మండు వేసవిలో ముంచెత్తిన వాన
రాష్ట్రంలో శనివారం ఉదయం అకాల వర్షాలు అన్నదాతలను హడలెత్తించాయి. తీవ్ర ఎండలు కాస్తున్న తరుణంలో.. ఈస్థాయి వర్షాలను ఊహించలేక తీవ్రంగా నష్టపోయారు.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
మార్కెట్ యార్డుల్లో తడిసి ముద్దయిన ధాన్యం
వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకూ నష్టం
పదుల ఎకరాల్లో నేలరాలిన మామిడి
నష్టంపై నివేదిక కోరిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం ఉదయం అకాల వర్షాలు అన్నదాతలను హడలెత్తించాయి. తీవ్ర ఎండలు కాస్తున్న తరుణంలో.. ఈస్థాయి వర్షాలను ఊహించలేక తీవ్రంగా నష్టపోయారు. జనగామ జిల్లా నర్మెట్టలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో 3.3, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో 2.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, వికారాబాద్ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వరి, మొక్కజొన్న, వేరుసెనగ, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన మామిడి, నిమ్మ, బత్తాయి కాయలు రాలిపోయాయి. పిడుగుపాటుకు పశువులు మృత్యువాతపడ్డాయి. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి మళ్లీ ఎండ తీవ్రత మొదలైంది. దీంతో గాలిలో తేమశాతం పెరిగి తీవ్ర ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరాలో 43.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 43.7, సూర్యాపేట జిల్లా మటంపల్లిలో 43.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.
వాలిన వరి.. రాలిన మామిడి
నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, గద్వాల జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశలో ఉన్న వరి చేతికి రాకుండా పోగా.. మొక్కజొన్న కంకులు రాలిపోయాయి. పొలాల్లో నీరు చేరి వేరుసెనగ, పెసలు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. నీటిని బయటకు పంపేందుకు రైతులు నానా ప్రయాసలు పడుతున్నారు. సుమారు 100 ఎకరాల్లోని మామిడితోటల్లో కాయరాలింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బుద్వాన్పూర్లో పిడుగుపాటుకు మూడు గేదెలు చనిపోయాయి. రైతులు మార్కెట్యార్డులకు తీసుకొచ్చిన ధాన్యం, జొన్నలు, కందులు ఇతర పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ఆరబోసిన వడ్లు నీటిపాలయ్యాయి. పలు జిల్లాల్లో ఇంకా ముసురుపట్టి ఉండడంతోపాటు వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పొలాల్లో పంటలను రక్షించే దారి లేక తలలు పట్టుకున్నారు.
రైతుల వారీగా నష్టం వివరాలివ్వాలి
రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లతో సిద్దిపేట, యాదాద్రి, నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం ఆయన పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షించారు. ‘దాదాపు 2,200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నివేదిక అందింది. పంట నష్టం సంభవించిన ప్రాంతాలను వెంటనే సందర్శించి రైతు వారీగా పంట నష్టం వివరాలు వెంటనే నివేదిక అందజేయాలి. పంట నష్టాన్ని తగ్గించే విధంగా రైతులకు ముందు జాగ్రత్తలు సూచించాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాస్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ మార్కెట్యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంట ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే 2 లక్షలకుపైగా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాం’ అని మంత్రి తెలిపారు.
రెండు ఎకరాల్లో ధాన్యం నేలరాలింది
- మట్టా రాము, బోర్గాం, నిజామాబాద్ జిల్లా
రెండెకరాల సొంత భూమితోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాను. మరో వారం రోజుల్లో కోతకు వస్తుందనగా వడగళ్లతో రెండెకరాలకు పైగా పంట దెబ్బతింది. గింజలు రాలిపోయి రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లింది.
కళ్ల ముందే మామిడికాయలు రాలిపోయాయి
- కొండేటి కనకయ్య, కూరెల్ల, సిద్దిపేట జిల్లా
అయిదెకరాల మామిడి తోట వేశాను. శనివారం ఈదురుగాలులకు నా కళ్లెదుటే కాయలన్నీ రాలిపోయాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది. నేలరాలిన కాయలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి