Kaleshwaram Project: అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది.
‘కాళేశ్వరం’పై అన్ని కోణాల్లో వివరాలివ్వండి
ఈనెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే
ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం
ఏ ఒక్క అంశాన్నీ దాచొద్దని సమీక్షలో సీఎం స్పష్టీకరణ
తదనుగుణంగా విచారణ కమిషన్కు నివేదించేందుకు అడుగులు
ఈనాడు - హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో గేట్ల వద్ద కొనసాగుతున్న ఇసుక తొలగింపు పనులు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణ స్థలానికి సంబంధించి మొదట ఇచ్చిన ఆమోదం, తర్వాత జరిగిన మార్పు, ఈ మార్పులకు ఆమోదం తెలిపిందెవరు, మూడు నిర్మాణాలను బ్యారేజీలుగా చేపట్టారా లేక డ్యాములుగానా, మూడింటికీ ఒకే రకమైన డిజైన్లు అమలు చేశారా, పనులు ప్రారంభించకముందే సమగ్ర అధ్యయనం చేశారా... ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలను కోరింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, అధికార, అనధికార ఉప గుత్తేదారులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, గుత్తేదారులకు కలిగిన అయాచిత లబ్ధి, పని పూర్తికాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం... ఇలా అనేక అంశాలపై డాక్యుమెంట్లను కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్), ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్, కాళేశ్వరం (రామగుండం), సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్లకు ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరంగా భావించి వివరాలను ఈ నెల 25వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సమర్పించడానికి వీలుగా ఈ దస్త్రాలన్నీ ఇవ్వాలని కోరారు.ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డపై సమీక్షించిన సందర్భంగా మొత్తం రికార్డులన్నీ కమిషన్కు అందజేయాలని, కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వకుండా పక్కనపెట్టే అవకాశముందని పేర్కొన్న నేపథ్యంలో కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంజినీర్ల నుంచి కోరిన డాక్యుమెంట్లలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి...
- కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ప్రారంభమైంది? దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఏమున్నాయి? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపెట్టి కాళేశ్వరం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? 2015 జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నియమితులైన విశ్రాంత ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైంది? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం చేపట్టినప్పుడు ఎలాంటి ప్రయోజనాలుంటాయని అంచనా వేశారు? ఈ రెండింటి ఖర్చు, ప్రయోజనానికి సంబంధించిన నివేదికలు.
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డీపీఆర్లు, వాటి సమగ్ర ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
- బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చడం నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇలా మార్చడానికి ఎవరు ఆమోదం తెలిపారు? ఒరిజినల్ డీపీఆర్ ప్రకారం కాకుండా మార్చడానికి కారణాలేంటి? సంబంధిత నివేదికలు. ఈ మూడు స్ట్రక్చర్లను ఎలా డిజైన్ చేశారు... బ్యారేజీలుగానా లేదా డ్యాములు గానా..? బ్యారేజీలుగా డిజైన్ చేసి ఉంటే ఏయే పరీక్షలు చేశారు? ఐ.ఎస్.కోడ్లు, బ్యారేజీల మాన్యువల్స్ ప్రకారం ఏమేం చేశారు? డ్యాములుగా డిజైన్ చేసి ఉంటే ఏమేం పరీక్షలు చేశారు? వాటి వివరాలు...
- మేడిగడ్డ నిర్మాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నాయనే అంచనాలు నిజమా, కాదా?
- మూడు బ్యారేజీలు/డ్యాముల్లోనూ భారీగా నీటిని నిల్వ చేసినందున అందుకు తగ్గట్లుగా డిజైన్ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? సీడీవో ఇంజినీర్లు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించాక డిజైన్లు ఇచ్చారా లేదా ఫీల్డ్ ఇంజినీర్లు ఇచ్చిన డేటా ఆధారంతోనా...? బ్యారేజీల డిజైన్లలో ఏజెన్సీల పాత్ర ఏమిటి? ప్రత్యేకించి మేడిగడ్డ డిజైన్ల ఖరారులో ఎల్అండ్టీ పాత్ర ఏమిటి? బ్యారేజీల నిర్మాణ సమయంలో షీట్పైల్స్కు బదులు సీకెంట్ పైల్స్ వాడటంలో సీడీవో చీఫ్ ఇంజినీర్ సిఫార్సులేంటి?
- మూడు బ్యారేజీలను గోదావరిపై వరుసగా నిర్మించినందున ఒకేరకమైన డిజైన్లు అమలు చేశారా లేక ఏమైనా మార్పులున్నాయా? ఒకవేళ వేర్వేరు డిజైన్లు ఉంటే కారణమేంటి? సీడీవో ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మించారా, ఐఎస్ కోడ్ ప్రకారమా... ఆచరణలో ఉన్న డిజైన్ మాన్యువల్ ప్రకారమే చేశారా?
- డిజైన్ల ఖరారులో గరిష్ఠ వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొన్నారా? షూటింగ్ వెలాసిటీ, ఆప్రాన్ పొడవు, మందం సరిగా డిజైన్ చేయలేదనే ఆరోపణలున్నాయి కదా... బ్యారేజీల నిర్మాణంలో మీరు అవలంబించిన నిబంధనలను ఎలా సమర్థించుకొంటారు? ఎంత వరదకు డిజైన్ చేశారు? జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్, బ్యారేజీ స్ట్టెబిలిటీ, కట్ ఆఫ్స్ డిజైన్, ఆర్సీసీ రాఫ్ట్, పియర్స్ డిజైన్ల వివరాలు...
- మూడు బ్యారేజీల ఒప్పందాలు, గుత్తేదారుల వివరాలు, టెండర్ల ఆమోదానికి సంబంధించిన మినిట్స్, పనుల అప్పగింతకు సంబంధించిన వివరాలు, అధికార, అనధికార ఉప గుత్తేదారుల వివరాలు, అనుబంధ ఒప్పందాలు, గడువు పొడిగింపు వివరాలు, లిక్విడేట్ డ్యామేజెస్ ఉంటే వాటి వివరాలు, లాగ్ బుక్స్, సర్వే వివరాలు, నిర్మాణ, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఉన్నత స్థాయి ఇంజినీర్ల తనిఖీల నివేదికలు, నిర్మాణంలో మార్పులు, రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ, ప్రభుత్వ స్థాయిలో ఆమోదానికి సంబంధించిన రికార్డులు, గుత్తేదారుల పేమెంట్ వివరాలు, కాగ్ సిఫార్సులు, మూడు బ్యారేజీల క్లియరెన్స్కు సంబంధించిన డాక్యుమెంట్లు...
- బ్యారేజీల వారీగా గుత్తేదారుల అర్హతలు, ప్రాజెక్టు ఎస్ఈ, కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) మినిట్స్ వివరాలు...
- నిర్మాణానికి సంబంధించిన నిధుల వివరాలు, ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం ఆమోదించి ఉంటే వివరాలు, ప్రభుత్వ ఖజానాపై భారానికి సంబంధించిన వివరాలు...
- ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందా..? డ్యాం సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఆపరేషన్ ప్రొటోకాల్ పాటించారా, 2020లో వరద తర్వాత బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని గుర్తించినప్పుడు నీటిపారుదల శాఖ, ఓ అండ్ ఎం విభాగం గుర్తించిన అంశాలేంటి? నిర్వహణలో గేట్స్ ప్రొటోకాల్ పాటించారా, బ్యారేజీలు వైఫల్యం చెందడానికి కారణాలతో నివేదిక...
- క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలనలో గుర్తించిన అంశాలు, చేసిన సిఫార్సుల వివరాలు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలపై క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ నుంచి సమగ్ర నివేదిక.
- గుత్తేదారులకు అయాచిత ప్రయోజనాలు, ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సిఫార్సులు, ప్రభుత్వ ఆమోదాల వివరాలు.
- పనులు పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్లు, ఒప్పందంలోని నిబంధనల వివరాలు. పని జరుగుతుండగానే, ఒప్పందం గడువు ఉండగానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇస్తే సంబంధిత వివరాలు. బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు. ఒప్పందానికి భిన్నంగా ముందుగానే బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇచ్చి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు
మేడిగడ్డలో మరిన్ని గేట్లు ఎత్తడానికి సన్నాహాలు
మహదేవపూర్, న్యూస్టుడే: మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా మరిన్ని పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కుంగిన ఏడో బ్లాక్లో మొత్తం 11 గేట్లు ఉండగా ఎనిమిది మూసి ఉన్నాయి. శుక్రవారం 15వ గేటును ఎత్తగా, మిగిలిన ఏడింటిని ఎత్తడానికి పనులు చేస్తున్నారు. వరద ప్రవాహానికి గేట్ల మధ్యలో ఇరుక్కున చెత్త, మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. 16వ గేటును ఎత్తడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గురువారం వరకు దాన్ని ఎత్తే అవకాశముంది. బ్యారేజీ దిగువన వరద ప్రవాహానికి కొట్టుకుపోయి, చెల్లాచెదురైన సీసీ బ్లాక్ల అమరికకు, శాండ్ గ్రౌటింగ్ చేపట్టడానికి పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వచ్చే వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ పైల్స్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా దశాబ్ది సంబురం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న (ఆదివారం) ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయింది. -
బినామీ ఖాతాలతో మేశారు
గొర్రెల పథకం కుంభకోణంలో దళారులు, అధికారులు కలిసి సుమారు రూ.700 కోట్ల నిధులు కాజేసిన తీరు అవినీతి నిరోధక శాఖ(అనిశా) దర్యాప్తులో తేటతెల్లమైంది. -
హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని
తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందన్నారు. -
పార్టీలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు: మంత్రి పొన్నం
పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు శనివారం పరిశీలించారు. -
అణువణువూ పరిశీలన...
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా ఇందులో భాగమైన సాంకేతిక నిపుణుల బృందం శనివారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించింది. -
నేటి నుంచి టోల్ పెంపు
ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. -
న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఆ దేశంలో ఆక్ల్యాండ్ నగరంలోని అవండేల్ కళాశాల ఆడిటోరియంలో శనివారం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. -
గంజాయి సాగు చేస్తే రైతు భరోసా నిలిపివేత
తెలంగాణలో మాదక ద్రవ్యాలను, మత్తు పదార్థాల వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో అరికట్టే ఉద్దేశంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. -
సింగరేణికి అత్యుత్తమ పనితీరు అవార్డు
సంస్థ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సింగరేణి సంస్థకు, ఆ సంస్థ సీఎండీ బలరాంకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) సంస్థ ఈ అవార్డులకు ఎంపిక చేసింది. -
ఘనంగా కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన దీక్షాపరులు, భక్తుల రామ నామస్మరణతో క్షేత్రం మారుమోగింది. -
బ్యాంకులు ప్రజలకు ఇంకా దగ్గర కావాలి
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
ఇదీ సంగతి!
-
శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. -
అమల్లోకి ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ
టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల వేతన సవరణ జూన్ 1 శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త వేతనాలు జులైలో అందనున్నాయి. -
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై మూడు నెలల్లో నివేదిక
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ జరిపి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడించారు. -
వాటాల బదలాయింపు కేసులో నిందితులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఓ ప్రైవేటు కంపెనీలోని వాటాల బదలాయింపు కేసులో నిందితులైన రాజశేఖర్ తలసిల్ల, చంద్రశేఖర్ వేగెలను అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
యాదాద్రి మే నెల ఆదాయం రూ.18.49 కోట్లు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మే నెలలో భక్తుల ద్వారా లభించిన ఆదాయ వివరాలను దేవస్థానం శనివారం విడుదల చేసింది. మే నెలలో ఆలయానికి అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా రూ.18.49 కోట్లు సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది. -
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దు: భట్టి
త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని స్థాయుల్లోని విద్యుత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు. -
రైతులకు మేలు చేసే పథకాలనే అమలు చేస్తాం
రాష్ట్రంలో అన్నదాతలకు అన్ని విధాలుగా మేలు కలిగించే పథకాలనే అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సమగ్రాభివృద్ధి కోసం రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమాలను రూపొందిస్తున్నామన్నారు. -
సంక్షిప్త వార్తలు(9)
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 1.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్లు వివరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్జీ.. ఇప్పటికైనా పగటి కలలు కనడం మానండి: రవిశంకర్
-
తిహాడ్ జైలులో లొంగిపోయిన కేజ్రీవాల్
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
ట్యాంక్బండ్పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?