బియ్యం బకాయిలున్నా.. మళ్లీమళ్లీ ధాన్యం!
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రతి సీజన్లో మిల్లర్లకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని మర ఆడించి, బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) అప్పగించాలి.
కొందరు మిల్లర్లకు ప్రత్యేక కేటాయింపులు
రూ. వందల కోట్ల మేర సీఎంఆర్ బకాయిలు
రైస్ మిల్లుల్లో నాలుగో వంతు లీజుదారుల చేతుల్లోనే..
విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు
ఈనాడు, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రతి సీజన్లో మిల్లర్లకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని మర ఆడించి, బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) అప్పగించాలి. ఎవరైనా చివరి గడువు తర్వాత కూడా ఇవ్వకపోతే తర్వాత సీజన్లో ఆ మిల్లరుకు ధాన్యం కేటాయింపులు ఆపేయాలి. కానీ అధికారులతో అవగాహన ఉన్న, రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు మిల్లర్లకు ఆ తర్వాత కూడా రెండు మూడేళ్ల పాటు ధాన్యం కేటాయింపులు జరిగాయి. గత మూడేళ్లలో రాష్ట్రంలోని పలుచోట్ల ఇదే పరిస్థితి. దీంతో ఆయాచోట్ల ఒక్కో మిల్లరు నుంచి రూ.పదుల కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయాయి. ఎట్టకేలకు ఈ అక్రమాలపై పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించడం, విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తుండటంతో ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. కేసులు పెడుతుండటంతో కొందరు మిల్లు యజమానులు విదేశాలకు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరికొన్నిచోట్ల మిల్లుల్ని లీజుదారులే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బకాయిపడిన రూ.వందల కోట్ల సీఎంఆర్ వసూలు చేయడం పౌరసరఫరాల సంస్థకు సవాలుగా మారింది.
వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు..!
రైస్మిల్లు ఉంటే చాలు.. ధాన్యం వస్తుంది. మర ఆడించి బియ్యాన్ని ఇస్తే ఆ ఛార్జీలతో పాటు పొట్టు, తవుడు కూడా మిల్లరుకే వెళుతుంది. అయితే మిల్లర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటిని తర్వాత సీజన్లో వచ్చే వడ్లతో తాత్కాలిక సర్దుబాటు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు చిన్న చిన్న రైస్మిల్లులను అద్దెకు తీసుకుని.. పైరవీలతో ఎక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 2,600 రైస్ మిల్లులు ఉంటే.. ఇందులో 25% వరకూ లీజుదారుల చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
వసూలు ఎలా?
ఓ జిల్లాలో భారీ సీఎంఆర్ బకాయిలున్న మిల్లరును పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. మరో భాగస్వామి దుబాయ్ పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టేది లేదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. అతణ్ని పట్టుకురావడం ఓ సవాలు అయితే.. ఆ మిల్లరు చెల్లిస్తే గానీ సీఎంఆర్ బకాయిలు వచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా మిల్లర్లకు ధాన్యం ఇస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్క సూర్యాపేట జిల్లాల్లోనే మిల్లర్లు రూ.300 కోట్ల మేర సీఎంఆర్ బకాయిలు ఉన్నారు. ఇటీవల ఆరుగురు మిల్లర్లపై కేసులు పెట్టారు. మెదక్ జిల్లాలో ఏడుగురు మిల్లర్లపై కేసులు పెట్టి యజమానుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.114 కోట్ల మేర సీఎంఆర్ బకాయిలు రావాల్సి ఉంది.
దిద్దుబాటు చర్యలు..
నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. మెదక్ జిల్లాలో 172 రైస్ మిల్లులు ఉన్నాయి. దాంతో 2023-24లో 111 మిల్లులకే ధాన్యం కేటాయిస్తున్నారు. ‘‘2021-22, 2022-23 సంవత్సరాల్లో బకాయిల విషయంపై అవగాహన లేక కొన్ని మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయించిన విషయం వాస్తవమే. గత సెప్టెంబరులో నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించా. అక్టోబరులో పలు మిల్లుల నుంచి దాదాపు 9 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నాం’’ అని మెదక్ జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..