ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
కరెంటు రాకపోతే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తాం
మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి
ఈనాడు, హైదరాబాద్: పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటుచేసిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘చాలామందిని ఫోన్ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేశారని పత్రికల్లో కూడా వచ్చింది. ఇలాంటివి ఏ పాలకులు చేసినా ఖండించాల్సిందే. మిగతా వారికన్నా తెలంగాణ సమాజం భావస్వేచ్ఛను, వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. గత ప్రభుత్వం వ్యక్తిగత జీవితాల్లో, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో కూడా చొరబడింది. ఫోన్ట్యాపింగ్ చేయాల్సిన అవసరం, కర్మ మాకు లేవు. అందరూ సర్వస్వతంత్రంగా బతకాలని మేం కోరుకుంటున్నాం. వారి ఆలోచనలే మిగతావారికి ఉంటాయని ఊహించుకుని భారాస నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రానికి చాలా మంచిపనులు చేస్తున్నారు. ఆయన ప్రధాని మోదీని కలిశారని కావాలని రాజకీయ అభాండాలు వేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేసేవారికి పరిపక్వత లేదనుకుంటున్నాం. రుణమాఫీ గురించి స్పష్టత ఉంది. వంద రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. ఆర్థిక పరిస్థితిని చూసుకుని తప్పకుండా రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నెల 15 వరకు ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల రాయితీలు కలిపి మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం.
ఫేక్ న్యూస్ సృష్టించేవారిపై కేసులు
కరెంటు కోతలు విధిస్తున్నారని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసేవారిపై కేసులు పెట్టాలని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు గట్టిగా సూచించా. ఎవరికైనా కరెంటు రాక ఇబ్బందులుంటే సీఎండీలకు గానీ, నా కార్యాలయానికి గానీ సమాచారం ఇస్తే వెంటనే సరిచేస్తాం. కరెంటు కోతలు విధిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నేను విచారణ చేయిస్తే వాటిలో నిజం లేదని తేలింది.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు పెడతాం
గత భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు కట్టే కార్యక్రమాన్ని మాకు అప్పగించింది. మేం ఆ పనిలో ఉన్నాం. విద్య, వైద్యం మా ప్రభుత్వానికి ప్రాధాన్య రంగాలు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు పెడతాం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపైనా దృష్టి పెట్టాం. మొత్తం స్టడీ చేయాలని, నియంత్రించాలని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం.
నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
నీటి వనరుల్లో అన్యాయం జరుగుతుందనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం. నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. కోడ్ తర్వాత ఆ ప్రకారం మా నిర్ణయాలు ఉంటాయి. వానాకాలంలో పడిన వర్షపునీటిని గత ప్రభుత్వం కాపాడలేదు. అలా చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కరవు అని ఇప్పుడు కొందరు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను కలిపి చేపట్టాలి. గతంలో కాంగ్రెస్ పాలనలో ఇలాగే జరిగింది. కానీ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో, న్యారో మైండ్తో వచ్చిన రాజకీయ పార్టీలు అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు సమస్యలు వచ్చాయి.రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇవ్వాలని సంకల్పించాం. మానవ వనరులను సక్రమంగా పెంచి పోషిస్తే వారి ద్వారా లెక్కలేనంత ఆదాయం వస్తుంది. కొంతమంది లోతుల్లోకి పోకుండా సంక్షేమానికి నిధులు దుబారా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మా పథకాలు పేదలను ఆర్థికంగా నిలబెట్టడానికే తప్ప ఎవరో కొందరు వ్యక్తులకు దానం చేయడానికి కాదు.
కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చిందన్నది పచ్చి అబద్ధం
కేంద్రం నుంచి గత పదేళ్లలో రూ.10లక్షల కోట్లు వచ్చినట్లు కొందరు చెపుతున్న మాటలు పచ్చి అబద్ధం. వచ్చింది రూ.3.70లక్షల కోట్లే. అవీ మనకు హక్కుగా రావాల్సినవే. గత భారాస ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.3,690 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పింది. మరి రైతుబంధుకు కేటాయించిన రూ.7వేల కోట్లు ఏమయ్యాయి? మీరే(కేసీఆర్) తిన్నారా? ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు చెప్పండి. ఎన్టీపీసీని విస్మరించి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రారంభించారు? రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాలసీ తెస్తాం. గత ప్రభుత్వం చేసిన పాత బాకీలకు కిస్తీల కింద నాలుగు నెలల్లో రూ.26,374 కోట్లు చెల్లించాం. ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వానికి ఐదేళ్ల దాకా ఢోకా లేదు. రైతుల ఆత్మహత్యలు అనేవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమే. 65 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.5,575 కోట్లను జమ చేశాం’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
నేలపైనే గూడు.. ఒకే భాగస్వామి తోడు..
కంటి చుట్టూ పసుపురంగు వలయంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న పక్షి హైదరాబాద్లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్ రింగ్డ్ ప్లవర్’ (శాస్త్రీయనామం చరడ్రియస్ డుబియస్) జాతికి చెందిన పక్షి.