ఎంజీఎం ఆసుపత్రిలో పవర్ కట్.. వరంగల్ ఘటనపై నివేదికకు మంత్రి ఆదేశం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు సుమారు ఐదు గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు
ఈనాడు, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు సుమారు ఐదు గంటల పాటు అంతరాయం కలిగిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సమీక్షించారు. ఈ ఘటనలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి బాధ్యులను గుర్తించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వైద్య, ఆరోగ్యసేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జనరేటర్ల ద్వారా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో వరంగల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లను ఇంజినీర్లతో తనిఖీ చేయించాలని, లేని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో.. ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎం సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆహారభద్రత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు
ఆహారభద్రత ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. -
సుబ్బయ్య నల్లమోతుకు శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారం
వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్త సుబ్బయ్య నల్లమోతుకు కేంద్ర ప్రభుత్వం వి.శాంతారాం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. శనివారం ముంబయిలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖల సహాయమంత్రి ఎల్.మురుగన్ ఈ అవార్డును ప్రకటించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఎక్సైజ్శాఖలో 116 సూపర్ న్యూమరరీ పోస్టులు
తెలంగాణ ఎక్సైజ్శాఖలో కానిస్టేబుళ్లకు సంబంధించి 116 సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆరు నెలలపాటు ఈ పోస్టులు మనుగడలో ఉండనున్నాయి. -
531 వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి
కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణలోని ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరుతో లారీల నుంచి గుత్తేదారులు చేస్తున్న అక్రమ వసూళ్లను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. -
పెద్దపల్లి ఘటనను సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించిన కమిషన్ ఈ కేసును సమోటోగా తీసుకుంది. -
ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్లలో కుంభకోణం
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా... గత ఆరు నెలల పాలనలో వరస కుంభకోణాలకు పాల్పడిందని భారాస పేర్కొంది. మద్యం, బియ్యం, ఫ్లైయాష్, తాజాగా ఆర్టీసీ ఐ-టిమ్స్ టెండర్ల భారీ కుంభకోణం జరిగిందని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
రాష్ట్రంలో 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 30 మంది అధికారులకు స్థానచలనాలు జరిగాయి. ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న పది మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. -
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
ఉద్యోగుల బదిలీలకు మోక్షమెన్నడు?
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో చివరిసారిగా 2018లో సాధారణ బదిలీలు జరిగాయి. ప్రక్రియ పూర్తవగానే అప్పట్లోనే బదిలీలపై నిషేధం విధిస్తూ నాటి ప్రభుత్వం జీవో 81ని జారీ చేసింది.