాలని రాజకీయ అభాండాలు వేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేసేవారికి పరిపక్వత లేదనుకుంటున్నాం. రుణమాఫీ గురించి స్పష్టత ఉంది. వంద రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. ఆర్థిక పరిస్థితిని చూసుకుని తప్పకుండా రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నెల 15 వరకు ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల రాయితీలు కలిపి మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం.
ఫేక్ న్యూస్ సృష్టించేవారిపై కేసులు
కరెంటు కోతలు విధిస్తున్నారని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసేవారిపై కేసులు పెట్టాలని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు గట్టిగా సూచించా. ఎవరికైనా కరెంటు రాక ఇబ్బందులుంటే సీఎండీలకు గానీ, నా కార్యాలయానికి గానీ సమాచారం ఇస్తే వెంటనే సరిచేస్తాం. కరెంటు కోతలు విధిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నేను విచారణ చేయిస్తే వాటిలో నిజం లేదని తేలింది.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు పెడతాం
గత భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు కట్టే కార్యక్రమాన్ని మాకు అప్పగించింది. మేం ఆ పనిలో ఉన్నాం. విద్య, వైద్యం మా ప్రభుత్వానికి ప్రాధాన్య రంగాలు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు పెడతాం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపైనా దృష్టి పెట్టాం. మొత్తం స్టడీ చేయాలని, నియంత్రించాలని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం.
నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
నీటి వనరుల్లో అన్యాయం జరుగుతుందనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం. నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. కోడ్ తర్వాత ఆ ప్రకారం మా నిర్ణయాలు ఉంటాయి. వానాకాలంలో పడిన వర్షపునీటిని గత ప్రభుత్వం కాపాడలేదు. అలా చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కరవు అని ఇప్పుడు కొందరు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను కలిపి చేపట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలనలో ఇలాగే జరిగింది. కానీ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో, న్యారో మైండ్తో వచ్చిన రాజకీయ పార్టీలు అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు సమస్యలు వచ్చాయి.రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇవ్వాలని సంకల్పించాం. మానవ వనరులను సక్రమంగా పెంచి పోషిస్తే వారి ద్వారా లెక్కలేనంత ఆదాయం వస్తుంది. కొంతమంది లోతుల్లోకి పోకుండా సంక్షేమానికి నిధులు దుబారా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మా పథకాలు పేదలను ఆర్థికంగా నిలబెట్టడానికే తప్ప ఎవరో కొందరు వ్యక్తులకు దానం చేయడానికి కాదు.
కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చిందన్నది పచ్చి అబద్ధం
కేంద్రం నుంచి గత పదేళ్లలో రూ.10లక్షల కోట్లు వచ్చినట్లు కొందరు చెపుతున్న మాటలు పచ్చి అబద్ధం. వచ్చింది రూ.3.70లక్షల కోట్లే. అవీ మనకు హక్కుగా రావాల్సినవే. గత భారాస ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.3,690 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పింది. మరి రైతుబంధుకు కేటాయించిన రూ.7వేల కోట్లు ఏమయ్యాయి? మీరే(కేసీఆర్) తిన్నారా? ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు చెప్పండి. ఎన్టీపీసీని విస్మరించి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రారంభించారు? రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాలసీ తెస్తాం. గత ప్రభుత్వం చేసిన పాత బాకీలకు కిస్తీల కింద నాలుగు నెలల్లో రూ.26,374 కోట్లు చెల్లించాం. ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వానికి ఐదేళ్ల దాకా ఢోకా లేదు. రైతుల ఆత్మహత్యలు అనేవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమే. 65 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.5,575 కోట్లను జమ చేశాం’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి