రూ.500 కోట్ల సర్కారు భూముల కబ్జాయత్నం భగ్నం
హైదరాబాద్ సమీపంలోని గండిపేట మండలంలో రూ.500 కోట్ల సర్కారు భూముల కబ్జాకు యత్నించిన అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర చేశారు.
హైదరాబాద్ సమీపంలోని గంధంగూడలోని 9.36 ఎకరాలపై అక్రమార్కుల కన్ను
తప్పుడు పత్రాలతో సొంతం చేసుకునేందుకు ఓ మాజీ కార్పొరేటర్ పన్నాగం
ఆధారాలు సమర్పించకపోవడంతో ప్రహరీ, గుడిసెలను కూల్చేసిన రెవెన్యూ అధికారులు
గంధంగూడలోని సర్కారు స్థలంలో గుడిసె, రేకుల ప్రహరీ తొలగింపు
ఈనాడు, హైదరాబాద్- బండ్లగూడజాగీర్, న్యూస్టుడే: హైదరాబాద్ సమీపంలోని గండిపేట మండలంలో రూ.500 కోట్ల సర్కారు భూముల కబ్జాకు యత్నించిన అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు కన్నెర్ర చేశారు. గండిపేట మండలం గంధంగూడ గ్రామంలోని సర్వే నంబరు 51లో 9.36 ఎకరాల భూమికి సంబంధించి కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి.. స్థలం చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించారు. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి ప్రహరీని కూల్చేస్తారన్న ముందస్తు అంచనాతో కొందరితో అప్పటికప్పుడు గుడిసెలు వేయించారు. వాటిని తొలగించేటప్పుడు ఆందోళన చేయిద్దామని ఆలోచన చేశారు. వారి పన్నాగాన్ని అధికారులు భగ్నం చేశారు. గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లి.. అక్రమంగా వెలసిన గుడిసెలను, ప్రహరీని కూల్చేశారు. అవి సర్కారు భూములంటూ అక్కడ బోర్డులు పాతారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టామని, పోలీసులకు ఫిర్యాదు చేశామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలిపారు.
పదేళ్ల క్రితం నుంచే ప్రణాళిక
గండిపేట్ మండలం గంధంగూడ గ్రామంలోని సర్వే నంబర్ 51లో 9.36 ఎకరాల సర్కారు భూములున్నాయి. జంట జలాశయాలకు సమీపంలో.. హైదర్షాకోట్, సన్సిటీ పక్కనే ఉండడంతో వాటిని ఆక్రమించేందుకు సుమారు పదేళ్ల క్రితం ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ ప్రయత్నాలు ప్రారంభించాడు. అప్పట్లో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో భూములను సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాడు. ఈ సర్వే నంబర్కు అటూ, ఇటూ ఉన్న భూముల వివరాలు తెలుసుకున్నాడు. అవి సర్కారు భూములు కావని, ముంతఖబ్ (వ్యక్తులు లేదా సంస్థలకు నిజాం ఇచ్చిన) భూములని పత్రాలు సృష్టించాడు. సబినా సుల్తానా అనే మహిళ, ఆమె వారసులు తమకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) ఇచ్చారంటూ హైకోర్టులో ఎ.అభిషేక్ పేరుతో నాలుగేళ్ల క్రితం రిట్ పిటిషన్ దాఖలు చేయించాడు. ఆ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో రంగారెడ్డి జిల్లా ట్రైబ్యునల్కు వెళ్లారు. సబినా సుల్తానా, ఆమె వారసులు జీపీఎ ఇచ్చిన ఎ.అభిషేక్కు భూములు కేటాయించాలంటూ ట్రైబ్యునల్ గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఆధారంగా అప్పటి జిల్లా కలెక్టర్ అవి పట్టా భూములేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ-పాస్ పుస్తకాల కోసం అభిషేక్ గతేడాది మే నెలలో ధరణిలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు రావడంతో ధరణిలో ఇతని పేరున భూముల మార్పిడి జరగలేదు. కానీ, ఈ-పాస్ పుస్తకం మాత్రం వచ్చింది.
ఆక్రమణకు యత్నించిన ప్రభుత్వ భూమి
సీఎం రేవంత్ ఆదేశాలతో బయటపడ్డ అక్రమం
ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఏడాది జనవరిలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల రికార్డులు పరిశీలిస్తుండగా గండిపేట్ మండలం గంధంగూడలోని 9.36 ఎకరాల సర్కారు భూమి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంతఖబ్ భూములపై ఉత్తర్వులు ఇచ్చే అధికారం జిల్లా ట్రైబ్యునల్కు లేదని తెలుసుకున్న రంగారెడ్డి కలెక్టర్ కె.శశాంక.. వాటిని నిలిపివేశారు. 1955 నుంచి అవి ప్రభుత్వ భూములుగానే ఉన్నాయంటూ అభిషేక్కు స్పష్టంచేశారు. దీంతో అతను ఈ ఏడాది మార్చిలో హైకోర్టును ఆశ్రయించారు. భూములను విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. అభిషేక్ అభ్యర్థనను పరిశీలించి.. నిర్ణయం తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్తోపాటు రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక తాఖీదులు జారీ చేయగా.. వాటిని అభిషేక్ సమర్పించలేదు. దీంతో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నించారంటూ అభిషేక్కు నోటీసులు జారీ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే