ఫోన్ పోయిందా.. మీరే బ్లాక్ చేయొచ్చు
ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్ల ద్వారా మాల్వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు.
మీ పేరుతో ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసా?
సైబర్ నేరాలకు ‘సంచార్ సాథి’ పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్: ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్ల ద్వారా మాల్వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ మూలం సెల్ఫోన్లు, సిమ్కార్డులే. సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ‘సంచార్ సాథి’ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా https://sancharsaathi.gov.in పోర్టల్లోకి వెళ్లి సెల్ఫోన్లు, సిమ్కార్డులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతోపాటు సైబర్ నేరాల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువల్ని తెలుసుకునే వీలు కల్పించారు.
చక్షు
సైబర్ నేరస్థులు కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్ల ద్వారా మోసం చేసేందుకు యత్నించారని గుర్తిస్తే ‘చక్షు’లో ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకు ఖాతా, పేమెంట్ వ్యాలెట్, సిమ్, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, కేవైసీ అప్డేట్, ఎక్స్పైరీ, డీయాక్టివేషన్, ఇంపర్సనేషన్(ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడటం), సెక్స్టార్షన్.. తదితర మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదులో పేర్కొనవచ్చు.
నో యువర్ మొబైల్(కేవైఎం)
తక్కువ ధరకు వస్తుందని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొని అమాయకులు చిక్కులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ కొనేముందు దాని పూర్వాపరాల గురించి తెలుసుకునేలా ‘నో యువర్ మొబైల్(కేవైఎం) ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ఫోన్ వ్యాలిడిటీని దాని ఐఎంఈఐ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్లో *#06# డయల్ చేయడం ద్వారా ఐఎంఈఐ నంబర్ వస్తుంది. దాన్ని పోర్టల్లో నమోదు చేయాలి. ఆ ఫోన్ ‘బ్లాక్లిస్టెడ్’, ‘డూప్లికేట్’, ‘ఆల్రెడీ ఇన్ యూజ్’ అని గనక వస్తే కొనకుండా ఉండటం మంచిది.
నో యువర్ మొబైల్ కనెక్షన్(టాఫ్కాప్)
సైబర్ నేరగాళ్లు ఇతరుల పేర్లపై ఉన్న సిమ్కార్డులను వినియోగించి మోసాలకు పాల్పడటం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఇతరుల ధ్రువీకరణపత్రాల్ని సేకరించి వాటి ఆధారంగా సిమ్కార్డులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెలీకామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్(టాఫ్కాప్) ఫీచర్ను డీవోటీ తెర పైకి తెచ్చింది. ఎవరైనా ఓ వ్యక్తి తనకు తెలియకుండానే తన పేరుపై ఇతరులు సిమ్కార్డు వినియోగిస్తున్నారా..? అని తెలుసుకునే సదుపాయం ఇందులో ఉంది. మొబైల్నంబర్ను నిక్షిప్తం చేస్తే వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయితే మొత్తం ఎన్ని సిమ్కార్డులు జారీ అయ్యాయి అనేది తెలుస్తుంది. తెలియనివి ఉంటే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయించొచ్చు. ఈ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి 65,23,541 రిక్వెస్ట్లు రాగా.. 55,57,507 పరిష్కరించారు.
సీఈఐఆర్
ఫోన్లు పోయినా లేదా అపహరణకు గురైనప్పుడు వెంటనే దాన్ని బ్లాక్ చేసి పనిచేయకుండా చేసే సదుపాయం అందుబాటులో ఉంది. తిరిగి దొరికిన తర్వాత అన్బ్లాక్ చేసి పనిచేసేలా చేసుకోవచ్చు. దీనికోసమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దేశవ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న 15,43,666 ఫోన్లను ఇప్పటివరకు బ్లాక్ చేశారు. వాటిల్లో 8,47,140 తిరిగి బాధితులకు అప్పగించగలిగారు. వీటిల్లో ఒక్క తెలంగాణలోనే 26,833 ఫోన్లు రికవరీ చేయగలిగారు.
రిక్విన్
విదేశాల నుంచి ఫోన్లు చేసి సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి నేరస్థులు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నా నంబర్ మాత్రం భారత్ కోడ్తోనే ఉంటోంది. నేరస్థులు మాట్లాడే భాషను బట్టి విదేశీయులని బాధితులు సులభంగా గుర్తు పడుతున్నారు. అలాంటి కాల్స్ గురించి ‘రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్(రిక్విన్)’ ఫీచర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ నంబర్లపై డీవోటీ నిఘా ఉంచుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్