భూ యజమానులకు తెలియకుండానే చేతులు మారిపోతున్నాయ్!
2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేవారు.
‘ధరణి’లో లొసుగులతో అందుకు ఆస్కారం
క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే లావాదేవీలు
ఏక కాల రిజిస్ట్రేషన్/మ్యుటేషన్తో ముప్పంటున్న నిపుణులు
తాజాగా ఓ భూ యజమాని కిడ్నాప్తో పోర్టల్లోని లోపాలు బహిర్గతం
2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేవారు. అనంతరం ఆ దస్త్రాన్ని రెవెన్యూ శాఖకు పంపితే తహసీల్దార్ కార్యాలయం పది రోజుల్లోపు మ్యుటేషన్ (రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కుల మార్పిడి) ప్రక్రియను ఉచితంగా చేపట్టేది. క్షేత్రస్థాయిలో విచారించి.. మ్యుటేషన్ పూర్తి చేసి.. పాసుపుస్తకం జారీ చేసేది.
- 2020 నవంబరు 2 నుంచి.. ధరణి చట్టం/పోర్టల్ అమల్లోకి వచ్చింది. తహసీల్దారు/సంయుక్త సబ్ రిజిస్ట్రార్ వద్ద ఏక కాలంలో రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ పూర్తి చేస్తున్నారు. మీ-సేవా కేంద్రంలో సదరు భూమికి సంబంధించి ఆ సర్వే నంబర్లోని మార్కెట్ ధర చెల్లించి, ఎకరాకు మ్యుటేషన్ ఫీజు రూ.2 వేలు చెల్లించి.. కేటాయించిన స్లాటు సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే క్షణాల వ్యవధిలో లావాదేవీ పూర్తవుతోంది. పోస్టులో పట్టా పాసుపుస్తకం వస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో విచారణేమీ చేయడం లేదు.
ఈనాడు, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా ఒకరి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా మార్పిడి చేసిన ఘటన రెండు రోజుల క్రితం పోలీసుల విచారణ సందర్భంగా వెలుగుచూసింది. రూ.కోట్ల విలువ చేసే ఆ భూమి యజమానికి ఇష్టం లేకపోవడంతో అతడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈవిషయం కనీసం అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. ఇందుకు సాంకేతికత, నిబంధనల్లోని లొసుగులే ఆస్కారమిచ్చాయన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ఉదంతాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ధరణిలో మార్పులు తీసుకొచ్చేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇలాంటి కీలక లోపాలను కట్టడి చేస్తే తప్ప అక్రమాలకు అడ్డుకట్ట పడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- బ్యాంకుల్లో నగదు లావాదేవీల తరహాలో భూ లావాదేవీలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే.. భూ యాజమాన్య హక్కును మార్పిడి చేస్తున్న విధానం దేశంలో ఇంకెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా లోపం జరిగితే సవరించుకునే వ్యవస్థ అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు.
- పోర్టల్లో జరిగిన లావాదేవీలపై చట్టబద్ధంగా విచారణ చేసే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), జిల్లా కలెక్టర్లకు ధరణి చట్టం కల్పించలేదు. గతంలో ఆర్వోఆర్ చట్టంలో ఫిర్యాదులపై విచారణ చేసే అధికారం తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భూముల ధరలు బాగా పెరగడంతో అక్రమ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి.
- మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లా గుర్రంపోడు తహసీల్దార్/సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ యజమాని ప్రత్యక్షంగా హాజరు కాకుండానే.. ఆధార్ కార్డు, సెల్ఫోన్ ఓటీపీ లాంటివేమీ లేకుండానే భూ లావాదేవీని రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. బాధితులు పసిగట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టారు.
- సంగారెడ్డి జిల్లా కంకోల్కు చెందిన మడెప్ప అనే రైతుకు నాలుగు ఎకరాలు ఉండగా.. ఆయన ఖాతాలోకి ఆకస్మికంగా మరో రెండున్నర ఎకరాలు వచ్చిచేరాయి. తనది కాని భూమిని తొలగించాలంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండున్నర ఎకరాలను రైతు ఖాతా నుంచి తొలగించారు. దీంతోపాటు ఆయనకున్న నాలుగు ఎకరాలను కూడా వేరే రైతు పేరుపై మార్చేశారు.
- నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలానికి చెందిన ఓ రైతు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ రైతుకు తెలియకుండానే ఆయనకు బంధువయ్యే ఓ రైతు కొంత భూమిని వారసత్వ బదిలీ కింద తన పేరుపైకి మార్చేసుకున్నారు.
తిరిగి పరిశీలించే వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి
- సునీల్కుమార్, భూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు
మన దేశంలో మొదటి నుంచీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవస్థ, భూముల రికార్డుల వ్యవస్థలు వేర్వేరుగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్, ఫీజులపై(స్టాంపుల చట్టం) దృష్టి పెడుతుంది. ఆర్వోఆర్ చట్టం ప్రకారం భూముల హక్కులను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తుంది. భూదస్త్రాల్లో మార్పులు.. చేర్పులు చేస్తుంది. దీనికి భిన్నంగా తెలంగాణలో రెవెన్యూశాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆర్వోఆర్ ప్రకారం విచారణ చేపట్టడం లేదు. ఇది చాలా పెద్ద లోపం. దీన్ని సరిచేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?