తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు.
కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక
మహా నగర అవసరాలకు 10.. మూసీ ప్రక్షాళనకు 5 టీఎంసీలు
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,800 కోట్లు
సీఎం రేవంత్రెడ్డి ఆమోద ముద్ర!
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. రూ.4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. హడ్కో ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించారు. దీనికి హడ్కో దాదాపు ఆమోద ముద్ర వేయబోతోందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాలకు ప్రతి రోజూ 570 మిలియన్ గ్యాలన్ల(ఎంజీడీ) నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు ఈ నీటి సరఫరా సరిపోతున్నా 2050 నాటికి రోజూ దాదాపు వెయ్యి ఎంజీడీల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. మహా నగరం విస్తరిస్తుండటంతో ఇప్పటి నుంచి గోదావరి, కృష్ణా నదుల నుంచి అదనంగా నీటిని రాజధానికి తరలించగలిగితేనే రాబోయే అవసరాలు తీరతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సర్కారు ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా ప్రతిరోజూ 170 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి రెండో దశ కింద నీటిని నగరానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకు 82 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మిస్తారు. ఈ పైపులైనుతో ఏటా పది టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు, మరో అయిదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనకు వినియోగించాలని నిర్ణయించారు. ఈ పైపులైను ద్వారా నీటిని ఘన్పూర్ వద్ద నిర్మించే మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపు హౌస్, నీటిశుద్ధి కేంద్రం దగ్గరకు తెస్తారు. జన్వాడ వద్ద మరో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇలా ప్రతిరోజూ 170 ఎంజీడీల నీటిని శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తారు. కొండపోచమ్మ నుంచి తెచ్చే నీటిలో కొంత భాగాన్ని నగరానికి చుట్టూ ఉన్న అతి పెద్ద చెరువుల్లో కూడా నింపాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇలా పది టీఎంసీల నీటిని నగర తాగునీటి అవసరాలకు, చెరువులు నింపడానికి వినియోగిస్తారు. ఐదు టీఎంసీల నీటిని నేరుగా పైపులైన్ ద్వారా తెచ్చి జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్(గండిపేట), హిమాయత్సాగర్లో నింపుతారు.
హడ్కోతో చర్చలు...
రూ.50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలని నిపుణులు సూచించారు. కొండపోచమ్మ నుంచి జంట జలాశయాలకు వచ్చే ఈ అయిదు టీఎంసీల నీటిలో అవసరమైన మేరకు ప్రతి రోజూ మూసీలోకి పంపి నదిని శుభ్రం చేసే కార్యక్రమం చేపడతారని పురపాలక శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.4,800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుపై ఎన్నికల షెడ్యూల్ రాకముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పురపాలక శాఖ అధికారులతో చర్చించారు. నగరానికి ఇదో ముఖ్యమైన ప్రాజెక్టు అవుతుంది కాబట్టి వెంటనే నిర్మాణ కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. నిధుల సమీకరణలో భాగంగా హడ్కోతో చర్చలు జరపనున్నారు. హడ్కో దీనికి నిధులు మంజూరుచేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తరువాత ఈ ప్రాజెక్టు అమలుపై కీలకమైన ఆదేశాలు వెలువడతాయని తెలుస్తోంది.
ప్రత్యేక భూసేకరణ అవసరం లేకుండా..
గోదావరి ఫేజ్-1 వరకు రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కోసం పలు ప్రాంతాల్లో జలమండలి అప్పట్లో భూములు సేకరించింది. ఫేజ్-1, 2 ప్రాజెక్టులకు సరిపోయేంత భూమి అందుబాటులో ఉంది. పైపులైన్ల కోసం కూడా పెద్దగా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని సేకరించి శుద్ధి చేసి మూడు విడతల్లో పంపింగ్ చేసి నగరానికి తరలిస్తున్నారు. ఫేజ్-1 వరకు అప్పట్లో రూ.3,500 కోట్ల నుంచి రూ.3,800 కోట్ల వరకు ఖర్చుచేశారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుకు పెద్దగా భూములను సేకరించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు