నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Published : 18 May 2024 04:39 IST

రేపు నికోబార్‌ దీవులకు నైరుతి రుతుపవనాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల వరకు విస్తరిస్తాయని తెలిపింది. మరోవైపు శని, ఆదివారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షాలు కురవనున్నాయి. 

శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 4.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో 4.7, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం పెద్దంపేట 4.3, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తంగుల 3.2, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో 2.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా కురిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు