నిర్మల్‌ జిల్లా భగభగ

నిర్మల్‌ జిల్లా శనివారం నిప్పుల కొలిమిలా మండింది. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాచాయి. కుభీర్‌ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

Published : 26 May 2024 03:26 IST

కుభీర్‌ మండలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా శనివారం నిప్పుల కొలిమిలా మండింది. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాచాయి. కుభీర్‌ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. నిర్మల్‌ గ్రామీణ జిల్లా ముజిగిలో 45.2, తానూరు మండల కేంద్రంలో 44.8, కడెం పెద్దూరులో 44.7, బాసరలో 44.3 డిగ్రీల ఎండ కాసింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 44.9, కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాలో 44.8, ఆదిలాబాద్‌ జిల్లా బేల మండల కేంద్రంలో 44.7, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 4.8 సెం.మీ., మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో 4.6, నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం కొండనాగులలో 2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వనపర్తి, నారాయణపేట, సిద్దిపేట, కుమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని