శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్‌ తీగల వంతెన

ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్‌-నాగర్‌కర్నూల్‌-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది.

Updated : 18 May 2024 05:07 IST

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం
డీపీఆర్‌ను సిద్ధం చేయిస్తున్న కేంద్రం

శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ప్రస్తుతం ఉన్న వంతెన

ఈనాడు, అమరావతి: ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్‌-నాగర్‌కర్నూల్‌-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. అది కూడా ఏపీ-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నదిపైనే నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో, దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమవుతోంది. దోర్నాల నుంచి శ్రీశైలం క్రాస్‌రోడ్‌ (శ్రీశైలం ముఖద్వారం), సున్నిపెంట మీదగా కృష్ణానదిపై వంతెన దాటే వరకు 53.5 కి.మీ. మేర విస్తరించేలా డీపీఆర్‌ను కేంద్రం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. దీనికి సమీపంలో ఐకానిక్‌ తీగల వంతెన నిర్మించనుంది. ఈ వంతెనకే రూ.వెయ్యి కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని