తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు.
కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక
మహా నగర అవసరాలకు 10.. మూసీ ప్రక్షాళనకు 5 టీఎంసీలు
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,800 కోట్లు
సీఎం రేవంత్రెడ్డి ఆమోద ముద్ర!
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. రూ.4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. హడ్కో ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించారు. దీనికి హడ్కో దాదాపు ఆమోద ముద్ర వేయబోతోందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాలకు ప్రతి రోజూ 570 మిలియన్ గ్యాలన్ల(ఎంజీడీ) నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు ఈ నీటి సరఫరా సరిపోతున్నా 2050 నాటికి రోజూ దాదాపు వెయ్యి ఎంజీడీల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. మహా నగరం విస్తరిస్తుండటంతో ఇప్పటి నుంచి గోదావరి, కృష్ణా నదుల నుంచి అదనంగా నీటిని రాజధానికి తరలించగలిగితేనే రాబోయే అవసరాలు తీరతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సర్కారు ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా ప్రతిరోజూ 170 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి రెండో దశ కింద నీటిని నగరానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకు 82 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మిస్తారు. ఈ పైపులైనుతో ఏటా పది టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు, మరో అయిదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనకు వినియోగించాలని నిర్ణయించారు. ఈ పైపులైను ద్వారా నీటిని ఘన్పూర్ వద్ద నిర్మించే మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపు హౌస్, నీటిశుద్ధి కేంద్రం దగ్గరకు తెస్తారు. జన్వాడ వద్ద మరో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇలా ప్రతిరోజూ 170 ఎంజీడీల నీటిని శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తారు. కొండపోచమ్మ నుంచి తెచ్చే నీటిలో కొంత భాగాన్ని నగరానికి చుట్టూ ఉన్న అతి పెద్ద చెరువుల్లో కూడా నింపాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇలా పది టీఎంసీల నీటిని నగర తాగునీటి అవసరాలకు, చెరువులు నింపడానికి వినియోగిస్తారు. ఐదు టీఎంసీల నీటిని నేరుగా పైపులైన్ ద్వారా తెచ్చి జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్(గండిపేట), హిమాయత్సాగర్లో నింపుతారు.
హడ్కోతో చర్చలు...
రూ.50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలని నిపుణులు సూచించారు. కొండపోచమ్మ నుంచి జంట జలాశయాలకు వచ్చే ఈ అయిదు టీఎంసీల నీటిలో అవసరమైన మేరకు ప్రతి రోజూ మూసీలోకి పంపి నదిని శుభ్రం చేసే కార్యక్రమం చేపడతారని పురపాలక శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.4,800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుపై ఎన్నికల షెడ్యూల్ రాకముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పురపాలక శాఖ అధికారులతో చర్చించారు. నగరానికి ఇదో ముఖ్యమైన ప్రాజెక్టు అవుతుంది కాబట్టి వెంటనే నిర్మాణ కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. నిధుల సమీకరణలో భాగంగా హడ్కోతో చర్చలు జరపనున్నారు. హడ్కో దీనికి నిధులు మంజూరుచేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల తరువాత ఈ ప్రాజెక్టు అమలుపై కీలకమైన ఆదేశాలు వెలువడతాయని తెలుస్తోంది.
ప్రత్యేక భూసేకరణ అవసరం లేకుండా..
గోదావరి ఫేజ్-1 వరకు రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కోసం పలు ప్రాంతాల్లో జలమండలి అప్పట్లో భూములు సేకరించింది. ఫేజ్-1, 2 ప్రాజెక్టులకు సరిపోయేంత భూమి అందుబాటులో ఉంది. పైపులైన్ల కోసం కూడా పెద్దగా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని సేకరించి శుద్ధి చేసి మూడు విడతల్లో పంపింగ్ చేసి నగరానికి తరలిస్తున్నారు. ఫేజ్-1 వరకు అప్పట్లో రూ.3,500 కోట్ల నుంచి రూ.3,800 కోట్ల వరకు ఖర్చుచేశారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుకు పెద్దగా భూములను సేకరించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పునర్విచారణ
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిమాణం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. -
రాష్ట్రంలో బోర్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చండి
రాష్ట్రంలో ఏయే కేటగిరీల కింద ఎన్ని బోర్లు ఉన్నాయో లెక్కలు తేల్చాలని భూగర్భ జలవనరుల మదింపుపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలకు సూచించింది. -
తాగునీళ్లు ఇచ్చేందుకు కర్ణాటక సానుకూలత!
తెలంగాణకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కొంత నీటిని ఇచ్చేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. -
అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం!
పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. -
అదనపు ఆదాయానికి ఆర్టీసీ అధికారుల ఒత్తిడి
బస్సులతో అదనపు ఆదాయం తేవాలంటూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి పెంచుతోందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్డబ్ల్యూయూ) మండిపడింది. -
సెంచరీ దాటిన బీన్స్ ధర
బీన్స్ ధర సెంచరీ దాటింది. శుక్రవారం హైదరాబాద్లోని రైతుబజార్లలో కిలో బీన్స్ ధర రూ.105గా నిర్ణయించారు. -
రూ.12 కోట్ల ఎగవేత.. రైస్ మిల్లు సీజ్
కస్టమ్ మిల్లింగ్ రైస్ను అప్పగించకుండా నాలుగేళ్లుగా జాప్యం చేస్తున్న రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. -
భారాస ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ నేతలపై పలువురు చేస్తున్న అసత్య ఆరోపణల నియంత్రణకు గూగుల్, యూట్యూబ్ చర్యలు తీసుకోవడం లేదంటూ భారాస చేసిన ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్రంలో బాలింతల మరణాలను నివారించాలి
అత్యాధునిక వైద్య వసతులను ఉపయోగించుకుని రాష్ట్రంలో బాలింతల మరణాలను పూర్తిగా నివారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!