భూ యజమానులకు తెలియకుండానే చేతులు మారిపోతున్నాయ్!
2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేవారు.
‘ధరణి’లో లొసుగులతో అందుకు ఆస్కారం
క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే లావాదేవీలు
ఏక కాల రిజిస్ట్రేషన్/మ్యుటేషన్తో ముప్పంటున్న నిపుణులు
తాజాగా ఓ భూ యజమాని కిడ్నాప్తో పోర్టల్లోని లోపాలు బహిర్గతం
2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేవారు. అనంతరం ఆ దస్త్రాన్ని రెవెన్యూ శాఖకు పంపితే తహసీల్దార్ కార్యాలయం పది రోజుల్లోపు మ్యుటేషన్ (రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కుల మార్పిడి) ప్రక్రియను ఉచితంగా చేపట్టేది. క్షేత్రస్థాయిలో విచారించి.. మ్యుటేషన్ పూర్తి చేసి.. పాసుపుస్తకం జారీ చేసేది.
- 2020 నవంబరు 2 నుంచి.. ధరణి చట్టం/పోర్టల్ అమల్లోకి వచ్చింది. తహసీల్దారు/సంయుక్త సబ్ రిజిస్ట్రార్ వద్ద ఏక కాలంలో రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ పూర్తి చేస్తున్నారు. మీ-సేవా కేంద్రంలో సదరు భూమికి సంబంధించి ఆ సర్వే నంబర్లోని మార్కెట్ ధర చెల్లించి, ఎకరాకు మ్యుటేషన్ ఫీజు రూ.2 వేలు చెల్లించి.. కేటాయించిన స్లాటు సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే క్షణాల వ్యవధిలో లావాదేవీ పూర్తవుతోంది. పోస్టులో పట్టా పాసుపుస్తకం వస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో విచారణేమీ చేయడం లేదు.
ఈనాడు, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా ఒకరి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా మార్పిడి చేసిన ఘటన రెండు రోజుల క్రితం పోలీసుల విచారణ సందర్భంగా వెలుగుచూసింది. రూ.కోట్ల విలువ చేసే ఆ భూమి యజమానికి ఇష్టం లేకపోవడంతో అతడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈవిషయం కనీసం అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. ఇందుకు సాంకేతికత, నిబంధనల్లోని లొసుగులే ఆస్కారమిచ్చాయన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ఉదంతాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ధరణిలో మార్పులు తీసుకొచ్చేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇలాంటి కీలక లోపాలను కట్టడి చేస్తే తప్ప అక్రమాలకు అడ్డుకట్ట పడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- బ్యాంకుల్లో నగదు లావాదేవీల తరహాలో భూ లావాదేవీలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే.. భూ యాజమాన్య హక్కును మార్పిడి చేస్తున్న విధానం దేశంలో ఇంకెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా లోపం జరిగితే సవరించుకునే వ్యవస్థ అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు.
- పోర్టల్లో జరిగిన లావాదేవీలపై చట్టబద్ధంగా విచారణ చేసే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), జిల్లా కలెక్టర్లకు ధరణి చట్టం కల్పించలేదు. గతంలో ఆర్వోఆర్ చట్టంలో ఫిర్యాదులపై విచారణ చేసే అధికారం తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భూముల ధరలు బాగా పెరగడంతో అక్రమ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి.
- మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లా గుర్రంపోడు తహసీల్దార్/సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ యజమాని ప్రత్యక్షంగా హాజరు కాకుండానే.. ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఓటీపీ లాంటివేమీ లేకుండానే భూ లావాదేవీని రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. బాధితులు పసిగట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టారు.
- సంగారెడ్డి జిల్లా కంకోల్కు చెందిన మడెప్ప అనే రైతుకు నాలుగు ఎకరాలు ఉండగా.. ఆయన ఖాతాలోకి ఆకస్మికంగా మరో రెండున్నర ఎకరాలు వచ్చిచేరాయి. తనది కాని భూమిని తొలగించాలంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండున్నర ఎకరాలను రైతు ఖాతా నుంచి తొలగించారు. దీంతోపాటు ఆయనకున్న నాలుగు ఎకరాలను కూడా వేరే రైతు పేరుపై మార్చేశారు.
- నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలానికి చెందిన ఓ రైతు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ రైతుకు తెలియకుండానే ఆయనకు బంధువయ్యే ఓ రైతు కొంత భూమిని వారసత్వ బదిలీ కింద తన పేరుపైకి మార్చేసుకున్నారు.
తిరిగి పరిశీలించే వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి
- సునీల్కుమార్, భూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు
మన దేశంలో మొదటి నుంచీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవస్థ, భూముల రికార్డుల వ్యవస్థలు వేర్వేరుగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఫీజులపై(స్టాంపుల చట్టం) దృష్టి పెడుతుంది. ఆర్వోఆర్ చట్టం ప్రకారం భూముల హక్కులను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తుంది. భూదస్త్రాల్లో మార్పులు.. చేర్పులు చేస్తుంది. దీనికి భిన్నంగా తెలంగాణలో రెవెన్యూశాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆర్వోఆర్ ప్రకారం విచారణ చేపట్టడం లేదు. ఇది చాలా పెద్ద లోపం. దీన్ని సరిచేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి. -
కొత్తగా 203 పంచాయతీల్లో బడులు
రాష్ట్రంలో కొత్తగా 203 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇదీ సంగతి!
-
హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ
కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. -
ఆలస్యానికి రూ.460 కోట్ల జరిమానా!
థర్మల్ విద్యుత్కేంద్రాల పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ భెల్(బీహెచ్ఈఎల్)కు తెలంగాణ జెన్కో భారీ జరిమానా విధించింది. కాంట్రాక్టు ఒప్పందాల గడువు దాటినా పూర్తిచేయకుండా జాప్యం చేస్తున్నందుకు రూ.460 కోట్లు కట్టాలని భెల్కు స్పష్టంచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!