మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తేవాలి
‘‘మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు నిర్ధారించే విషయంలో ఒప్పందంలోని ఏ నిబంధననూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పాటించలేదు.
అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి
మొత్తం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు
పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం అర్థరహితం
నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్
ఈనాడు, హైదరాబాద్: ‘‘మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు నిర్ధారించే విషయంలో ఒప్పందంలోని ఏ నిబంధననూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పాటించలేదు. బ్యారేజీ కుంగినపుడు తమ సొంత నిధులతో పునరుద్ధరణ పనులు చేస్తామని గత ఏడాది డిసెంబరు 2న లేఖ రాసిన నిర్మాణ సంస్థ తర్వాత దురుద్దేశంతో యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే తుది ధ్రువీకరణ పత్రం గురించి ప్రస్తావిస్తోంది. అది ఏ మాత్రం సమంజసం కాదు. పని పూర్తయినట్లు తుది ధ్రువీకరణ పత్రం ఇచ్చే ముందు, తర్వాత నిబంధనల ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అసలు బ్యారేజీని పూర్తి చేసి అప్పగించే కార్యక్రమమే జరగలేదు’’ అని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు.
నిర్మాణ సంస్థ బ్యారేజీని సొంత నిధులతో యథాస్థితికి తేవాల్సి ఉందని, అలా చేయకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం చర్య తీసుకొని జరిగిన నష్టానికి సంబంధించిన మొత్తాన్ని నిర్మాణ సంస్థ నుంచి రికవరీ చేయాలని సూచించారు. 2021 మార్చి 15న పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు లేదా ఉపసంహరించుకొనే అంశాన్ని కూడా ఆలోచించాలని కోరారు. పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలు కూడా వెనక్కు ఇవ్వడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని, అనుబంధ ఒప్పందం చేసుకొని ఈ పనికి అయ్యే వ్యయాన్ని చెల్లిస్తేనే చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ నీరుపారుదల శాఖకు పలు దఫాలు లేఖలు రాసిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ (రామగుండం) నీటిపారుదల శాఖకు తాజాగా రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది. ఇందులో ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ లోపాలను నివేదించారు.
ముఖ్యాంశాలు ఇవీ...
- ‘‘మొదట ఈ పనిని రూ.1,849.30 కోట్లకు 24 నెలల్లో పూర్తి చేసేలా ఒప్పందం జరిగింది. తర్వాత ఈ పని అంచనా రూ.2,591 కోట్లకు, రూ.3,260 కోట్లకు.. 2022 ఏప్రిల్ నాటికి రూ.4,613 కోట్లకు చేరింది.
- బ్యారేజీ సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్లకు నష్టం జరిగిందని, ఈ పనులు చేయాలని 2020 మే 18న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాశారు. బ్యారేజీ దిగువన పనులను పూర్తి చేయడానికి, డీవాటరింగ్, దెబ్బతిన్న స్ట్రక్చర్లను తొలగించడానికి నాలుగైదు నెలల సమయం పడుతుందని అయితే కొవిడ్, లాక్డౌన్ కారణంగా అవసరమైన వనరులను సేకరించుకోవడం కష్టమని నిర్మాణ సంస్థ తెలిపింది. 2020 నవంబరు 7న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్... బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ సంస్థ ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్తోపాటు అదనపు పనులను కూడా పూర్తి చేసిందని, నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే చేపడతామని అండర్టేకింగ్ కూడా ఇచ్చిందని ఎస్ఈకి నివేదించారు. దీని ఆధారంగానే బ్యాంకు గ్యారంటీల విడుదలకు రాష్ట్ర స్థాయి స్డాండింగ్ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లాయి.
- రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనను పరిశీలించి చేసిన సిఫార్సు ఆధారంగా రూ.159.72 కోట్ల విలువ గల బ్యాంకు గ్యారంటీల విడుదలకు ఎస్ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ బ్యాంకు గ్యారంటీలను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విడుదల చేయలేదు. తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో ఆధారంగా 2021 జనవరి 23న విడుదల చేశారు.
- ఒప్పందంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలంటే బ్యారేజీ నిర్వహణ సమయంలో పునరుద్ధరణ పనులు ఉంటే చేస్తామని రాతపూర్వకంగా సంబంధిత ఇంజినీర్కు నిర్మాణ సంస్థ అండర్టేకింగ్ ఇవ్వాలి. ఈ నోటీసు అందిన 21 రోజుల్లో ఏయే పనులు ఇంకా చేయాల్సి ఉందో అధికారులు కాంట్రాక్టర్కు తెలపాలి. అన్ని పనులు పూర్తి చేసినట్లు, ఎలాంటి లోపాలు లేనట్లు భావిస్తే సర్టిఫికెట్ ఇవ్వాలి. పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో ఆ ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ తన అధీనంలోకి తీసుకోవాలి. ఈ పని నిర్మాణ సంస్థ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆ పైస్థాయి అధికారి సమక్షంలో జరగాలి. అయితే మేడిగడ్డలో అప్పటివరకు చేసిన పనికి మాత్రమే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని ఎస్ఈ నివేదించారు. కంప్లీషన్ సర్టిఫికెట్ అంటే మొత్తం పని పూర్తయినట్లు, అన్నీ సంతృప్తికరంగా ఉన్నట్లు నిర్ధారించినట్లు కాదు. మొత్తం పని పూర్తయ్యేంతవరకు కంప్లీషన్ సర్టిఫికెట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇచ్చిన సర్టిఫికెట్ టెండర్ ప్రక్రియ కోసమే.పైగా జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థ పునరుద్ధరించలేదు. రిలీజ్ అండ్ డిశ్ఛార్జి సర్టిఫికెట్ కూడా జారీ చేయలేదు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా తుది సర్టిఫికెట్ ఇవ్వలేదు. పైగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన వారం రోజుల్లో నిబంధన ప్రకారం సైట్ను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా ఆ పని జరగలేదు. ఈ సర్టిఫికెట్ జారీ చేయడంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, తీసుకోవడంలో నిర్మాణ సంస్థ ఒప్పందంలోని నిబంధనలను పాటించలేదు.
- మొత్తం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. కొన్ని పెండింగ్ పనులు, అదనపు పనులు జరుగుతున్నాయి. ఈ నేఫథ్యంలో పని పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం అర్థరహితం.
- బ్యాంకు గ్యారంటీల విడుదల విషయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్)ను తప్పుదోవ పట్టించే ఉద్దేశం మాకు లేదు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ, ఎస్ఈ నివేదిక ఆధారంగానే ప్రతిపాదించాం. అనుకోకుండా పొరపాటు జరిగింది... మన్నించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారు. దీంతోపాటు 2021 ఫిబ్రవరి 17న పెండింగ్ పనుల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మాణ సంస్థకు లేఖ రాశారు. ఈ పనులు ఇప్పటివరకు చేయలేదు.
- 2020 జనవరిలో గేట్లు మూసిన తర్వాత దిగువన ప్రొటెక్షన్ వర్క్స్, సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్ పక్కకు జరగడం, కొట్టుకుపోవడాన్ని గుర్తించాం. అప్పుడే బ్యారేజీ స్ట్రక్చర్ డిస్ట్రెస్ కండిషన్లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు సూచించాం. అయినా అది దెబ్బతిన్న పనులను బాగు చేసి బ్యారేజీకి తీవ్ర నష్టం వాటిల్లకుండా ఎలాంటి పటిష్ఠ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా పియర్/రాఫ్ట్ కుంగాయి. బ్యారేజీకి జరిగిన నష్టం గురించి 2020 మే 18నే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాశారు’’ అని చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?