Global Rice Summit: బియ్యం ఎగుమతులతో ఉజ్వల భవిష్యత్తు
బియ్యం ఎగుమతుల్లో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో 45 శాతం వాటా ఉన్న మన దేశం మున్ముందు 70 శాతానికి పైగా వాటాను సాధించే అవకాశం ఉందని భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రేమ్గార్గ్ తెలిపారు.
వరి రైతులకు రెట్టింపు ఆదాయాలొచ్చే అవకాశం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
ఎగుమతిదారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రేమ్గార్గ్
ఈనాడు, హైదరాబాద్: బియ్యం ఎగుమతుల్లో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో 45 శాతం వాటా ఉన్న మన దేశం మున్ముందు 70 శాతానికి పైగా వాటాను సాధించే అవకాశం ఉందని భారతీయ బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రేమ్గార్గ్ తెలిపారు. ఎగుమతులను వ్యాపార కోణంలో కాకుండా.. రైతుల ప్రయోజనాల దృష్టితో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలన్నారు. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్ రైస్ సమ్మిట్) కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘ఈనాడు’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
- ప్రపంచంలో అతిపెద్ద ఆహార పంటల ఉత్పత్తిదారుగా భారత్ నుంచి ఎగుమతులకు అపార అవకాశాలున్నాయి. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. దేశీయ అవసరాలు పోను 30 శాతానికి పైగా అన్ని ఆహార పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తే ఇటు రైతులకు అటు దేశానికి భారీ ఆదాయం వచ్చే వీలుంది. బియ్యం దేశీయ వినియోగం పోను.. మిగిలిన దాంట్లో 40 శాతం ఎగుమతులకు వీలుంది. కానీ, 15 శాతం లోపే ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2023లో ఇక్కడి నుంచి 17 మిలియన్ టన్నుల బియ్యం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, బంగ్లాదేశ్, యూఏఈ, ఫిలిప్పీన్స్ తదితర 100 దేశాలకు ఎగుమతి అయ్యాయి. తద్వారా మనకు రూ. 70 వేల కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యం లభించింది. 2030 నాటికి 30 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులకు అవకాశం ఉంది.
- కేంద్ర ప్రభుత్వ విధానాలు కఠినంగా ఉన్నాయి. బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 20 శాతం మేర సుంకం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎగుమతి సుంకం ఉండదు. దీంతో పాటు మన ఎగుమతులకు కస్టమ్స్ సమస్యలున్నాయి. స్థిరమైన విధానం లేకపోవడం దీనికి కారణం. ఎగుమతులను ఉచితంగా అనుమతించాలని, లేదా టన్నుకు 80 డాలర్ల స్థిర ఎగుమతి సుంకాన్ని విధించాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందించడం లేదు. ఎగుమతులను తరచూ నిషేధించడం వల్ల వృద్ధి ప్రభావితమవుతోంది. దేశంలో ఏటా రెండు, మూడు పంటలు పండుతున్నాయి. వాటిని ఎగుమతులకు వినియోగించుకునే వెసులుబాటు కలగాలి. రవాణా, హ్యాండ్లింగ్ ఛార్జీలు ఏటేటా పెరగడం మాకు భారంగా మారుతోంది.
- సాగులో దిగుబడులు తగ్గినప్పుడు నిల్వల వినియోగంపై కేంద్రం దృష్టి సారించాలి. భారీఎత్తున బియ్యం నిల్వలను ప్రజోపయోగంలోకి తేవాలి. అది జరగడం లేదు. ద్రవ్యోల్బణం ఎప్పటికీ ఉంటుంది. ధరలు తగ్గించే విధానాలకు బదులు.. ఎగుమతులను నిషేధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
‘సేంద్రియ’ పంటలకు మంచి డిమాండ్
మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో మాత్రం ఎరువులు, పురుగుమందులు వాడని బియ్యం కావాలని కోరుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. దాదాపు 16 మిలియన్ టన్నుల మేరకు ఈ డిమాండ్ ఉండగా.. పాకిస్థాన్ తదితర దేశాలు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఈ సమస్య నివారణకు రైతులను చైతన్యవంతులను చేయాలి. సేంద్రియ, ప్రకృతి విధానంలో పండిన పంటలకు ఎగుమతుల్లో అత్యధిక డిమాండ్ ఉంటోంది. వాటికి కోరిన ధర లభిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఎగుమతులు పెరిగితే మొదటి ప్రయోజనం అందేది రైతులకే. ఎగుమతి ప్రమాణాలున్న పంటలకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు తామే నేరుగా శుద్ధి, మిల్లింగ్ చేసి విక్రయిస్తే వారికి మరింత లాభాలు వస్తాయి.
తెలుగు రాష్ట్రాలు టాప్
విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. గత ఏడాది భారత్ నుంచి మొత్తం 1.30 కోట్ల టన్నుల సాధారణ బియ్యం ఎగుమతి కాగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 36.16 శాతం (47.45 లక్షల టన్నులు) ఉన్నాయి. వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల మొత్తం ఎగుమతుల్లో సాధారణ, బాస్మతి బియ్యం కలిపి 65 శాతం వరకూ ఉన్నాయి. రైతులకు అవగాహన, మౌలిక వసతులు కల్పిస్తే ఈ రాష్ట్రాల నుంచి ఇంకా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం