Yasangi Crops: యాసంగి.. యాతన
పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడిన యాసంగి రైతులకు.. ప్రస్తుతం కోతల సమయంలో అకాలవర్షాలు శరాఘాతంగా మారాయి.
ఏటా అకాల వర్షాలు, వడగళ్లతో పంటలకు అపార నష్టం
పూర్తిస్థాయిలో అందని పరిహారంతో అన్నదాతల అగచాట్లు
ఈనాడు - హైదరాబాద్
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం
తాడిచెర్లలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం
పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడిన యాసంగి రైతులకు.. ప్రస్తుతం కోతల సమయంలో అకాలవర్షాలు శరాఘాతంగా మారాయి. మధ్యలో మార్చిలోనూ వడగళ్ల వానలతో కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుత మండు వేసవిలో ఈదురుగాలులు, భారీ వర్షాలు అన్నదాతల వెన్నువిరుస్తున్నాయి.
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి
సాధారణంగా నవంబరు నుంచి మే వరకు యాసంగి కొనసాగుతుంది. ఈ సమయంలో వర్షాలు ఉండవనే నమ్మకంతో వరితోపాటు అపరాలు, వాణిజ్య పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తారు. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడులు వస్తాయి. అయితే వాతావరణ మార్పులు రైతుల ఆశలకు గండి కొడుతున్నాయి. అకాల వర్షాలు, వడగళ్లతో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మామిడికాయలు రాలిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ నష్టాలు ఆనవాయితీగా మారాయి. పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ నిధుల నుంచి సాయం అందించాలి. అకాల వర్షాల విషయంలో మాత్రం సరిగా అందడం లేదు. వ్యవసాయశాఖ నిబంధనలు కూడా అసంబద్ధంగా ఉంటున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఒక రైతుకు సంబంధించి మూడో వంతు కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే సాయం పొందేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి సాయం అందడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం పంటల బీమా పథకాలేవీ అమల్లో లేవు. ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్రం నుంచి సాయం అందాల్సి ఉన్నా రావడం లేదు. గత అయిదేళ్లుగా భారీ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపుతున్నా.. సాయం మాత్రం రాలేదు. గత ఏడాది మార్చి నెలలో జరిగిన నష్టానికిగాను తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను ఎకరానికి రూ.10 వేలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించి అందించింది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మరో రెండుసార్లు వర్షాలు పడగా ప్రభుత్వం సాయం ప్రకటించింది. జీవో కూడా ఇచ్చినప్పటికీ సాయం అందలేదు. ఈ ఏడాది మార్చి 16-22 తేదీల మధ్య కురిసిన అకాల వర్షానికి సంబంధించి జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 15.81 కోట్లు విడుదల చేయడం కాస్త ఊరటనిచ్చే అంశం.
నెల ముందుగానే..
ఏటా సంభవిస్తున్న అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం కలుగుతుండటంపై ప్రభుత్వ స్థాయిలో విస్తృత చర్చలు జరిగాయి. యాసంగి సీజన్ను నెల రోజులు ముందుకు జరపాలనే ప్రతిపాదనను పరిశీలించింది. అక్టోబరులో ప్రారంభించి ఫిబ్రవరి లేదా మార్చిలో ముగించాలని యోచించింది. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఈ విధానం నడుస్తోంది. అదే తరహాలో రాష్ట్రమంతటా అమలు చేయాలని భావించినా గతేడాది వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రతిపాదన అమలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సీజన్ నుంచి రైతుబీమా అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి విధివిధానాలు కూడా సిద్ధం చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే రైతులకు కొంత ఊరట కలిగే వీలుంది.
కష్టమంతా వర్షార్పణం
వీరిద్దరూ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింపన్న రమేష్ దంపతులు. స్థానికంగా రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. కొంతైనా కాపాడుకుందామనే తాపత్రయంతో ఇలా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు