Uttamkumar Reddy: మేడిగడ్డకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.
రోజువారీ పనుల పురోగతిపై నివేదికలు ఇవ్వాలి
నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
వచ్చే వారం బ్యారేజీ పరిశీలనకు సీఎం రేవంత్రెడ్డి
సమీక్ష నిర్వహిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.
చిత్రంలో ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్, సీడబ్ల్యూసీ ఇంజినీరు,్ల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై ఇటీవల జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్ఏ) ప్రభుత్వానికి అందజేసిన మధ్యంతర నివేదిక మేరకు పనులు కొనసాగించాలన్నారు. వర్షాలు వచ్చేలోగా తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యారేజీ వద్ద తాత్కాలిక పనులను పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్నారం, సుందిళ్ల వద్ద పనులనూ చేపట్టాలన్నారు. వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని, రోజువారీ పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. పర్యటన తేదీలను నీటిపారుదల శాఖ నాలుగు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
జేఎన్టీయూ, నిట్ నిపుణులతో కమిటీ ఏర్పాటు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సూచనలు, సలహాలు అందించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ విశ్రాంత సీఈ కె.శ్రీకాంత్ కన్వీనర్గా మరో నలుగురు సభ్యులను కమిటీలో నియమించారు. నిట్ విశ్రాంత ఆచార్యుడు సీబీ కామేశ్వర్రావు (సివిల్), విశ్రాంత సీఈ కె.సత్యనారాయణ (మెకానికల్), వరంగల్ నిట్ ఆచార్యుడు రమణమూర్తి (జియో టెక్నికల్), హైదరాబాద్ ఐఐటీ ఆచార్యుడు టి.శశిధర్ (హైడ్రాలజీ- ప్లానింగ్) సభ్యులుగా ఉన్నారు. మూడు బ్యారేజీలను సందర్శించి, సమగ్ర అధ్యయనం చేశాక కమిషన్కు ఈ కమిటీ నివేదిక అందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు
భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. -
ఖాళీల్లోనే ఆ పాఠశాలలు ఆదర్శం!
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. -
అంతిమ లబ్ధిదారులే కీలకం
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడుకు పరిహారం చెల్లించాల్సిందే
గ్యాస్ సిలిండర్ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. -
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఇన్ఛార్జి వీసీలే
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు. -
నిన్నటి మనస్తత్వంతో రేపటి పోరాటం చేయలేం
-
ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల ధర్నా
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నల్లమలలో చిరుత మృతి
నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. -
మొలకెత్తింది కష్టాలే
జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. -
బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి
ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి
కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. -
నియంతృత్వ, నిర్బంధ పోకడలు తగవు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
రమేశ్కార్తీక్ నాయక్ను వరించిన ‘యువ పురస్కార్’
ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. -
అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు
తెలంగాణలో వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!