డిగ్రీలోనూ కంప్యూటర్సే!
ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇతర కోర్సులను మూసివేసుకొని సీఎస్ఈ సీట్లను కళాశాలల యాజమాన్యాలు భారీగా పెంచుకున్నాయి.
బీకాం జనరల్, బీఎస్సీ జీవ, భౌతికశాస్త్ర కోర్సుల మూసివేత
డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కావాలంటున్న యాజమాన్యాలు
120 కళాశాలల నుంచి 200 కోర్సుల కన్వర్షన్కు దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇతర కోర్సులను మూసివేసుకొని సీఎస్ఈ సీట్లను కళాశాలల యాజమాన్యాలు భారీగా పెంచుకున్నాయి. ఇప్పుడు అదే దిశగా డిగ్రీ విద్య వడివడిగా అడుగులు వేస్తోంది. డిమాండ్ లేని కోర్సులకు టాటా చెప్పి...విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సులు కావాలని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశాయి.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల డిగ్రీ కోర్సుల మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా యాజమాన్యాలు డిమాండ్ లేని కోర్సులను మూసివేసి...తమకు ఇష్టమైన వాటిని ఆ స్థానంలో ప్రవేశపెట్టుకోవచ్చు. అందుకు గడువు గత నెల 25వ తేదీతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 120 కళాశాలల నుంచి దాదాపు 200 కోర్సులను మూసివేసి... కొత్తవి కావాలంటూ దరఖాస్తులు అందాయని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. అంటే డిమాండ్ లేని 10 వేలకుపైగా సీట్ల స్థానంలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీటెక్లో గతంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) బ్రాంచి మాత్రమే ఉండేది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా సీఎస్ఈ ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆ తర్వాత డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తదితర కోర్సులు వచ్చాయి. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాలో 84వేల వరకు బీటెక్ సీట్లు ఉండగా...అందులో సుమారు 57 వేలు కంప్యూటర్ సైన్స్ సంబంధిత సీట్లే. ఇక ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లోని సీట్లను కలిపితే 75 శాతం అవే. వచ్చే కొత్త విద్యా సంవత్సరం(2024-25) మరిన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు రానున్నందున ఆ శాతం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో డిగ్రీలోనూ అదే పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘విదేశీ విద్యకు వెళ్లాలంటే ఇంటర్ తర్వాత నాలుగేళ్ల విద్య అవసరం. అందుకోసమే గత విద్యా సంవత్సరం బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పేరిట 13 కళాశాలల్లో కోర్సును ప్రవేశపెట్టాం. ఈసారి మరికొన్ని కళాశాలల్లో అందుబాటులోకి వస్తుంది’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. అంతిమంగా ఉద్యోగాలు, ఉపాధి లభించేలా చేయడమే ధ్యేయంగా బీఎస్సీ డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులను ప్రవేశపెట్టామని చెప్పారు.
ఏ కోర్సులకు డిమాండ్?
బీకాం జనరల్, బీఎస్సీ జీవ, భౌతికశాస్త్రాల కోర్సులను మూసివేసి...వాటి స్థానంలో బీకాం కంప్యూటర్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ బిజినెస్ ఎనలిటిక్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీసీఏ, మరికొన్ని బీబీఏ డేటా ఎనలిటిక్స్ లాంటి కోర్సులకు దరఖాస్తులు అందాయి. కంప్యూటర్ పరిజ్ఞానం లేకుండా బీకాం చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే పరిస్థితి లేదని, దానికితోడు మార్కెట్లో డిమాండ్ ఉన్న డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్ తదితర వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పరమేశ్వర్ తెలిపారు. ఒకప్పుడు కేవలం డిగ్రీ కోసం ఏదో ఒక కోర్సులో చేరేవారని... ఇప్పుడు ఉద్యోగం వస్తుందా? ప్రాంగణ నియామకాలు ఉంటాయా? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎంఎస్సీ, ఆ తర్వాత పరిశోధన చేసే ఆసక్తి ఉన్న వారే బీఎస్సీ లైఫ్ సైన్సెస్, ఫిజిక్స్లో చేరుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!