తప్పులు ఒప్పుకొన్నాం.. బాధితులను ఆదుకుంటున్నాం
ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అప్పుడు జరిగిన తప్పును ఒప్పుకొని బాధితులను ఆదుకుంటున్నామని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏలను బలోపేతం చేస్తాం
గిరిజన అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి సీతక్క
ఇంద్రవెల్లి, న్యూస్టుడే: ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అప్పుడు జరిగిన తప్పును ఒప్పుకొని బాధితులను ఆదుకుంటున్నామని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజన అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శనివారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఇంటి స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. నాటి ఘటన తర్వాత ఆదివాసీ గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఐటీడీఏలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అటవీహక్కుల చట్టం తీసుకు వచ్చిందని గుర్తుచేశారు. భాజపా, భారాస ప్రభుత్వాలు ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతోపాటు అటవీ హక్కుల చట్టంను తుంగలో తొక్కి 10 ఏళ్లుగా హక్కుపత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కులు కల్పిస్తామని, ఐటీడీఏలను బలోపేతం చేస్తామన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని ఆదివాసీల చేతిలో ఉన్న సాగు భూముల్లోని ఖనిజ సంపదను భాజపా తన స్నేహితులకు దోచి పెట్టేందుకు వీరిపై ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. నివాళులర్పించిన వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాఠోడ్ బాపురావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ తదితరులు ఉన్నారు.
అమరులకు నివాళులు: ఎంపీ సోయం బాపురావు, భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, భారాస జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నలతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా గిరిజన అమరులకు నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం
కృష్ణా, గోదావరి నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కాగితాలు దాటని ఆదేశాలు.. ముంపు ముప్పులోనే పట్టణాలు
గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో 193 కాలనీలు నీట మునిగాయి.. వేల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. నీట మునిగిన కాలనీల నుంచి నాలుగైదు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
మనబడికి సౌరకాంతులేవీ?
‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సౌరఫలకాల ఏర్పాటు అర్ధంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో మూడో వంతు పనులు కాగానే నిధుల్లేవని పనులు ఆపేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?