సంక్షిప్త వార్తలు (12)
రాష్ట్రంలో గత ఏడాది ఆగిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
బదిలీలు, పదోన్నతులపై సీఎంకు వినతి
సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న పీఆర్టీయూ తెలంగాణ నేతలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఏడాది ఆగిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు వారు గురువారం సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. అన్ని పాఠశాలల్లో వెంటనే స్వచ్ఛ కార్మికులను నియమించాలని, 317 జీఓ బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను మంజూరు చేయాలని విన్నవించారు.
గోసంరక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి
సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రాన్ని అందిస్తున్న సమితి ప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గోవుల సంరక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి గురువారం సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేసింది. సమితి ప్రతినిధులు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని.. తదితర అంశాలపై విజ్ఞప్తి చేశారు.
నీట్ ఫలితాల్లో ఆకాష్ విజయభేరి
ఈనాడు, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) వెల్లడించింది. 15 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారని.. వీరిలో ఎక్కువ మంది 679, అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారని పేర్కొంది. 716 మార్కులతో అనురన్ ఘోష్ ఆలిండియా 77వ ర్యాంకు సాధించారని తెలిపింది. అసాధారణ విజయాన్ని సాధించిన విద్యార్థులను ఏఈఎస్ఎల్ చీఫ్ అకడమిక్, బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా అభినందించారు.
8న జాతీయ లోక్అదాలత్
ఈనాడు, హైదరాబాద్: జాతీయ లోక్అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా, తాలూకా కోర్టుల్లో ఈ నెల 8న లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ సీహెచ్.పంచాక్షరి గురువారం వెల్లడించారు. దాంపత్య, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంకు వివాదాలతో పాటు జరిమానా విధించిన క్రిమినల్ కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల్లోని పెండింగ్ కేసులు పరిష్కారమైతే ఫీజును తిరిగిచ్చేస్తారన్నారు. దీన్ని బ్యాంకులు, బీమా కంపెనీలతో పాటు కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు.
రోడ్ల మరమ్మతులు నాణ్యంగా చేపట్టాలి: సీతక్క
ఈనాడు, హైదరాబాద్: గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను నాణ్యంగా మరమ్మతు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆమె రహదారుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ‘‘రోడ్ల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణాలను చేపట్టాలి. పెండింగులో ఉన్న రహదారుల మరమ్మతులు, నిర్మాణంతోపాటు పంచాయతీల మౌలిక వసతులకు ప్రతిపాదనలు రూపొందించాలి. ఎక్కడైనా నాసిరకంగా పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.
టెస్కాబ్ అధ్యక్షుడిగా దేవేందర్రెడ్డి?
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్) అధ్యక్ష పదవికి మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యక్ష పదవికి నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేశ్రెడ్డి, వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్రావులు పోటీ పడుతున్నారు. టెస్కాబ్ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డిపై డైరెక్టర్లు ఇటీవల అవిశ్వాసం ప్రవేశపెట్టగా ఈనెల 10న దానిపై సమావేశం జరపాలని సహకార శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారు తమ పదవులకు రాజీనామా చేయడంతో అదే రోజున కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి కోసం ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. వీరిలో సీనియర్గా ఉన్న దేవేందర్రెడ్డికి అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. రమేశ్రెడ్డి, రవీందర్రావులలో ఒకరిని ఉపాధ్యక్షునిగా ఎంపిక చేస్తారని డైరెక్టర్లు అంచనా వేస్తున్నారు.
పశు సంవర్ధక శాఖకు మరో అదనపు డైరెక్టర్ సుబ్బరాయుడికి అవకాశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు సుబ్బరాయుడికి అదనపు సంచాలకునిగా పదోన్నతి లభించింది. గురువారం సచివాలయంలో సమావేశమైన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. శాఖలో సీనియర్గా ఉన్న ఆయనకు పదోన్నతిలో జాప్యం జరగగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి ఆయనకు పదోన్నతి కల్పించాలని డీపీసీని ఆదేశించారు. ప్రస్తుతం ఈ శాఖలో మూడు డైరెక్టర్ స్థాయి పోస్టులు ఉండగా... అదనపు డైరెక్టర్ మల్లేశ్వరి వీటికి ఇన్ఛార్జిగా ఉన్నారు. త్వరలో సుబ్బరాయుడికి ఈ పోస్టుల్లో ఒకటి లేదా రెండింటి బాధ్యతలను అప్పగించే అవకాశముందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
బోధనాసుపత్రుల్లో రోగులకు ‘ఆభా’ తప్పనిసరి: ఎన్ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: దేశంలోని అన్ని వైద్య కళాశాలల(బోధనాసుపత్రులు)కు వచ్చే రోగుల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా(ఆభా) గుర్తింపు సంఖ్యను విధిగా నమోదు చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ఆదేశించింది. ఎవరికైనా ఈ గుర్తింపు సంఖ్య లేకుంటే ఆధార్తో వెంటనే ఇవ్వొచ్చని స్పష్టంచేసింది. 2025-26 నుంచి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపు, కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, కళాశాలల రెన్యువల్ వంటి అంశాలన్నీ ఆసుపత్రికొచ్చే రోగుల సంఖ్యతో ముడిపడి ఉంటాయంది. అదే సమయంలో ఆభా గుర్తింపు లేదనే కారణంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యాన్ని తిరస్కరించకూడదని తెలిపింది.
టీజీఐసెట్కు 90.47% హాజరు
విద్యానగర్ (హనుమకొండ), న్యూస్టుడే: ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్-2024కు 90.47 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కన్వీనర్ ఆచార్య ఎస్.నరసింహాచారి తెలిపారు. ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 8న విడుదల చేస్తామన్నారు.
8 నుంచి డీఈఈసెట్కు దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్కు ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 8 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఆన్లైన్ పరీక్షను జులై 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల తిరుగు బదిలీలు నిర్వహించాలి
సీసీఎల్ఏ నవీన్మిత్తల్కు టీజీటీఏ, ట్రెసాల వినతి
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ను తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) వేర్వేరుగా కోరాయి. టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ నేతృత్వంలో ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో సీసీఎల్ఏను కలిసి విన్నవించారు. అలాగే ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్ నేతృత్వంలో ప్రతినిధులు కలిశారు. ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలకు... 2009 నుంచి తిరుగు బదిలీలు చేపడుతున్నారని గుర్తుచేశారు. ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వర్తించినందుకు రెవెన్యూ ఉద్యోగులకు సీసీఎల్ఏ అభినందనలు తెలియజేశారని ట్రెసా ఒక ప్రకటనలో పేర్కొంది.
నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై కఠిన చర్యలు సింగరేణి సీఎండీ బలరాం
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేటురంగంతో పోటీపడేలా ఉద్యోగులు తమ సామర్థ్యాలను, ఆలోచనలను పెంచుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం స్పష్టం చేశారు. సంస్థల విభాగాల వారీగా పనితీరు మెరుగుపడాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సంస్థ ప్రాజెక్టుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇకపై ప్రతినెలా సమీక్ష ఉంటుందన్నారు. సమావేశంలో అధికారులు శ్రీనివాస్, సత్యనారాయణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ