సంక్షిప్త వార్తలు (5)
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో 22వ గేటును పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు శనివారం పైకెత్తారు.
మేడిగడ్డ బ్యారేజీలో మరో గేటు ఎత్తివేత
ఏడో బ్లాక్లో పైకెత్తిన 22వ గేటు
మహదేవపూర్, న్యూస్టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో 22వ గేటును పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు శనివారం పైకెత్తారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో.. గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తాలని, ఏదైనా సమస్య ఎదురైతే తొలగించాలని సూచించింది. ఈ మేరకు ఏడో బ్లాక్లో ఒక్కో గేటును పైకి ఎత్తుతున్నారు. గత నెల 17న 15వ గేటు, ఈ నెల 6న 16, 17వ గేట్లను పైకెత్తారు. శనివారం 22వ గేటును పూర్తి స్థాయిలో పైకి ఎత్తారు. 20వ గేటు కటింగ్ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా ఏడో బ్లాక్లో సమస్య ఉన్న 18, 19, 20, 21 గేట్లను తొలగించాల్సి ఉంది.
భరోసా సొసైటీకి వియాట్రిస్ సంస్థ విరాళం
తొలివిడతగా రూ.1.5కోట్ల చెక్కు అందజేత
అదనపు డీజీపీ శిఖాగోయెల్కు చెక్కు అందజేస్తున్న వియాట్రిస్ సంస్థ ప్రతినిధి మిచల్ డోమినికా
ఈనాడు, హైదరాబాద్: మహిళా బాధితుల సహాయక కేంద్రమైన భరోసా సొసైటీ భవన నిర్మాణానికి వియాట్రిస్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా, వియాట్రిస్ సంస్థ భారత సీఎస్ఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత) ఇన్ఛార్జి మిచల్ డోమినికా, తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ శిఖాగోయెల్ సమక్షంలో భరోసా సొసైటీ మౌలిక సదుపాయాల పరిధిని విస్తరించేందుకు ఒప్పందంపై హైదరాబాద్లో శనివారం సంతకాలు చేశారు. ఈ క్రమంలో తొలివిడతగా వియాట్రిస్ సంస్థ సీఎస్ఆర్ కింద రూ.కోటిన్నర విరాళానికి సంబంధించిన చెక్కును శిఖాగోయెల్కు డోమినికా అందజేశారు. రెండో విడతలో మరో రూ.కోటి అందించనున్నట్లు ప్రకటించారు.
బోధనాసుపత్రుల వైద్యులకు న్యాయం చేయండి
హైదరాబాద్ కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రభుత్వ బోధనాసుపత్రుల వైద్యులు
సుల్తాన్బజార్, న్యూస్టుడే: వైద్య సంఘాల ప్రమేయం, పైరవీలకు తావులేకుండా సాధారణ బదిలీలను పారదర్శకంగా నిర్వహించి జిల్లాల్లోని బోధనాసుపత్రుల వైద్యులకు న్యాయం చేయాలని రాష్ట్ర వైద్య విద్య కళాశాలలు, బోధనాసుపత్రుల వైద్యుల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. బోధనాసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు శనివారం ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలో సమావేశమయ్యారు. ఏళ్ల తరబడిగా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధి డా.వి.శేఖర్ మాట్లాడుతూ.. సంఘాలను అడ్డుపెట్టుకుని కొందరు వైద్యులు ఏళ్ల తరబడిగా ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిజామాబాద్ వంటి ప్రధాన కేంద్రాల్లోని బోధనాసుపత్రుల్లో తిష్ఠ వేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.మనీష్గుప్తా, డా.బెంజమిన్, డా.బాబూరావు, డా.నాగరాజు, డా.చంద్రశేఖర్, డా.సాంబశివరెడ్డి, డా.మాధవ్, డా.జితేంద్ర, డా.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని(స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను) పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్థికశాఖకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో ఏర్పాటైన రాష్ట్ర ఆర్థిక సంఘం ఇన్ని రోజులు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉంది. గొడిశాల రాజేశంగౌడ్ అధ్యక్షతన ఏర్పాటైన మొదటి ఆర్థిక సంఘం తమ సిఫార్సుల్లో తమ సంస్థను ఆర్థికశాఖ పరిధిలోకి మార్చాలని సిఫార్సు చేసింది. దీనిని ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్-1 అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ
ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యం కోసం ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ శనివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్కు హాజరవుతుండగా అందులో గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వీరికీ సిటీ బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి