సార్.. ఆ పిల్లల్లో మా వాళ్లున్నారా..!
‘సార్... పిల్లల్ని అమ్మే గ్యాంగ్ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా...’’ అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్
శిశువును మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తున్న రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి
‘సార్... పిల్లల్ని అమ్మే గ్యాంగ్ను అరెస్టు చేశారు. మీరు రక్షించిన వారిలో మా వాళ్లున్నారా...’’ అంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. కన్నబిడ్డల ఆనవాళ్లను చెబుతూ, వారిని గుర్తించి అప్పగించాలని అర్థిస్తున్నారు. రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు చిన్నారుల అక్రమ రవాణా ముఠాను అరెస్టు చేసి... 16 మంది చిన్నారుల్ని రక్షించిన విషయం తెలిసిందే. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు తమ పిల్లలేమైనా ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 మంది పోలీసులకు ఫోన్ చేశారు. ఆయా వివరాలతో తమ వద్దకు రావాలని పోలీసులు వారికి సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో తవ్వేకొద్ది విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.
బైక్ అంటే మగ.. స్కూటీ అంటే ఆడపిల్ల!
చిన్నారుల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్లలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి రవాణా చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా కొందరు మహిళా ఏజెంట్లు తల్లుల్లా చిన్నారుల్ని తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విక్రయాల విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు కోడ్భాష ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. బైక్ అంటే మగ, స్కూటీ అంటే ఆడపిల్ల అని పలుకుతారు. కొనుగోలు చేసే వారి నుంచి డబ్బు తీసుకుని తేదీ నిర్ణయిస్తే చాలు నెలల వయసున్న శిశువులను రెండు, మూడు రోజుల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాటలు కలిపి.. తమకు తెలిసినవారి వద్ద నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని చెబుతూ విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితులైన కిరణ్, ప్రీతి(దిల్లీ), కన్నయ్య(పుణె)లు చిన్నారుల్ని ఎక్కువగా రాత్రి వేళల్లోనే తరలించినట్లు గుర్తించారు.
ఐదేళ్లుగా అక్రమ తరలింపు
ముఠా అరెస్టు నేపథ్యంలో ముంబయి పోలీసులు రాచకొండ అధికారులను సంప్రదించారు. వారి వద్దనున్న రికార్డులతో కేసును సరిపోల్చుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిందితుల్లో కొందరు ఐదేళ్ల నుంచి చిన్నారుల్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో విజయవాడకు చెందిన శారదది కీలక పాత్రగా గుర్తించారు. ఆమెపై ఇప్పటికే చిన్నారుల విక్రయానికి సంబంధించి మూడు కేసులున్నాయి. ముంబయిలోని కంజుమార్గ్ ఠాణాలో ఇటీవల ఓ కేసు నమోదైంది.
విజయవాడలో మరో 8 మంది ఏజెంట్ల గుర్తింపు
నిందితులిచ్చిన సమాచారం ప్రకారం విజయవాడలో మరో ఎనిమిది మంది ఏజెంట్లను పోలీసులు గుర్తించారు. విజయవాడకే చెందిన బలగం సరోజ, ముదావత్ శారద, పఠాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధతో వారికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడ, పుణె, దిల్లీల్లో ఉన్న ఇతర నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. నిందితులిచ్చిన సమాచారం ప్రకారం 60 మంది చిన్నారుల్ని దిల్లీ, పుణె నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది. మేడిపల్లి పోలీసులు 16 మందిని గుర్తించారు. మిగిలిన 44 మంది ఎక్కడున్నారన్న అంశంపై దృష్టిసారించారు. నిందితులు శిశువుల్ని విక్రయించాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు గుర్తించారు. ఈ తతంగంపైనా దృష్టిపెట్టారు.
కొత్తవారిని చూసి ఏడుస్తున్న చిన్నారులు
తాము రక్షించిన 16 మంది చిన్నారుల్లో 14 మందిని పోలీసులు చిన్నారుల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. మరో ఇద్దరి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం శిశువిహార్ సంరక్షణలో ఉన్న మొత్తం 14 మంది పిల్లలకు బుధవారం అక్కడి సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించారు. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కాంతివెస్లీ, మేడ్చల్ సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్ రాజారెడ్డి శిశువిహార్కు వెళ్లి పరిశీలించారు. తెలియని ప్రదేశం కావడంతో కొందరు చిన్నారులు కొత్త వారిని చూసి ఏడుస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సర్దుకుంటారనే భావనతో అధికారులు ఉన్నారు.
కేసును సుమోటోగా తీసుకున్న ఎస్సీపీసీఆర్
చిన్నారుల అక్రమ రవాణా, దత్తత కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపీసీఆర్) సుమోటోగా తీసుకుంది. పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి, అక్రమ రవాణా రాకెట్ వెనుక ఎవరున్నారో గుర్తించి, చర్యలు తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ కమిషనర్ను ఎస్సీపీసీఆర్ ఛైర్పర్సన్ శ్రీనివాస్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్