రిటైరై వెళుతూ.. సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు
జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తన పదవీకాలం ముగిసే ముందు చివరి రెండు రోజులు సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు.
పదవీకాలం ముగిసిన రోజు జేఎన్టీయూలో వేతనాలు పెంచుతూ వీసీ కట్టా ఉత్తర్వులు
కట్టా నర్సింహారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తన పదవీకాలం ముగిసే ముందు చివరి రెండు రోజులు సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పదవీకాలం ముగిసిన ఈ నెల 22వ తేదీన ఏకంగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలను 2021, 2022లోనే పెంచగా... జేఎన్టీయూహెచ్లో మాత్రం మూడేళ్లు దాని జోలికి వెళ్లని ఆయన... పదవీ కాలం ముగిసిన రోజు ఎన్నికల కోడ్ ఉన్నా ఉత్తర్వులివ్వడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలను నిర్ణయిస్తూ 2018లో జీవో 11 జారీ అయింది. మళ్లీ 2021 సెప్టెంబరు 1న జీవో 141 వచ్చింది. మూల వేతనంతోపాటు ఏటా వారికి ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం విద్యాశాఖ పరిధిలోని అన్ని వర్సిటీలు 2021-22, 2022-23 విద్యా సంవత్సరంలోనే కొత్త వేతనాలను అమలు చేశాయి. జేఎన్టీయూహెచ్లో మాత్రం అమలుకాలేదు.
మూడేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నా...
ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలివ్వాలని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మూడేళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత కమిటీలు వేశారు తప్ప తుది నిర్ణయం తీసుకోలేదు. కిందటి నెల.. జీతాల పెంపు అంశాన్ని వీసీ బయటకు తీశారు. సీనియర్ ఆచార్యులతో ఓ కమిటీని నియమించి... ఆ కమిటీ నివేదిక ఆధారంగా సర్కారు జీవో ప్రకారం వేతనాలను పెంచాలని ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చారు. సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను పదవీకాలం ముగిసే చివరి మూడు నెలల్లో ఉపకులపతులు తీసుకోరు. అందుకు భిన్నంగా వీసీ కట్టా వ్యవహరించడం చర్చకు దారితీసింది. అలాగే వీసీ తన పదవీకాలం ముగిసే రెండు రోజుల ముందు బదిలీలకు తెరతీశారు. జగిత్యాల నుంచి హైదరాబాద్కు, సిరిసిల్లకు పలువురిని బదిలీ చేశారు. సందట్లో సడేమియా అన్నట్లు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఏడుగురు అకడమిక్ అసిస్టెంట్లను కూడా సహాయ ఆచార్యులు (కాంట్రాక్ట్)గా మార్చుతున్నట్లు సమాచారం. జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులు మాత్రం మిగిలిన వర్సిటీలు ఎప్పుడో కొత్త వేతనాలను అమలు చేశాయని, ఈ వర్సిటీలోనే ఆలస్యమైందని చెబుతున్నారు. అకడమిక్ అసిస్టెంట్లు పాఠాలు బోధించకున్నా వారు ఆర్అండ్డీ, జే హబ్, అకడమిక్ ఆడిట్ సెల్ తదితర విభాగాల్లో విద్యాపరమైన పనులు చేస్తున్నారని, ఎంటెక్ తదితర విద్యార్హతలు ఉన్నవారేనని పేర్కొంటున్నారు. ఇక వర్సిటీలో నిర్మించిన పలు భవనాలను కూడా ఆయన ప్రారంభించడం విమర్శలకు దారితీసింది. దీనిపై జేఎన్టీయూహెచ్ ఇన్ఛార్జి వీసీ బుర్రా వెంకటేశాన్ని ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు
భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. -
ఖాళీల్లోనే ఆ పాఠశాలలు ఆదర్శం!
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. -
అంతిమ లబ్ధిదారులే కీలకం
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడుకు పరిహారం చెల్లించాల్సిందే
గ్యాస్ సిలిండర్ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. -
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఇన్ఛార్జి వీసీలే
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు. -
నిన్నటి మనస్తత్వంతో రేపటి పోరాటం చేయలేం
-
ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల ధర్నా
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నల్లమలలో చిరుత మృతి
నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. -
మొలకెత్తింది కష్టాలే
జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. -
బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి
ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి
కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. -
నియంతృత్వ, నిర్బంధ పోకడలు తగవు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
రమేశ్కార్తీక్ నాయక్ను వరించిన ‘యువ పురస్కార్’
ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. -
అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు
తెలంగాణలో వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే.. శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక!’
-
విజయవాడలో భారీ వర్షం.. పరిశీలించిన మంత్రి నారాయణ
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107