ఫోన్ పోయిందా.. మీరే బ్లాక్ చేయొచ్చు
ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్ల ద్వారా మాల్వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు.
మీ పేరుతో ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసా?
సైబర్ నేరాలకు ‘సంచార్ సాథి’ పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్: ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్ల ద్వారా మాల్వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ మూలం సెల్ఫోన్లు, సిమ్కార్డులే. సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ‘సంచార్ సాథి’ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా https://sancharsaathi.gov.in పోర్టల్లోకి వెళ్లి సెల్ఫోన్లు, సిమ్కార్డులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతోపాటు సైబర్ నేరాల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువల్ని తెలుసుకునే వీలు కల్పించారు.
చక్షు
సైబర్ నేరస్థులు కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్ల ద్వారా మోసం చేసేందుకు యత్నించారని గుర్తిస్తే ‘చక్షు’లో ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకు ఖాతా, పేమెంట్ వ్యాలెట్, సిమ్, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, కేవైసీ అప్డేట్, ఎక్స్పైరీ, డీయాక్టివేషన్, ఇంపర్సనేషన్(ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడటం), సెక్స్టార్షన్.. తదితర మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదులో పేర్కొనవచ్చు.
నో యువర్ మొబైల్(కేవైఎం)
తక్కువ ధరకు వస్తుందని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొని అమాయకులు చిక్కులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ కొనేముందు దాని పూర్వాపరాల గురించి తెలుసుకునేలా ‘నో యువర్ మొబైల్(కేవైఎం) ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ఫోన్ వ్యాలిడిటీని దాని ఐఎంఈఐ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్లో *#06# డయల్ చేయడం ద్వారా ఐఎంఈఐ నంబర్ వస్తుంది. దాన్ని పోర్టల్లో నమోదు చేయాలి. ఆ ఫోన్ ‘బ్లాక్లిస్టెడ్’, ‘డూప్లికేట్’, ‘ఆల్రెడీ ఇన్ యూజ్’ అని గనక వస్తే కొనకుండా ఉండటం మంచిది.
నో యువర్ మొబైల్ కనెక్షన్(టాఫ్కాప్)
సైబర్ నేరగాళ్లు ఇతరుల పేర్లపై ఉన్న సిమ్కార్డులను వినియోగించి మోసాలకు పాల్పడటం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఇతరుల ధ్రువీకరణపత్రాల్ని సేకరించి వాటి ఆధారంగా సిమ్కార్డులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెలీకామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్(టాఫ్కాప్) ఫీచర్ను డీవోటీ తెర పైకి తెచ్చింది. ఎవరైనా ఓ వ్యక్తి తనకు తెలియకుండానే తన పేరుపై ఇతరులు సిమ్కార్డు వినియోగిస్తున్నారా..? అని తెలుసుకునే సదుపాయం ఇందులో ఉంది. మొబైల్నంబర్ను నిక్షిప్తం చేస్తే వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయితే మొత్తం ఎన్ని సిమ్కార్డులు జారీ అయ్యాయి అనేది తెలుస్తుంది. తెలియనివి ఉంటే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయించొచ్చు. ఈ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి 65,23,541 రిక్వెస్ట్లు రాగా.. 55,57,507 పరిష్కరించారు.
సీఈఐఆర్
ఫోన్లు పోయినా లేదా అపహరణకు గురైనప్పుడు వెంటనే దాన్ని బ్లాక్ చేసి పనిచేయకుండా చేసే సదుపాయం అందుబాటులో ఉంది. తిరిగి దొరికిన తర్వాత అన్బ్లాక్ చేసి పనిచేసేలా చేసుకోవచ్చు. దీనికోసమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దేశవ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న 15,43,666 ఫోన్లను ఇప్పటివరకు బ్లాక్ చేశారు. వాటిల్లో 8,47,140 తిరిగి బాధితులకు అప్పగించగలిగారు. వీటిల్లో ఒక్క తెలంగాణలోనే 26,833 ఫోన్లు రికవరీ చేయగలిగారు.
రిక్విన్
విదేశాల నుంచి ఫోన్లు చేసి సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి నేరస్థులు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నా నంబర్ మాత్రం భారత్ కోడ్తోనే ఉంటోంది. నేరస్థులు మాట్లాడే భాషను బట్టి విదేశీయులని బాధితులు సులభంగా గుర్తు పడుతున్నారు. అలాంటి కాల్స్ గురించి ‘రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్(రిక్విన్)’ ఫీచర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ నంబర్లపై డీవోటీ నిఘా ఉంచుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
ఇంకిన నీరు ఇంకినట్లే తోడివేత!
వర్షాలు, నీటివనరుల ద్వారా నేలలో ఇంకే నీటిని ఇంకినట్లే తోడుతున్నారు హైదరాబాద్ జిల్లా వాసులు. 2023 సంవత్సరానికి రాష్ట్రంలో నేలలోకి ఇంకిన నీటి పరిమాణం, తోడివేతపై రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. -
సహకార అధికారులకు న్యాయం చేయాలి
తెలంగాణ సహకారశాఖలో జీతభత్యాల విషయంలో ఆది నుంచీ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని... కొత్త పీఆర్సీలో తమకు పూర్తి న్యాయం చేయాలని సహకారశాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: ప్రొ. హరగోపాల్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బస్తర్, సుకుమా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను తక్షణమే నిలిపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కొలిక్కిరాని ధరణి పెండింగ్ సమస్యలు
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. -
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ (షట్టరింగ్ కార్పెంటర్స్), సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. -
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. -
ఎన్నికల సమయంలో నగదు జప్తు సబబే
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది అక్టోబరులో మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల నగదు విడుదలకు, దాని ఆధారంగా నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. -
ధాన్యం టెండర్లలో అక్రమాలు.. పెద్ది సుదర్శన్రెడ్డి
గ్లోబల్ టెండర్ల పేరుతో జరిగిన ధాన్యం అమ్మకాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని భారాస మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్