విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో ‘సైదీ సైఫీ’ విధానం అమలు
అటవీ ప్రాంతాల్లో ‘ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్’
ఇటీవల ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలోని ఎస్ఎస్ కౌటాల విద్యుత్
ఉపకేంద్రాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న సీఎండీ వరుణ్రెడ్డి
ఈనాడు, వరంగల్: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిస్కం పరిధిలో ఉన్న 16 సర్కిళ్లకు 16 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరు విద్యుత్ సరఫరా నష్టాలను తగ్గించి, నాణ్యత పెంచడంతోపాటు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు. మరోవైపు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎక్కడ కలిగింది, ఎంత సమయం కరెంటు నిలిచిపోయిందనే వివరాలు పక్కాగా తెలుసుకునేందుకు ‘సైదీ సైఫీ’ విధానం అమలు చేస్తున్నారు. దీని ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్వహణ చేపడుతుండటంతో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యం 33 శాతం తగ్గినట్టు అధికారులు గుర్తించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి చోట్ల దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఫీడర్లు ఉన్నచోట రూ.13 కోట్లతో ‘ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్’ విధానం ప్రారంభించనున్నారు. దీనివల్ల ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అంతరాయం ఎక్కడ ఏర్పడిందో కనుగొని, సేవలను వెంటనే పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ‘కవ్వాల్’ అభయారణ్యంలో ఉప కేంద్రం నుంచి ఫీడర్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటిచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే కొత్త విధానంలో సత్వరంగా సేవలు పునరుద్ధరిస్తారు. మరోవైపు, వర్షాకాలం నేపథ్యంలో రాత్రివేళల్లోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా సీఎండీ వరుణ్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. కరెంటు సరఫరా పరిస్థితిని పరిశీలించేందుకు ఆయన అర్ధరాత్రి పూట కూడా సబ్స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
మేటి సేవలు అందించే ఉద్యోగులకు బహుమతులు
ఎన్పీడీసీఎల్ పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయాలను గణనీయంగా తగ్గించి, వినియోగదారులకు మేలైన సేవలు అందించేందుకు ఉద్యోగుల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు ‘బెస్ట్ పర్ఫార్మర్స్ ఆఫ్ ద మంత్’ పేరుతో బహమతులు ఇవ్వాలని సీఎండీ నిర్ణయించారు. ఇంజినీరింగ్ అధికారుల నుంచి జూనియర్ లైన్మెన్ల వరకు వీటిని ఇస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 16 సర్కిళ్లలో 54 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. ఇలా ప్రతి నెలా మేటి పనితనం కనబరిచిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా దశాబ్ది సంబురం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న (ఆదివారం) ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయింది. -
బినామీ ఖాతాలతో మేశారు
గొర్రెల పథకం కుంభకోణంలో దళారులు, అధికారులు కలిసి సుమారు రూ.700 కోట్ల నిధులు కాజేసిన తీరు అవినీతి నిరోధక శాఖ(అనిశా) దర్యాప్తులో తేటతెల్లమైంది. -
హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని
తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందన్నారు. -
పార్టీలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు: మంత్రి పొన్నం
పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు శనివారం పరిశీలించారు. -
అణువణువూ పరిశీలన...
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా ఇందులో భాగమైన సాంకేతిక నిపుణుల బృందం శనివారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించింది. -
నేటి నుంచి టోల్ పెంపు
ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. -
న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆ దేశంలో ఆక్ల్యాండ్ నగరంలోని అవండేల్ కళాశాల ఆడిటోరియంలో శనివారం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. -
గంజాయి సాగు చేస్తే రైతు భరోసా నిలిపివేత
తెలంగాణలో మాదక ద్రవ్యాలను, మత్తు పదార్థాల వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో అరికట్టే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. -
సింగరేణికి అత్యుత్తమ పనితీరు అవార్డు
సంస్థ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సింగరేణి సంస్థకు, ఆ సంస్థ సీఎండీ బలరాంకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) సంస్థ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. -
ఘనంగా కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన దీక్షాపరులు, భక్తుల రామ నామస్మరణతో క్షేత్రం మారుమోగింది. -
బ్యాంకులు ప్రజలకు ఇంకా దగ్గర కావాలి
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
ఇదీ సంగతి!
-
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. -
అమల్లోకి ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై మూడు నెలల్లో నివేదిక
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ జరిపి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడించారు. -
వాటాల బదలాయింపు కేసులో నిందితులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఓ ప్రైవేటు కంపెనీలోని వాటాల బదలాయింపు కేసులో నిందితులైన రాజశేఖర్ తలసిల్ల, చంద్రశేఖర్ వేగెలను అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
యాదాద్రి మే నెల ఆదాయం రూ.18.49 కోట్లు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మే నెలలో భక్తుల ద్వారా లభించిన ఆదాయ వివరాలను దేవస్థానం శనివారం విడుదల చేసింది. మే నెలలో ఆలయానికి అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా రూ.18.49 కోట్లు సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది. -
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దు: భట్టి
త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని స్థాయుల్లోని విద్యుత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు. -
రైతులకు మేలు చేసే పథకాలనే అమలు చేస్తాం
రాష్ట్రంలో అన్నదాతలకు అన్ని విధాలుగా మేలు కలిగించే పథకాలనే అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సమగ్రాభివృద్ధి కోసం రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమాలను రూపొందిస్తున్నామన్నారు. -
సంక్షిప్త వార్తలు(9)
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 1.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్లు వివరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
-
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి