సంక్షిప్త వార్తలు (11)
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద నియామకాలకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. శాశ్వత నియామకాలకు బదులు తమకు అనుకూలమైన వారిని ఉద్యోగాలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పశువైద్య వర్సిటీలో ఒప్పంద నియామకాలు
అధికారుల ప్రతిపాదనలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ఒప్పంద నియామకాలకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. శాశ్వత నియామకాలకు బదులు తమకు అనుకూలమైన వారిని ఉద్యోగాలు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఉన్నతాధికారి తన కుమారుడికి బ్యాక్లాగ్ పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు చేయగా అది విఫలం కావడంతో ఒప్పంద నియామకాలకు పూనుకున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో ఉన్నతాధికారులను కలిసి పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన నేతలతోనూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా వర్సిటీ పాలకమండలి సమావేశం గురువారం జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది.
ఎస్సీ గురుకులాల్లో ఇంటర్కు దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ సీవోఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి కె.సీతాలక్ష్మి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, వొకేషన్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుము కింద ఆన్లైన్లో రూ.100 చెల్లించాలని కోరారు.
చర్లపల్లి, సనత్నగర్ రైల్వేస్టేషన్ల తనిఖీ
ఈనాడు, హైదరాబాద్: ద.మ.రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ హైదరాబాద్లోని చర్లపల్లి, సనత్నగర్ రైల్వేస్టేషన్లను గురువారం తనిఖీ చేశారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి టెర్మినల్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చర్లపల్లి నుంచి మౌలాలి, అమ్ముగూడ, సనత్నగర్ వరకు రైల్లో ప్రయాణిస్తూ విండో ఇన్స్పెక్షన్ చేశారు. సనత్నగర్ స్టేషన్లో అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.
భారీ ‘మీనం’
న్యూస్టుడే, కొత్తకోట గ్రామీణం: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మహ్మద్హుస్సేన్పల్లి ఊర చెరువులో గురువారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. మూడు అడుగుల పొడవు, 20 కిలోల బరువు ఉందని మత్స్యకారుడు శివ తెలిపారు.
చిక్కుడు సెంచరీ.. బీన్స్ డబుల్ సెంచరీ!
ఈనాడు, హైదరాబాద్-అమీర్పేట, న్యూస్టుడే: హైదరాబాద్లో కూరగాయల ధరలు కుతకుతలాడుతున్నాయి. బీన్స్ ధర వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. గురువారం బహిరంగ మార్కెట్లలో కిలో బీన్స్ ధర రూ.220 నుంచి రూ.270 వరకు పలికింది. మరోవైపు గురువారం చిక్కుడు కాయ కిలో ధర రూ.110 దాటింది. అకాల వర్షాలు, ఎండలతో దిగుబడి తగ్గిపోవడమే కూరగాయల ధరలు పెరగడానికి కారణమని ఎర్రగడ్డ రైతుబజార్ ఎస్టేట్ అధికారి రమేష్ తెలిపారు.
పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలు రూ.3,736 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ బకాయిలు ఈ నెల 20వ తేదీ నాటికి రూ.3,736.67 కోట్లు ఉన్నాయి. వీటిలో రూ.3007 కోట్లు చిన్న, మధ్య పరిశ్రమలకు, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి. గత ఏడాది (2023-24) అప్పటి ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలకు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.684.04 కోట్ల విలువైన చెక్కులు కూడా మురిగిపోయాయి.
రైల్వే సీనియర్ డీసీఎంగా బాలాజీ కిరణ్
ఈనాడు, హైదరాబాద్: ద.మ.రైల్వే జోన్ ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్కు సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం)గా వై.బాలాజీ కిరణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంతకల్ డివిజన్ సీనియర్ డివిజినల్ ఆపరేషన్స్ మేనేజర్ (డీఓఎం)గా పనిచేశారు.
ఎడ్సెట్కు 29,463 మంది హాజరు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన ఎడ్సెట్కు 87 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 33,879 మందికిగాను 29,463 మంది పరీక్షలు రాసినట్లు కన్వీనర్ ఆచార్య మృణాళిని తెలిపారు.
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్కు 2,73,407 మంది, సెకండియర్కు 1,53,608 మంది హాజరుకానున్నారు. మొత్తం 926 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పరీక్షలు ఈ నెల 31తో ముగుస్తాయి.
26న రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం
ఈనాడు, హైదరాబాద్: ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారాలకు ఆచార్య శలాక రఘునాథశర్మ, డాక్టర్ నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడిగా రఘునాథశర్మ, నలిమెల భాస్కర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పదవీ విరమణ పొందారు. రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 26న ఉదయం 11 గంటలకు పురస్కారాలను అందజేస్తారు.
వానాకాలం సీజన్పై రైతులకు అవగాహన సమావేశాలు
ఈనాడు, హైదరాబాద్: వానాకాలం పంటసాగు సన్నద్ధతలో భాగంగా రైతులతో గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని వ్యవసాయశాఖ సంచాలకుడు బి.గోపి అధికారులను ఆదేశించారు. రైతులకు సరిపడా, నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సూచించారు. గురువారం ఆయన జిల్లా అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సీజన్ ఆశాజనకంగా ఉందని, విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలకు సంబంధించి బిల్లును భద్రపరుచుకోవాలని సూచించారు. విత్తన డీలర్ల దుకాణాలను సందర్శించి విత్తనాల నిల్వలపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపించాలన్నారు. జిల్లాలో రోజువారీగా టాస్క్ఫోర్స్ బృందాల సమావేశం నిర్వహించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం