సంక్షిప్త వార్తలు (6)
నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది.
నిజామాబాద్ వరకు విస్తరించిన నైరుతి
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. మరోవైపు శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మం జిల్లా కొణిజర్లలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జేఈఈ అడ్వాన్స్డ్లో నారాయణ సంచలనం
ఈనాడు, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో సందేశ్ భోగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్దీప్ మిశ్రా 6వ ర్యాంకు, ఎం.బాలాదిత్య 11వ ర్యాంకు, రాఘవ్ శర్మ 12వ ర్యాంకు, బిస్మిత్ సాహు 16వ ర్యాంకు, ఆర్యన్ ప్రకాశ్ 17వ ర్యాంకు, అమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకు సాధించారన్నారు. వీరితో పాటు 100లోపు 31 ర్యాంకులతో రికార్డు సృష్టించామని తెలిపారు. వివిధ కేటగిరీలలో 6 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు నారాయణవేనని వెల్లడించారు. విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలిపారు.
సత్తా చాటిన శ్రీచైతన్య
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. రాఘవశర్మ ఆలిండియా మొదటి ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో రిథమ్ కేడియా 4వ ర్యాంకు, పుట్టి కుశాల్ కుమార్ 5వ ర్యాంకు, రాజదీప్ మిశ్రా 6వ ర్యాంకు, ధృవిన్ హేమంత్ దోషి 9వ ర్యాంకు, అల్లడబోయిన ఎస్ఎస్డీబీ సిద్ధ్విక్ సుహాస్ 10వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఓపెన్ కేటగిరీలో టాప్ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో 100 లోపు 146, 1000 లోపు 721 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. మొత్తంగా 3,728 మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ అభినందించారు.
అల్ఫోర్స్ విజయఢంకా
కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ విభాగాల్లో జాతీయస్థాయిలో మంచి ర్యాంకులతో విజయఢంకా మోగించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. ఎం.హర్షిత్ 64వ ర్యాంకు, జి.శ్రీహాస్ 290, బి.భరద్వాజ్ 396, ఆర్.పునీత్మనోహర్ 477, సుబోధ్చౌదరి 545, ఎ.శివవరుణ్ 557, పి.రాహుల్ 571, దేవదత్త 751, విశాల్రెడ్డి 838 ర్యాంకు సాధించారని చెప్పారు. 2 వేలలోపు ర్యాంకులను 17 మంది, 5 వేలలోపు ర్యాంకులను 32 మంది విద్యార్థులు సాధించారని వెల్లడించారు.
ఎస్ఆర్ ప్రభంజనం
హనుమకొండ చౌరస్తా, న్యూస్టుడే: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని సంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. వివిధ కేటగిరీల్లో పి.రాకేష్కుమార్ 6వ ర్యాంకు, జి.నవీన్ 8, జె.స్నేహిత్ సందేష్ 123, వి.రాంబాబు 125, వి.వేదవచణ్రెడ్డి 127, జె.శ్రేతన్రెడ్డి 133, బి.దినేష్ 157, ఎం.వెంకటేశ్వర్లు 185, డి.కార్తీక్ 299, టి.అఖిల్నాయక్ 323, కె.శ్రీరాంరెడ్డి 324వ ర్యాంకు సాధించారని తెలిపారు.
11న కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవం
ఈనాడు, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ములుగులో ఈ నెల 11న కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం జరగనుంది. వర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగే స్నాతకోత్సవానికి తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గీతాలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో 156 మందికి ఉద్యాన డిగ్రీ, 50 మంది ఫారెస్ట్ డిగ్రీ, 45 మందికి ఉద్యాన పీజీ డిగ్రీ, ఆరుగురికి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలు అందజేస్తామని విశ్వవిద్యాలయ వీసీ నీరజ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల