సంక్షిప్త వార్తలు (12)
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద 2010లో జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు బుధవారం నాందేడ్ జిల్లా బిలోలి సెషన్స్ కోర్టులో విచారణకు హాజరయ్యారు.
బాబ్లీ కేసుపై విచారణ
బిలోలి సెషన్స్ కోర్టు నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు విజయరమణారావు, గంగుల కమలాకర్
సుల్తానాబాద్, న్యూస్టుడే: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద 2010లో జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు బుధవారం నాందేడ్ జిల్లా బిలోలి సెషన్స్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, గంగుల కమలాకర్, ప్రకాశ్గౌడ్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే కోర్టుకు హాజరు కాగా వాదోపవాదాల అనంతరం జడ్జి విచారణను అక్టోబరు 17కు వాయిదా వేశారు.
అందెశ్రీని సత్కరించిన సీఎస్ శాంతికుమారి
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డాక్టర్ అందెశ్రీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎ.శాంతికుమారి సత్కరించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్కు అందజేశారు.
ఈనాడు, హైదరాబాద్
బీఎస్సీ ఫారెస్ట్రీకి దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి 27వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ కళాశాల తెలిపింది. www.fcrihyd.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీట్లలో 75 శాతం ఇంటర్ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 8074350866, 9666460939 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూటీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి చెప్పారు. పీఆర్టీయూటీఎస్కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నయిజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్(పీఆర్జీటీఏ) ఏర్పాటైన సందర్భంగా బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు, ఆరోగ్య కార్డులు మంజూరు చేయిస్తామని, అన్ని పాఠశాలల్లో కేర్ టేకర్లను నియమించేలా సీఎంను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. జూన్లోనే అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న గురుకుల టీచర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించేలా ముఖ్యమంత్రిని ఇప్పటికే ఒప్పించినట్టు చెప్పారు. సమావేశంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
టీజీఐసెట్ ప్రారంభం
విద్యానగర్ (హనుమకొండ), న్యూస్టుడే: ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం టీజీఐసెట్-2024 ప్రారంభమైనట్లు కన్వీనర్ ఆచార్య ఎస్.నరసింహాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటి సెషన్కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. గురువారం ఉదయం మరో సెషన్తో ప్రవేశ పరీక్ష ముగుస్తుందని తెలిపారు.
నీట్ ఫలితాల్లో శ్రీ చైతన్య రికార్డు
ఫిలింనగర్, న్యూస్టుడే: నీట్ 2024 ఫలితాల్లో 720కి 720 మార్కులతో ఓపెన్ కేటగిరిలో 9 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు శ్రీ చైతన్య విద్యాసంస్థల సీఈవో, అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తమ విద్యార్థులు సత్తా చాటారని పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 720 మార్కులతో ఒకటో ర్యాంకును వి.కల్యాణ్, పి.పవన్కుమార్రెడ్డి, ముకేశ్చౌదరి, భానుతేజసాయి, ఇరాన్ఖ్వాజీ, దర్శ్పగ్దార్, ఇషాకొఠారి, ఆదర్శ్సింగ్, అమీనాఆరిఫ్లు సాధించినట్లు వెల్లడించారు. 30 మంది 715 మార్కులు, ఆపైన.. 57 మంది 710 మార్కులు, ఆపైన, 127 మంది 700 మార్కులు, ఆపైన.. 852 మంది 650 మార్కులు, ఆపైన సాధించినట్లు వెల్లడించారు. విద్యార్థులను సుష్మ, శ్రీచైతన్య టెక్నో స్కూల్స్ డైరెక్టర్ సీమ బొప్పన అభినందించారు.
నారాయణ విజయ పరంపర
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ పరంపరను కొనసాగించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. 720కి 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ కేటగిరీల్లో 8 ఫస్ట్ ర్యాంకులతో తమ విద్యార్థులు రికార్డు సృష్టించారన్నారు. సామ్ శ్రేయాస్ జోసెఫ్ ఆలిండియా 1వ ర్యాంకు సాధించగా.. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో కె.సందీప్ చౌదరి, షాహ్, పి.ఆదిత్య కుమార్, శశాంక్ శర్మ, ఈషా కొఠారి, ప్రాచిత, దర్శ్ పగ్దార్లు ఫస్ట్ ర్యాంకు సాధించారన్నారు. 13 మంది 715 మార్కులు, 20 మంది 710 మార్కులతో రాణించారని వెల్లడించారు. విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.
శ్రీగోసలైట్స్ అత్యుత్తమ ఫలితాలు
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో విజయవాడ శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఛైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. మొత్తం 720 మార్కులకు గాను తమ విద్యార్థులు 9 మంది 700కు పైగా మార్కులు సాధించారని వెల్లడించారు. 520 మంది విద్యార్థులు 600కు పైన మార్కులు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే : నీట్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. శ్రుతికీర్తి 662, పి.హర్షిత 652 మార్కులతో ప్రతిభ చాటారని చెప్పారు. కె.రమేశ్ 630, ఎం.కీర్తి 626, టి.షాలిని 621, వి.సాయిప్రసాద్ 621 మార్కులు సాధించారని వెల్లడించారు. మరో 105 మందికి పైగా విద్యార్థులు 500, ఆపైగా మార్కులు తెచ్చుకున్నారన్నారు.
రెసోనెన్స్ విద్యార్థుల సత్తా
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. తమ విద్యార్థి సిద్ధార్థ 720కి 715 మార్కులు సాధించి జాతీయస్థాయిలో సత్తా చాటారని వెల్లడించారు. మొత్తం 12 మంది 700కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులను అభినందించారు.
రాణించిన అల్ఫోర్స్ విద్యార్థులు
కరీంనగర్ విద్యావిభాగం,న్యూస్టుడే : నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. ఎన్.హేమంత్ 691, వి.హాసిని 671, డి.పూజిత 650, ఎన్.కౌశిక్రెడ్డి 647, పి.అక్షరరెడ్డి 639, వి.శ్రీముఖి, మరియాసభ 619, ఎ.శ్రీవర్ధిని 613, ఎన్.కమాలికా ప్రీతి 613, ఎన్.జ్ఞానద 604 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. మరో 41 మంది విద్యార్థులు 500, ఆపైన మార్కులు సాధించినట్లు వివరించారు.
గురుకుల విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల విద్యార్థులు నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని అధికారులు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల నుంచి 282 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని కార్యదర్శి కె.సీతా లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నలుగురు విద్యార్థులు 720కి 600కుపైగా మార్కుల సాధించి..వారి సామాజికవర్గ కేటగిరీల్లో 490-2,435 మధ్య నాలుగు ర్యాంకులు పొందారని వెల్లడించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలల విద్యార్థుల్లో 34 మంది ఉత్తమ ర్యాంకులు సాధించి వివిధ వైద్య కళాశాలల్లో సీట్లు పొందేందుకు అర్హత పొందారని ఆ సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత