ఇంటర్ విద్యార్థులతో ఈసారీ చెలగాటమే!.. మూడో వంతు కళాశాలలకే ‘అనుబంధ గుర్తింపు’
ఇంటర్ బోర్డు చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉంది పరిస్థితి. గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న బోర్డు.. సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వవడం లేదు.
మూడో వంతు కళాశాలలకే ఇప్పటికి ‘అనుబంధ గుర్తింపు’ జారీ
వాణిజ్య, గృహ సముదాయాల్లో 427 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ బోర్డు చెప్పేది ఒకటి... చేసేది మరొకటిలా ఉంది పరిస్థితి. గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న బోర్డు.. సకాలంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వవడం లేదు. గృహ, వాణిజ్య సముదాయాల్లో (మిక్స్డ్ ఆక్యుపెన్సీ) కొనసాగుతున్న కళాశాలలకు అనుమతుల విషయంలోనూ తాత్సారం చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయా కళాశాలలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ఓసీ) తీసుకుని బోర్డుకు సమర్పిస్తేనే అనుమతి ఇవ్వాలి. వివిధ కారణాలతో గత నాలుగేళ్లుగా ఇందుకు మినహాయింపు ఇచ్చారు. రానున్న విద్యాసంవత్సరానికి ఏమి చేస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
- ప్రతి విద్యా సంవత్సరం ప్రవేశాలు చేపట్టేముందు.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలన్నీ ఇంటర్బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) పొందటం తప్పనిసరి. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 విద్యా సంవత్సరానికి ఈ నెల 9 నుంచి ప్రవేశాలను ప్రారంభించుకోవచ్చని బోర్డు కాలపట్టిక జారీచేసింది. అయితే రాష్ట్రంలోని 1443 ప్రైవేట్ కళాశాలలకు గానూ 412కే ఈ నెల 22 నాటికి అనుబంధ గుర్తింపు దక్కింది. అంటే మూడోవంతు కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వ, ఎయిడెడ్ కలిపి 3,269 జూనియర్ కళాశాలలు ఉండగా.. 2,132కే అనుమతులు ఇచ్చారు.
- మిక్స్డ్ ఆక్యుపెన్సీలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ తప్పనిసరి చేస్తూ.. 2020 సెప్టెంబరు 24న హోం శాఖ జీఓ జారీచేసింది. అలాంటి కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా 427 ఉండగా.. అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. పక్కా భవనాలు లేని కళాశాలలు మరో తొమ్మిది ఉన్నాయి. ఇవన్నీ అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటిస్తున్నట్లు ఆ శాఖ జారీ చేసే ఎన్ఓసీ సమర్పిస్తేనే ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) జారీచేస్తుంది. అప్పుడు మాత్రమే ఆ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. లేకుంటే వాటికి బోర్డు వెబ్సైట్ లాగిన్ ఓపెన్ కాదు. కరోనా పరిస్థితుల వల్ల 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం వాటికి ‘ఎన్వోసీ’ నుంచి మినహాయింపు ఇచ్చింది. తర్వాత కళాశాల యాజమాన్యాల సంఘం విన్నపం మేరకు.. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకూ మినహాయింపును కొనసాగించింది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం మిక్స్డ్ ఆక్యుపెన్సీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి.. ఇష్టపూర్వకంగానే చేరుతున్నట్లు హామీపత్రాలు తీసుకున్నారు. ప్రస్తుతం వారు రెండో ఏడాదికి వచ్చారు. తాజా విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వకుంటే ఆయా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరుతున్న వారిదీ అదే పరిస్థితి. ఈసారికి కూడా మినహాయింపు పొందాలని యాజమాన్యాలు ఓ మంత్రి ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని వాటికి అనుమతులు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, రాష్ట్రంలో ఏటా ఏదో ఒక సాకుతో మినహాయింపు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీసం ఏ కళాశాలలు.. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కింద ఉన్నాయన్న వివరాలను కూడా ఇంటర్బోర్డు వెబ్సైట్లో ఉంచటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదారుసార్లు ఫోన్ చేసినా ఈఎన్సీ స్పందించలేదు!
వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లివాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ అంచనాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. -
రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఫ్లెక్సీ
భూమి తనఖా పెట్టి తీసుకున్న దీర్ఘకాలిక రుణం చెల్లించలేదని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారులు రైతు పొలంలో ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకున్నామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
2 నెలలు.. రూ.30 వేల కోట్లు!
రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఆగస్టు 15లోగా రైతుల రూ.2 లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. -
త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్
రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
గొర్రెల పంపిణీపై వివరాలు ఇవ్వండి
గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. -
ముందుమాట తెచ్చిన ముప్పు
ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలతోపాటు అభ్యాస దీపికల్లో ముద్రించిన ‘ముందుమాట’ వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. -
బదిలీలకు వేళాయె!
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్ ఐఏఎస్ల వరకు స్థాన చలనాలు జరగనున్నాయి. -
కంట్లో కొయ్య దిగినా.. తిరిగొచ్చిన చూపు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను అత్యంత సున్నితమైన అవయవం. చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్లీ చూపు వస్తుందని ఊహించగలమా? కానీ విశాఖ కేజీహెచ్ వైద్యులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. -
అవస్థల ప్రయాణం..!
రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. -
‘సీతారామ’.. ఈసారైనా పూర్తయ్యేనా..?
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో సీతారామ ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు కీలక శాఖలు కట్టబెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు. -
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో దేశ రక్షణ: రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచనా విధానాలు అమలుచేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. -
ప్రక్షాళన మొదలైంది.. తిరుమల నుంచే శ్రీకారం!
పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం తితిదే ఇన్ఛార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలను ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్నారు. -
నీళ్లు తగ్గి.. ఇసుక మేటలు తేలి
ఈ చిత్రంలో కనిపిస్తోంది తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది. -
ఆర్టీసీపై ట్రైనీ ఐఏఎస్ల అధ్యయనం
తెలంగాణ క్యాడర్కు చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని బస్భవన్కు శుక్రవారం వెళ్లారు. -
నెలాఖరులోగా పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి
ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను నెలాఖరులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి(సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ కలెక్టర్లను ఆదేశించారు. -
డిజిటల్ ప్రపంచానికి ప్రైవసీ ఇంజినీరింగ్ మూలస్తంభం
గోప్యతకు సంబంధించి ప్రైవసీ ఇంజినీరింగ్ డిజిటల్ ప్రపంచానికి మూలస్తంభమని, దీని పటిష్ఠతతోనే డిజిటల్ మాధ్యమంపై నమ్మకం బలపడుతుందని రాష్ట్ర ఐటీ, కమ్యునికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. -
ఆయిల్పాం సలహా కమిటీ నియామకం
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పాం సలహా కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఆదేశాలను ఉద్యానశాఖ సంచాలకులు, ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
కవితతో కేటీఆర్ భేటీ
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఇక్కడి తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిశారు. -
హైదరాబాద్లో ఎన్ఐఐఎంహెచ్-డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక పరిశోధన కేంద్రం
హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్(ఎన్ఐఐఎంహెచ్), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంయుక్తంగా హైదరాబాద్లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.