Kaleshwaram Project: అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది.
‘కాళేశ్వరం’పై అన్ని కోణాల్లో వివరాలివ్వండి
ఈనెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే
ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం
ఏ ఒక్క అంశాన్నీ దాచొద్దని సమీక్షలో సీఎం స్పష్టీకరణ
తదనుగుణంగా విచారణ కమిషన్కు నివేదించేందుకు అడుగులు
ఈనాడు - హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో గేట్ల వద్ద కొనసాగుతున్న ఇసుక తొలగింపు పనులు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణ స్థలానికి సంబంధించి మొదట ఇచ్చిన ఆమోదం, తర్వాత జరిగిన మార్పు, ఈ మార్పులకు ఆమోదం తెలిపిందెవరు, మూడు నిర్మాణాలను బ్యారేజీలుగా చేపట్టారా లేక డ్యాములుగానా, మూడింటికీ ఒకే రకమైన డిజైన్లు అమలు చేశారా, పనులు ప్రారంభించకముందే సమగ్ర అధ్యయనం చేశారా... ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలను కోరింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, అధికార, అనధికార ఉప గుత్తేదారులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, గుత్తేదారులకు కలిగిన అయాచిత లబ్ధి, పని పూర్తికాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం... ఇలా అనేక అంశాలపై డాక్యుమెంట్లను కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్), ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్, కాళేశ్వరం (రామగుండం), సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్లకు ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరంగా భావించి వివరాలను ఈ నెల 25వ తేదీలోగా అందజేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సమర్పించడానికి వీలుగా ఈ దస్త్రాలన్నీ ఇవ్వాలని కోరారు.ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డపై సమీక్షించిన సందర్భంగా మొత్తం రికార్డులన్నీ కమిషన్కు అందజేయాలని, కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వకుండా పక్కనపెట్టే అవకాశముందని పేర్కొన్న నేపథ్యంలో కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంజినీర్ల నుంచి కోరిన డాక్యుమెంట్లలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి...
- కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా ప్రారంభమైంది? దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఏమున్నాయి? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదనను పక్కనపెట్టి కాళేశ్వరం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? 2015 జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నియమితులైన విశ్రాంత ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక ఏమైంది? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం చేపట్టినప్పుడు ఎలాంటి ప్రయోజనాలుంటాయని అంచనా వేశారు? ఈ రెండింటి ఖర్చు, ప్రయోజనానికి సంబంధించిన నివేదికలు.
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డీపీఆర్లు, వాటి సమగ్ర ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
- బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చడం నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇలా మార్చడానికి ఎవరు ఆమోదం తెలిపారు? ఒరిజినల్ డీపీఆర్ ప్రకారం కాకుండా మార్చడానికి కారణాలేంటి? సంబంధిత నివేదికలు. ఈ మూడు స్ట్రక్చర్లను ఎలా డిజైన్ చేశారు... బ్యారేజీలుగానా లేదా డ్యాములు గానా..? బ్యారేజీలుగా డిజైన్ చేసి ఉంటే ఏయే పరీక్షలు చేశారు? ఐ.ఎస్.కోడ్లు, బ్యారేజీల మాన్యువల్స్ ప్రకారం ఏమేం చేశారు? డ్యాములుగా డిజైన్ చేసి ఉంటే ఏమేం పరీక్షలు చేశారు? వాటి వివరాలు...
- మేడిగడ్డ నిర్మాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నాయనే అంచనాలు నిజమా, కాదా?
- మూడు బ్యారేజీలు/డ్యాముల్లోనూ భారీగా నీటిని నిల్వ చేసినందున అందుకు తగ్గట్లుగా డిజైన్ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? సీడీవో ఇంజినీర్లు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించాక డిజైన్లు ఇచ్చారా లేదా ఫీల్డ్ ఇంజినీర్లు ఇచ్చిన డేటా ఆధారంతోనా...? బ్యారేజీల డిజైన్లలో ఏజెన్సీల పాత్ర ఏమిటి? ప్రత్యేకించి మేడిగడ్డ డిజైన్ల ఖరారులో ఎల్అండ్టీ పాత్ర ఏమిటి? బ్యారేజీల నిర్మాణ సమయంలో షీట్పైల్స్కు బదులు సీకెంట్ పైల్స్ వాడటంలో సీడీవో చీఫ్ ఇంజినీర్ సిఫార్సులేంటి?
- మూడు బ్యారేజీలను గోదావరిపై వరుసగా నిర్మించినందున ఒకేరకమైన డిజైన్లు అమలు చేశారా లేక ఏమైనా మార్పులున్నాయా? ఒకవేళ వేర్వేరు డిజైన్లు ఉంటే కారణమేంటి? సీడీవో ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మించారా, ఐఎస్ కోడ్ ప్రకారమా... ఆచరణలో ఉన్న డిజైన్ మాన్యువల్ ప్రకారమే చేశారా?
- డిజైన్ల ఖరారులో గరిష్ఠ వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొన్నారా? షూటింగ్ వెలాసిటీ, ఆప్రాన్ పొడవు, మందం సరిగా డిజైన్ చేయలేదనే ఆరోపణలున్నాయి కదా... బ్యారేజీల నిర్మాణంలో మీరు అవలంబించిన నిబంధనలను ఎలా సమర్థించుకొంటారు? ఎంత వరదకు డిజైన్ చేశారు? జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్, బ్యారేజీ స్ట్టెబిలిటీ, కట్ ఆఫ్స్ డిజైన్, ఆర్సీసీ రాఫ్ట్, పియర్స్ డిజైన్ల వివరాలు...
- మూడు బ్యారేజీల ఒప్పందాలు, గుత్తేదారుల వివరాలు, టెండర్ల ఆమోదానికి సంబంధించిన మినిట్స్, పనుల అప్పగింతకు సంబంధించిన వివరాలు, అధికార, అనధికార ఉప గుత్తేదారుల వివరాలు, అనుబంధ ఒప్పందాలు, గడువు పొడిగింపు వివరాలు, లిక్విడేట్ డ్యామేజెస్ ఉంటే వాటి వివరాలు, లాగ్ బుక్స్, సర్వే వివరాలు, నిర్మాణ, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఉన్నత స్థాయి ఇంజినీర్ల తనిఖీల నివేదికలు, నిర్మాణంలో మార్పులు, రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ, ప్రభుత్వ స్థాయిలో ఆమోదానికి సంబంధించిన రికార్డులు, గుత్తేదారుల పేమెంట్ వివరాలు, కాగ్ సిఫార్సులు, మూడు బ్యారేజీల క్లియరెన్స్కు సంబంధించిన డాక్యుమెంట్లు...
- బ్యారేజీల వారీగా గుత్తేదారుల అర్హతలు, ప్రాజెక్టు ఎస్ఈ, కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) మినిట్స్ వివరాలు...
- నిర్మాణానికి సంబంధించిన నిధుల వివరాలు, ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం ఆమోదించి ఉంటే వివరాలు, ప్రభుత్వ ఖజానాపై భారానికి సంబంధించిన వివరాలు...
- ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందా..? డ్యాం సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఆపరేషన్ ప్రొటోకాల్ పాటించారా, 2020లో వరద తర్వాత బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని గుర్తించినప్పుడు నీటిపారుదల శాఖ, ఓ అండ్ ఎం విభాగం గుర్తించిన అంశాలేంటి? నిర్వహణలో గేట్స్ ప్రొటోకాల్ పాటించారా, బ్యారేజీలు వైఫల్యం చెందడానికి కారణాలతో నివేదిక...
- క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలనలో గుర్తించిన అంశాలు, చేసిన సిఫార్సుల వివరాలు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలపై క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ నుంచి సమగ్ర నివేదిక.
- గుత్తేదారులకు అయాచిత ప్రయోజనాలు, ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సిఫార్సులు, ప్రభుత్వ ఆమోదాల వివరాలు.
- పనులు పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్లు, ఒప్పందంలోని నిబంధనల వివరాలు. పని జరుగుతుండగానే, ఒప్పందం గడువు ఉండగానే పని పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇస్తే సంబంధిత వివరాలు. బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలు. ఒప్పందానికి భిన్నంగా ముందుగానే బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇచ్చి ఉంటే అందుకు సంబంధించిన వివరాలు
మేడిగడ్డలో మరిన్ని గేట్లు ఎత్తడానికి సన్నాహాలు
మహదేవపూర్, న్యూస్టుడే: మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా మరిన్ని పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కుంగిన ఏడో బ్లాక్లో మొత్తం 11 గేట్లు ఉండగా ఎనిమిది మూసి ఉన్నాయి. శుక్రవారం 15వ గేటును ఎత్తగా, మిగిలిన ఏడింటిని ఎత్తడానికి పనులు చేస్తున్నారు. వరద ప్రవాహానికి గేట్ల మధ్యలో ఇరుక్కున చెత్త, మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. 16వ గేటును ఎత్తడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గురువారం వరకు దాన్ని ఎత్తే అవకాశముంది. బ్యారేజీ దిగువన వరద ప్రవాహానికి కొట్టుకుపోయి, చెల్లాచెదురైన సీసీ బ్లాక్ల అమరికకు, శాండ్ గ్రౌటింగ్ చేపట్టడానికి పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వచ్చే వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ పైల్స్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు