వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.
టన్ను కార్బన్ డయాక్సైడ్తో సమాజానికి రూ.88 వేల నష్టం
అమెరికాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ పరిశోధనలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినా ప్రపంచ జీడీపీ క్రమేపీ తగ్గుతోందని, కొన్ని సందర్భాల్లో గరిష్ఠంగా 12 శాతం వరకు నష్టం కలుగుతోందని తెలిపింది. పారిశ్రామికీకరణ తర్వాత చోటుచేసుకున్న వాతావరణ మార్పులతో కలిగిన నష్టాలు.. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన ఆర్థిక, సామాజిక, పర్యావరణ విధ్వంసం కన్నా ఎక్కువని వెల్లడించింది. కర్బన ఉద్గారాల పెరుగుదల, ఉష్ణోగ్రతల్లో మార్పులతో విపత్తులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ సమాజానికి రూ.87,965 ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని వెల్లడించింది. అమెరికాలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ‘‘వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం- అంతర్జాతీయ, స్థానిక ఉష్ణోగ్రతలు’’ పేరిట పరిశోధన పత్రం విడుదల చేసింది. ఈ పరిశోధనలో హార్వర్డ్ యూనివర్సిటీ అర్థశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆడ్రియన్ బిలాల్, నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ అర్థశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డియాగో ఆర్.కాన్జిగ్ పాల్గొన్నారు. 1960కి ముందు నుంచి ఇప్పటివరకు వివిధ దేశాలు, అంతర్జాతీయ ఉష్ణోగ్రతలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావంపై వీరు పరిశోధన చేశారు. జీరో కార్బన్ దిశగా స్థానిక ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ ఖర్చు అమెరికా లాంటి పెద్ద దేశాలు భరించలేని స్థాయికి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నివేదికలో ఏముందంటే...
- పేద, మధ్య, ధనిక దేశాల్లో మధ్యస్థాయి వాతావరణ మార్పుల హెచ్చరికలతో ఉత్పాదక నష్టాలు పెరుగుతున్నాయి. ఉష్ణతాపం, వాతావరణ మార్పులు ఇలాగే పెరిగితే 2050 నాటికి ప్రపంచ ఉత్పాదకత 30 శాతానికి, 2100 నాటికి 50 శాతానికి తగ్గే ప్రమాదముంది.
- డీకార్బనైజేషన్ విధానాలకు ఖర్చు బాగా పెరిగింది. టన్ను కార్బన్ డయాక్సైడ్ డీకార్బనైజేషన్కు రూ.2,249 నుంచి రూ.7,913 వరకు ఖర్చవుతోంది. అమెరికాలో ఈ ఖర్చు 30 డాలర్ల (రూ.2499) నుంచి 211 డాలర్ల (రూ.17,576)కు పెరిగింది.
- 1960 నుంచి 2024 వరకు గణాంకాలను పరిశీలిస్తే.. భూతాపం పెరగకుండా ఉంటే ఈరోజు ప్రపంచ తలసరి జీడీపీ 37 శాతం ఎక్కువగా ఉండేది. కానీ, భూతాపం 0.75 శాతం పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధిలో 29 శాతం కోత పడింది.
- 1960కు ముందుతో పోల్చితే ప్రపంచ సాధారణ ఉష్ణోగ్రతలు 2100 నాటికి 4 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2023 నాటికి సగటు ఉష్ణోగ్రత 1.48 డిగ్రీలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల చొప్పున పెరిగితే ఉత్పాదక ఖర్చులు తీవ్రంగా పెరిగి ఆదాయ వనరులు 60 శాతానికి తగ్గిపోతాయి.
- ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర గాలులు, భారీ వర్షాలు, ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఏడాదిలో ఎక్కువ రోజులు ఉష్ణతాప దినాలుగా ఉంటున్నాయి.
- ఉష్ణతాపం, విపత్కర వాతావరణ పరిస్థితులతో స్థానికంగా పెట్టుబడులు తగ్గిపోయి, అభివృద్ధి నిలిచిపోతుంది. తద్వారా ఆదాయం, ఉత్పాదకత పడిపోయి.. పెట్టుబడులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినందువల్ల కొన్ని దేశాల్లో తలెత్తిన వాతావరణ మార్పులతో ఆ ఏడాదికి జీడీపీ గరిష్ఠంగా 12 శాతానికి పడిపోతోంది. ఆ తర్వాత ఆరేళ్లయినా పూర్వస్థితికి చేరుకోలేకపోతోంది. కొన్ని దేశాల్లో ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ