ఇంటర్ విద్యార్థులతో ఈసారీ చెలగాటమే!.. మూడో వంతు కళాశాలలకే ‘అనుబంధ గుర్తింపు’
ఇంటర్ బోర్డు చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉంది పరిస్థితి. గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న బోర్డు.. సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వవడం లేదు.
మూడో వంతు కళాశాలలకే ఇప్పటికి ‘అనుబంధ గుర్తింపు’ జారీ
వాణిజ్య, గృహ సముదాయాల్లో 427 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ బోర్డు చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉంది పరిస్థితి. గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న బోర్డు.. సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వవడం లేదు. గృహ, వాణిజ్య సముదాయాల్లో (మిక్స్డ్ ఆక్యుపెన్సీ) కొనసాగుతున్న కళాశాలలకు అనుమతుల విషయంలోనూ తాత్సారం చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయా కళాశాలలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ఓసీ) తీసుకుని బోర్డుకు సమర్పిస్తేనే అనుమతి ఇవ్వాలి. వివిధ కారణాలతో గత నాలుగేళ్లుగా ఇందుకు మినహాయింపు ఇచ్చారు. రానున్న విద్యాసంవత్సరానికి ఏమి చేస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
- ప్రతి విద్యా సంవత్సరం ప్రవేశాలు చేపట్టేముందు.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలన్నీ ఇంటర్బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) పొందటం తప్పనిసరి. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 విద్యా సంవత్సరానికి ఈ నెల 9 నుంచి ప్రవేశాలను ప్రారంభించుకోవచ్చని బోర్డు కాలపట్టిక జారీచేసింది. అయితే రాష్ట్రంలోని 1443 ప్రైవేట్ కళాశాలలకు గానూ 412కే ఈ నెల 22 నాటికి అనుబంధ గుర్తింపు దక్కింది. అంటే మూడోవంతు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ, ఎయిడెడ్ కలిపి 3,269 జూనియర్ కళాశాలలు ఉండగా.. 2,132కే అనుమతులు ఇచ్చారు.
- మిక్స్డ్ ఆక్యుపెన్సీలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ తప్పనిసరి చేస్తూ.. 2020 సెప్టెంబరు 24న హోం శాఖ జీఓ జారీచేసింది. అలాంటి కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా 427 ఉండగా.. అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. పక్కా భవనాలు లేని కళాశాలలు మరో తొమ్మిది ఉన్నాయి. ఇవన్నీ అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటిస్తున్నట్లు ఆ శాఖ జారీ చేసే ఎన్ఓసీ సమర్పిస్తేనే ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) జారీచేస్తుంది. అప్పుడు మాత్రమే ఆ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. లేకుంటే వాటికి బోర్డు వెబ్సైట్ లాగిన్ ఓపెన్ కాదు. కరోనా పరిస్థితుల వల్ల 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం వాటికి ‘ఎన్వోసీ’ నుంచి మినహాయింపు ఇచ్చింది. తర్వాత కళాశాల యాజమాన్యాల సంఘం విన్నపం మేరకు.. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకూ మినహాయింపును కొనసాగించింది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం మిక్స్డ్ ఆక్యుపెన్సీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి.. ఇష్టపూర్వకంగానే చేరుతున్నట్లు హామీపత్రాలు తీసుకున్నారు. ప్రస్తుతం వారు రెండో ఏడాదికి వచ్చారు. తాజా విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వకుంటే ఆయా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరుతున్న వారిదీ అదే పరిస్థితి. ఈసారికి కూడా మినహాయింపు పొందాలని యాజమాన్యాలు ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని వాటికి అనుమతులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, రాష్ట్రంలో ఏటా ఏదో ఒక సాకుతో మినహాయింపు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీసం ఏ కళాశాలలు.. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కింద ఉన్నాయన్న వివరాలను కూడా ఇంటర్బోర్డు వెబ్సైట్లో ఉంచటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్