నేటి నుంచి బడిబాట.. మరోసారి మార్గదర్శకాల జారీ

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యంగా గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట నిర్వహించనున్నారు.

Updated : 06 Jun 2024 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యంగా గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్‌ బడిబాట నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ నెల 3వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తొలుత ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ తర్వాత దాన్ని 6వ తేదీకి వాయిదా వేసింది. ఆ మేరకు తాజాగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో భాగంగా 11వ తేదీ వరకు జరగాల్సిన కార్యక్రమాలు, బడులు పునఃప్రారంభమైన 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించింది. ఉత్తర్వుల నేపథ్యంలో బడిబాటను విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దామని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశంలో పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని