సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.
భూమిపుత్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీశ్రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత శ్రీనివాసయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఈనాడు, హైదరాబాద్
డబుల్ ఓట్లను గుర్తించి తొలగించాలి
ఈసీకి జి.నిరంజన్ లేఖ
హైదరాబాద్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లేసిన వారికి హైదరాబాద్లో కూడా ఓటు ఉన్నట్లైతే ఆ ఓటును తొలగించాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు శుక్రవారం లేఖ రాశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున రెండు చోట్ల ఓట్లు ఉన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈసీని లేఖలో కోరారు.
గనుల శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా బదిలీ
ఈనాడు, హైదరాబాద్: గనుల శాఖ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదే విధంగా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) వీసీ, ఎండీగా ఆయన అదనపు బాధ్యతలు వహిస్తుండగా వాటి నుంచి కూడా ఆయన్ను రిలీవ్ చేసింది. మహేశ్దత్ ఎక్కా స్థానంలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎస్ అధికారి కె.సురేంద్రమోహన్ను గనుల శాఖ కార్యదర్శిగా నియమించింది. అదేవిధంగా సురేంద్రమోహన్కు టీఎస్ఎండీసీ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రమోహన్ గతంలో గవర్నర్ కార్యదర్శిగా పనిచేశారు. ఎక్కాను జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
పీఆర్సీ ఛైర్మన్కు ఉద్యోగుల ప్రతిపాదనలు
ఖైరతాబాద్, న్యూస్టుడే: తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ పీఆర్సీ ఛైర్మన్ ఎన్.శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించింది. శుక్రవారం బీఆర్కే భవన్లో పీఆర్సీ ఛైర్మన్ను కలిసిన సంఘం ప్రతినిధులు 40 శాతం ఫిట్మెంట్, వంద శాతం రుణాల (అడ్వాన్సు) పెంపు, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మంజూరు, హెల్త్ కార్డులు, పెన్షన్ స్ట్రక్చర్, అదనపు పెన్షన్, పాత పెన్షన్ అమలు, ఆర్జిత సెలవుల జమపై ఉన్న పరిమితి ఎత్తివేయడం తదితర అంశాలపై చర్చించారు. తమ ప్రతిపాదనలకు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఛైర్మన్ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మఠం రవీంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి సి.హరీశ్ కుమార్రెడ్డి, గౌరవ ఛైర్మన్ ఎ.పద్మాచారి, ఉపాధ్యక్షుడు జి.జాకబ్ తదితరులు ఉన్నారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించండి: టీఈఏ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసినందున శనివారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి.నిర్మల్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీ నుంచి నివేదిక తెప్పించుకొని కొత్త పీఆర్సీని 40 శాతం ఫిట్మెంట్తో ప్రకటించాలని, 317 జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించాలని, రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన నాలుగు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఆమె కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో పలువురు సినీ దర్శకులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. దర్శకులు హరీశ్శంకర్, అనిల్ రావిపూడి, వీరశంకర్ తదితరులు సీఎంను కలిశారు. వీరివెంట కాంగ్రెస్ నేత రోహిణ్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎస్సెల్బీసీ పనుల్లో వేగం పెంచండి: రాహుల్ బొజ్జా
ఈనాడు, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు సొరంగం (ఎస్సెల్బీసీ) పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఈ పనులపై సమీక్ష నిర్వహించారు. సొరంగంలో సీపేజీ ఏర్పడటంతో నిలిచిపోయిన పనులను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక ప్రాంతాలకు తాగు, సాగునీరు అందనుంది.
మరో రెండేళ్లు ఎఫ్ఎంజీల ఇంటర్న్షిప్ గడువు పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ)లు ఇంటర్న్షిప్ చేసేందుకు మరో రెండేళ్లు గడువు పొడిగిస్తూ జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలతో గడువు ముగుస్తుండటంతో దానిని 2026 మే వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్ కౌన్సిళ్లు, ఎఫ్ఎంజీల విజ్ఞప్తిమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
బౌద్ధ పర్యాటకుల్ని రప్పించేలా ప్రణాళిక
ఏబీటీవో ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ బౌద్ధ పర్యాటక స్థలాలతోపాటు బుద్ధవనాన్ని ఆసియా దేశాలకు పరిచయం చేసి, అధిక సంఖ్యలో బౌద్ధ పర్యాటకులను రాష్ట్రానికి రప్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏబీటీవో ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. భూటాన్లోని థింపూలో శుక్రవారం జరిగిన ‘ఆసియా రహదారిపై బౌద్ధ పర్యాటకం’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి పర్యాటక రంగం సాంస్కృతిక సారథిగా వ్యవహరించాలన్నారు. అంతర్జాతీయ సంతోష యాత్ర (ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ మార్చ్)ను నిర్వహించడానికి భూటాన్ బౌద్ధ సంస్థల ప్రతినిధులతో సన్నాహక చర్యలను ప్రారంభించినట్లు లక్ష్మయ్య చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం