Hyderabad: వర్షం కురుస్తుందా.. వ్యర్థాలు వదిలెయ్!
పలు రసాయన పరిశ్రమల నిర్వాహకుల స్వార్థం.. సమీప నివాస ప్రాంతాల్లోని ప్రజల మనుగడను దుర్భరంగా మారుస్తోంది. పీల్చడానికి మంచి గాలి, సురక్షిత తాగునీరు.. ప్రశాంత వాతావరణం కనుమరుగవుతోంది.
పలు రసాయన పరిశ్రమల తీరిది..
సమీప కాలనీల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
కాలుష్యంపై పీసీబీకి ఏటా వేలల్లో ఫిర్యాదులు
సంగారెడ్డి జిల్లా కాజిపల్లి గ్రామ శివారులో ఓ పరిశ్రమ నుంచి నివాస ప్రాంతంలోకి వచ్చిన రసాయన వ్యర్థాలు
ఈనాడు, హైదరాబాద్: పలు రసాయన పరిశ్రమల నిర్వాహకుల స్వార్థం.. సమీప నివాస ప్రాంతాల్లోని ప్రజల మనుగడను దుర్భరంగా మారుస్తోంది. పీల్చడానికి మంచి గాలి, సురక్షిత తాగునీరు.. ప్రశాంత వాతావరణం కనుమరుగవుతోంది. పలు పరిశ్రమల నిర్వాహకులు.. వ్యర్థాల శుద్ధి ఖర్చును తగ్గించుకునేందుకు వర్షాలను ఉపయోగించుకుంటున్నారు. నిత్యం వెలువడే వ్యర్థాల్ని డ్రమ్ముల్లో నింపుతూ, వానలు పడ్డప్పుడు ఆ నీటిలో వదిలేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంతో తలెత్తే ఈ సమస్య.. ఈసారి అకాలవర్షాల కురుస్తుండటంతో ఏప్రిల్ నుంచే మొదలైంది. ఐడీఏ ఉప్పల్, నాచారం, జీడిమెట్ల, కాటేదాన్, బొల్లారం, గడ్డపోతారం, పటాన్చెరు, ఖాజీపల్లి వంటి ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్థాల్ని ఇటీవల వానల సమయంలో బయటకు వదిలిపెట్టాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏటా మూడు వేలు...
మొత్తంగా కాలుష్య సమస్యలపై పీసీబీకి రాష్ట్రవ్యాప్తంగా ఏటా మూడు వేల వరకు ఫిర్యాదులు వస్తున్నట్లు అంచనా. సగటున ప్రతి నెల రెండు, మూడు వందలు వస్తున్నాయి. ఒక్క జిన్నారం మండలం నుంచే ఏడాదికి వెయ్యికి పైగా ఫిర్యాదులు ఉంటున్నాయి. బాధిత ప్రజలు టోల్ఫ్రీ నంబర్- 10741, పీసీబీ వెబ్సైట్ ద్వారా, నేరుగా జోనల్, ప్రధాన కార్యాలయాలకు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, కొత్తగూడెం, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. కొత్తగా చౌటుప్పల్, తాండూరు, కొత్తూరు, నల్గొండ, రామగుండం, వరంగల్, ఖమ్మం వంటి నగరాలు, పట్టణాల్లోనూ ఈ సమస్య పెరిగిపోతోంది. గత ఏడాది 508 పరిశ్రమలపై ఫిర్యాదులు రాగా.. పీసీబీ జరిపిన తనిఖీల్లో ఏకంగా 266 పరిశ్రమలు కాలుష్య నివారణ చట్టాల్ని ఉల్లంఘించినట్లు వెల్లడి కావడం క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అద్దంపడుతోంది. వీటిలో 87 పరిశ్రమలను పీసీబీ మూసివేయించగా.. 179 పరిశ్రమలను లోపాలు సవరించుకోవాలని హెచ్చరించింది. జిన్నారం మండలంలో 15 పరిశ్రమల బ్యాంకు గ్యారంటీని జప్తుచేసింది. రేయింబవళ్లు భవన నిర్మాణాల కారణంగా ధ్వని కాలుష్యంతోనూ ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.
విచారణలో నిర్లక్ష్యం..
ఒక పరిశ్రమపై వేర్వేరు వ్యక్తులు చేసిన ఫిర్యాదుల్ని, వేర్వేరు సమయాల్లో ఇచ్చిన వాటిని పీసీబీ అధికారులు ఒకే గాటన కడుతున్నారు. కాలుష్య సమస్యలపై టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసినప్పుడు.. వివరాలు నమోదు చేసుకోకుండా అధికారుల్ని పంపిస్తామని చెప్పి పెట్టేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఫిర్యాదు వచ్చిన కంపెనీకి సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా అనేక ఫిర్యాదులపై విచారణ క్షేత్రస్థాయి వరకు వెళ్లడం లేదు. మరోవైపు కొందరు వ్యక్తులు, సంస్థలు ఫిర్యాదుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పీసీబీ అధికారి పేర్కొన్నారు.
ఈ వ్యర్థాల శుద్ధి ఎప్పుడో?
- రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులతో పాటు మూసీ తదితర ఉపనదుల్లో.. పీసీబీ, సీపీసీబీలు ప్రతి నెలా 280 ప్రాంతాల్లో కాలుష్య నమూనాలు సేకరిస్తాయి. వీటిలో 220 పైచిలుకు ప్రాంతాల్లో నదులు, ఉపనదులు కాలుష్య కోరల్లో ఉన్నాయి.
- రాష్ట్రంలో ప్రతిరోజు 2,750 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుంటే.. శుద్ధి అవుతున్నది దాదాపు 1217 మిలియన్ లీటర్లే. మిగిలిన శుద్ధి కాని మురుగునీరు నీటివనరుల్ని కలుషితం చేస్తోంది. బొల్లారం, కూకట్పల్లి, కాటేదాన్, పటాన్చెరు ప్రాంతాల్లో నీటి కాలుష్యం పెరుగుతోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ నాలుగున్నరేళ్ల క్రితమే హెచ్చరించింది.
- పట్టణాలు, నగరాల్లో నిత్యం 11,522 టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే.. అందులో 9,565 టన్నులనే శుద్ధి చేస్తున్నారు.
నరకం అనుభవిస్తున్నాం
గడ్డపోతారం, కాజీపల్లిలలో పరిశ్రమల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జల, వాయు కాలుష్య సమస్యలతో నరకం అనుభవిస్తున్నాం. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నారు.
నవీన్, కిష్టాయపల్లి, జిన్నారం, మెదక్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.