తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది.
సీఎం రేవంత్ హెచ్చరికతో కదలిక
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పనులు మొదలు
అన్నారం బ్యారేజీలో కొనసాగుతున్న సీసీ బ్లాకుల అమరిక
ఈనాడు హైదరాబాద్: మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సూచన మేరకు జియోటెక్నికల్, జియో ఫిజికల్, కాంక్రీటు ఇన్వెస్టిగేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం లేఖ రాశారు. గత ఏడాది అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో పియర్స్ కుంగి, గేట్లు దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీలు ఏర్పడ్డాయి. దీనిపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ వర్షాకాలంలో అన్ని గేట్లు ఎత్తి ఉంచాలని, మేడిగడ్డ ఏడో బ్లాక్లో రెండు గేట్లు పూర్తిగా తొలగించాలని, సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్, రాఫ్ట్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని, మూడు బ్యారేజీలపైనా సమగ్ర పరిశీలన చేయించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ చేసినా బ్యారేజీల స్ట్రక్చర్పై వరద ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేమంది. ఈ నివేదిక మే ఒకటిన రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందింది. అయితే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినందున మరమ్మతుల బాధ్యత తమది కాదని, అనుబంధ ఒప్పందం చేసుకొంటేనే పనులు ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తెలిపింది. 2021 మార్చి 15న పని పూర్తయినట్లు ఇంజినీర్లు ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా లేఖ రాసింది. అయితే లేఖ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించారని, ఈ లేఖ ఇవ్వడంలో తప్పు జరిగినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేర్కొన్నారని, పని బాధ్యత నిర్మాణ సంస్థదేనని స్పష్టంచేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ లేఖ రాసినా ఫలితం లేకపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు రెండు వారాలపాటు నిర్మాణ సంస్థతో మాట్లాడినా అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో సీఎం రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. డిజైన్, ఎగ్జిక్యూషన్, నిర్వహణ, క్వాలిటీ కంట్రోల్... ఇలా అన్నింటిలోనూ వైఫల్యం జరిగిందని, పని పూర్తయినట్లు ధ్రువపత్రం ఇచ్చాక కూడా పెండింగ్ పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించారంటే కాంట్రాక్టు మనుగడలో ఉన్నట్లేనని, బాధ్యులైన ఇంజినీర్లపైన, నిర్మాణ సంస్థపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం ఈ సమావేశం జరగ్గా సోమవారం ఉదయం నుంచే పనులు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పర్యవేక్షణ బాధ్యత
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీసీ బ్లాకులను యథాస్థితికి తెచ్చే పనులు మొదలయ్యాయి. మొదటి నాలుగు వరుసలు బైండింగ్ చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించిందని, ఈ పని చేయాలంటే ఇనుపకడ్డీ సైజు ఎంత ఉండాలో సీడీవో చెప్పాల్సి ఉందని నిర్మాణ సంస్థ... ఇంజినీర్ల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. గ్రౌటింగ్ ఎలా చేయాలో డిజైన్ ఇంజినీర్లే చెప్పాలని, సీసీ బ్లాకులను హడావుడిగా వేస్తే మళ్లీ కొట్టుకుపోతాయని నిర్మాణ సంస్థ అభిప్రాయపడినట్లు తెలిసింది. వరద ప్రవాహ వేగం... డ్యాం డిజైన్ చేసినప్పుడు వేసిన అంచనాకంటే ఎక్కువగా ఉన్నట్లు ఎన్డీఎస్ఏ కూడా గుర్తించింది. మేడిగడ్డలో షీట్పైల్ వేయడానికి అనువైన ప్రాంతాన్ని ఖరారు చేసే పనిలో ఇంజినీర్లు నిమగ్నమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లతోపాటు పునాదులు, బ్యారేజీ స్ట్రక్చర్... పరిస్థితిని తెలుసుకొనేందుకు కాంక్రీటు స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ డైరెక్టర్కు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాశారు. వీటిలో 20 రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుందని, దీనికి వ్యయం ఎంతవుతుందో వెంటనే తెలపాలని, ఒక బృందాన్ని పంపాలని కోరారు. అన్నారం బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కూడా సీడబ్ల్యూపీఆర్ఎస్కు లేఖ రాసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు, ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ల రోజువారీ పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అప్పగించామని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్