రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్!
సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్ కారిడార్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
రామగుండం నుంచి మణుగూరు వరకు నిర్మాణం
ఈనాడు- హైదరాబాద్, పెద్దపల్లి: సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక ‘రైల్వే బొగ్గు రవాణా నడవా’ (రైల్వే కోల్ కారిడార్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 207.80 కి.మీ. మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్గేజ్ నిర్మించాలని.. అందుకు తక్షణమే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం అర్ధరాత్రి వెలువడ్డాయి.
అంచనా వ్యయం రూ.2,911 కోట్లు
మణుగూరు-రామగుండం ప్రాజెక్టు ప్రాథమిక పనులకు కేంద్రం 2013-14 బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, ఆ తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ముందడుగు పడలేదని సమాచారం. సరకు రవాణాకు మంచి మార్గం కావడం, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్న అంచనాతో ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ప్రధాని కార్యాలయం గత ఏడాది ఆమోదం తెలిపింది. 2013-14లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,112 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.2,911 కోట్లకు పెరిగింది.
తగ్గనున్న బొగ్గు రవాణా వ్యయం
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న 26 భూగర్భ, 20 ఉపరితల గనుల ద్వారా ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సింగరేణి ఏటా రూ.వందల కోట్లను కేవలం బొగ్గు రవాణాకే వెచ్చిస్తోంది. ప్రస్తుతం బల్లార్షా నుంచి ఖమ్మం ప్రాంతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కి.మీ. రైల్వే మార్గం ఉంది. రామగుండం-మణుగూరు లైను నిర్మిస్తే దాదాపు 142 కి.మీ. దూరం తగ్గడమే కాకుండా బొగ్గ్గు రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ రైలు మార్గంతో కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుళ్లు, మంథని వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు.. లక్నవరం చెరువు, బొగత జలపాతం వంటి జలపర్యాటక ప్రదేశాలు అనుసంధానమవుతాయి.
పాతికేళ్ల తర్వాత కొలిక్కి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం కోసం పాతికేళ్ల క్రితం 1999లోనే అడుగు పడింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజినీరింగ్ విభాగం సర్వే చేపట్టి సాధ్యాసాధ్యాలను రైల్వేశాఖకు నివేదిస్తుంది. అనంతరం భూసేకరణ సర్వే చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదారుసార్లు ఫోన్ చేసినా ఈఎన్సీ స్పందించలేదు!
వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లివాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ అంచనాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. -
రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఫ్లెక్సీ
భూమి తనఖా పెట్టి తీసుకున్న దీర్ఘకాలిక రుణం చెల్లించలేదని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారులు రైతు పొలంలో ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకున్నామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
2 నెలలు.. రూ.30 వేల కోట్లు!
రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఆగస్టు 15లోగా రైతుల రూ.2 లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. -
త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్
రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
గొర్రెల పంపిణీపై వివరాలు ఇవ్వండి
గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద విచారణ చేపట్టిన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. -
ముందుమాట తెచ్చిన ముప్పు
ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకం పాఠ్య పుస్తకాలతోపాటు అభ్యాస దీపికల్లో ముద్రించిన ‘ముందుమాట’ వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. -
బదిలీలకు వేళాయె!
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ల నుంచి సీనియర్ ఐఏఎస్ల వరకు స్థాన చలనాలు జరగనున్నాయి. -
కంట్లో కొయ్య దిగినా.. తిరిగొచ్చిన చూపు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను అత్యంత సున్నితమైన అవయవం. చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్లీ చూపు వస్తుందని ఊహించగలమా? కానీ విశాఖ కేజీహెచ్ వైద్యులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. -
అవస్థల ప్రయాణం..!
రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపలేకపోతోంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. -
‘సీతారామ’.. ఈసారైనా పూర్తయ్యేనా..?
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో సీతారామ ప్రాజెక్టుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు కీలక శాఖలు కట్టబెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు. -
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో దేశ రక్షణ: రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచనా విధానాలు అమలుచేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. -
ప్రక్షాళన మొదలైంది.. తిరుమల నుంచే శ్రీకారం!
పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం తితిదే ఇన్ఛార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలను ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్నారు. -
నీళ్లు తగ్గి.. ఇసుక మేటలు తేలి
ఈ చిత్రంలో కనిపిస్తోంది తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది. -
ఆర్టీసీపై ట్రైనీ ఐఏఎస్ల అధ్యయనం
తెలంగాణ క్యాడర్కు చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్లోని బస్భవన్కు శుక్రవారం వెళ్లారు. -
నెలాఖరులోగా పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి
ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను నెలాఖరులోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి(సీసీఎల్ఏ) నవీన్మిత్తల్ కలెక్టర్లను ఆదేశించారు. -
డిజిటల్ ప్రపంచానికి ప్రైవసీ ఇంజినీరింగ్ మూలస్తంభం
గోప్యతకు సంబంధించి ప్రైవసీ ఇంజినీరింగ్ డిజిటల్ ప్రపంచానికి మూలస్తంభమని, దీని పటిష్ఠతతోనే డిజిటల్ మాధ్యమంపై నమ్మకం బలపడుతుందని రాష్ట్ర ఐటీ, కమ్యునికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. -
ఆయిల్పాం సలహా కమిటీ నియామకం
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పాం సలహా కమిటీని నియమించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఆదేశాలను ఉద్యానశాఖ సంచాలకులు, ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
కవితతో కేటీఆర్ భేటీ
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఇక్కడి తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిశారు. -
హైదరాబాద్లో ఎన్ఐఐఎంహెచ్-డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక పరిశోధన కేంద్రం
హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్(ఎన్ఐఐఎంహెచ్), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంయుక్తంగా హైదరాబాద్లో ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
-
ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు: విద్యాశాఖ మంత్రి లోకేశ్
-
వచ్చే వారమే రైతుల ఖాతాల్లోకి.. పీఎం-కిసాన్ నిధులు
-
ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై కసరత్తు.. సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ
-
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
-
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్ చుక్ పరుగులు!