ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. ఎంపీసీ ఫస్టియర్లో ఏన్కూరు గురుకుల విద్యార్థికి 468, బైపీసీలో నెక్కొండ విద్యార్థినికి 437 మార్కులు వచ్చాయంది.
- తమ విద్యార్థులు అత్యధికంగా ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో 983 మార్కులు, ఎంఈసీలో 973, సీఈసీలో 967 మార్కులు సాధించినట్లు మోడల్ స్కూళ్ల అదనపు డైరెక్టర్ తెలిపారు.
- కొడంగల్ కేజీబీవీ విద్యార్థి ఎంపీసీలో అత్యధికంగా 988 మార్కులు పొందారని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులు రెండో సంవత్సరంలో 84.07 శాతం, మొదటి సంవత్సరంలో 75.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సొసైటీ కార్యదర్శి కె.సీతాలక్ష్మి తెలిపారు.
- గిరిజన గురుకుల విద్యార్థులు రెండో సంవత్సరంలో 83.59 శాతం, మొదటి సంవత్సరంలో 70.18 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.
- బీసీ గురుకుల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 84.80 శాతం, మొదటి సంవత్సరంలో 71.17 శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు.
ఇంటర్లో శ్రీచైతన్య హవా
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో తమ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించారని శ్రీ చైతన్య తెలిపింది. ఎంపీసీలో ఐదుగురు 993 (స్టేట్ టాప్) మార్కులు, బైపీసీలో 994 (స్టేట్ టాప్) మార్కులు సాధించినట్లు వెల్లడించింది. 83 మంది 993 మార్కులు పైన సాధించారని పేర్కొంది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 26 మంది 470కి 468 మార్కులు, బైపీసీలో 19 మంది 440కి 438 మార్కులు సాధించినట్లు తెలిపింది. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ బొప్పన అభినందించారు.
నారాయణ విద్యార్థుల ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. ఎంపీసీలో తమ విద్యార్థులు ముగ్గురు 993 మార్కులు సాధించారని సంస్థ తెలిపింది. బైపీసీ విభాగంలోనూ స్టేట్ టాప్ మార్కు 994 మార్కులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని పేర్కొంది. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బోర్డు చరిత్రలోనే 470కి 469 మార్కులను సాధించారని తెలిపింది. విద్యార్థులను నారాయణ గ్రూపు డైరెక్టర్లు సిధూర నారాయణ, శరణి నారాయణ అభినందించారు.
రెసోనెన్స్ అద్భుత ఫలితాలు
రెసోనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఎంపీసీలో అత్యధికంగా 992 మార్కులు, బైపీసీలో 982 మార్కులు సాధించినట్లు యజమాన్యం పేర్కొంది. ఎంపీసీలో టాప్ 5 మార్కులను తమ విద్యార్థులు 9 మంది, జూనియర్ ఎంపీసీలో టాప్ 5 మార్కులను తమ విద్యార్థులు 155 మంది, బైపీసీలో టాప్ 5 మార్కులను 13 మంది సాధించిన వారిని విద్యాసంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు అభినందించారు.
అల్ఫోర్స్ ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీలో తమ విద్యార్థులు ఇద్దరు 993 మార్కులు, ఇద్దరు 992 మార్కులు సాధించినట్లు విద్యా సంస్థ వెల్లడించింది. బైపీసీలో ముగ్గురు 990 మార్కులు పొందినట్లు తెలిపింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 16 మంది 468 మార్కులు, జూనియర్ బైపీసీలో ఒక విద్యార్థిని 438 మార్కులు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి అభినందించారు.
ఎస్ఆర్ విద్యార్థుల విజయభేరి
ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. తమ విద్యార్థికి ఎంపీసీలో 993 గరిష్ఠ మార్కులు వచ్చాయని విద్యా సంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. 14 మందికి 990, ఆపైన మార్కులు వచ్చాయన్నారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 13 మంది 468 మార్కులు, బైపీసీలో ముగ్గురు 438 మార్కులు తెచ్చుకున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్