Justice PC Ghose: మీరు చెప్పినవి.. అఫిడవిట్గా ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది.
ఇంజినీర్లకు జస్టిస్ ఘోష్ సూచన
సీనియర్ ఇంజినీర్లను విచారించిన కమిషన్
డిజైన్లు, నిర్వహణ, అంచనాలు.. తదితరాలపై ప్రశ్నలు
విచారణకు హాజరవుతున్న మాజీ ఈఎన్సీ మురళీధర్
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో భాగంగా.. తన ఎదుట చెప్పిన అంశాలను రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందజేయాలని న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లకు సూచించినట్లు తెలిసింది. ఈ అఫిడవిట్లన్నీ రహస్యంగా ఉంటాయని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజికి గల కారణాలతోపాటు డిజైన్లు, నిర్వహణ, ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయాలు, అంచనాల పెంపు తదితర అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా సోమవారం పలువురు ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్రెడ్డి (డిజైన్స్)తో పాటు డిజైన్స్ విభాగంలో ఎస్ఈలుగా పనిచేసిన చంద్రశేఖర్, బసవరాజు, సుందిళ్ల, అన్నారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఓంకార్సింగ్, యాదగిరి తదితరులు హాజరయ్యారు. మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గడువు కోరినట్లు తెలిసింది. బ్యారేజీలకు సంబంధించి మీ అనుభవాలను, అభిప్రాయాలను నిజాయతీగా, స్వేచ్ఛగా వెల్లడించాలని వారిని కమిషన్ కోరినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విచారణకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.
సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్రెడ్డి, సీడీవో సీఈ చంద్రశేఖర్
డ్రాయింగ్ల ప్రకారం పని జరగలేదా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చినప్పటి నుంచి వివిధ అంశాలపై ఉన్నతస్థాయి కమిటీ, ప్రభుత్వస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, ఇందులోని సాంకేతికాంశాల గురించి ఇంజినీర్లను విచారణ కమిషన్ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యారేజీలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం చేయాలని కూడా అడిగినట్లు సమాచారం. బ్యారేజీలు, డ్యాంలలో దేని కోసం డిజైన్ చేశారు, నిర్మాణ ప్రాంతాల గురించి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. నిర్మాణ స్థలాల గురించి కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్, క్షేత్రస్థాయి (ఫీల్డ్) ఇంజినీర్ల మధ్యనే చర్చ జరిగిందని ఓ ఇంజినీర్ చెప్పినట్లు సమాచారం. ఇదే అంశంపై రాష్ట్రస్థాయి అత్యున్నత (హైలెవెల్) కమిటీ ఏం నిర్ణయం తీసుకుంది, ఫీల్డ్ ఇంజినీర్లు దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా అని మరో ఉన్నతస్థాయి ఇంజినీర్ను ప్రశ్నించినట్లు తెలిసింది. సీడీవో ఇచ్చిన డ్రాయింగ్ల ప్రకారం పని జరిగిందా లేదా, జరగకుంటే ఎందుకు జరగలేదని అడగ్గా.. డ్రాయింగ్ ప్రకారం జరగలేదనే సమాధానం వచ్చినట్లు కూడా తెలిసింది.
నిర్వహణ లోపాలు కూడా..
మేడిగడ్డ బ్యారేజీలో కట్ ఆఫ్ వాల్ సరిగా నిర్వహించకపోవడం, ఇసుక క్రమంగా కొట్టుకుపోతున్నా నాలుగేళ్ల పాటు నిర్వహణ గురించి పట్టించుకోకపోవడం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) సరిగా లేకపోవడం గురించి చర్చించినట్లు తెలిసింది. ఓ అండ్ ఎం సమస్యను ఓ ఇంజినీర్ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. మేడిగడ్డలో కట్ ఆఫ్ వాల్కు వినియోగించిన కొన్ని పైల్స్లో సమస్య వచ్చి ఉండొచ్చని, వెంటనే పట్టించుకుని ఉంటే తీవ్ర రూపం దాల్చేది కాదని ఓ ఇంజినీర్ చెప్పినట్లు సమాచారం. అంచనాలను పెంచారా.. ఉప గుత్తేదారులు పని చేశారా.. అన్న వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరినట్లు సమాచారం. తాను బ్యారేజి నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చానని, నిర్మాణ సమయంలో లేనని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెప్పగా.. కమిషన్ ఆయనను ఏమీ ప్రశ్నించలేదని తెలిసింది. భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, అటవీ, గనుల శాఖ అధికారులతో మాట్లాడటానికే ఎక్కువ సమయం పట్టిందని, డిజైన్ తదితర అంశాల గురించి పట్టించుకునే అవకాశం లేకుండా పోయిందని మరో ఇంజినీర్ పేర్కొన్నట్లు సమాచారం. బ్యారేజి వద్ద ఇసుక మేటలు వేయడం ప్రధాన సమస్య అని ఓ ఇంజినీర్ పేర్కొనగా.. ప్రారంభంలోనే ఎందుకు పట్టించుకోలేదని కమిషన్ ప్రశ్నించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యాక్వాటర్ అన్నారం బ్యారేజీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవడం, షూటింగ్ వెలాసిటీ డిజైన్కు, వాస్తవానికి తేడా ఉండటం గురించి కమిషన్ ప్రశ్నించినట్లు సమాచారం. మేడిగడ్డలో డిజైన్ లోపాలేమైనా ఉన్నాయా అని అందరినీ అడిగినట్లు తెలిసింది. నిర్వహణ లోపం వల్లే సమస్య తీవ్రమైనట్లు ఎక్కువ మంది కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత.. ప్రతి ఒక్కరూ తాము చెప్పిన అంశాలను రాతపూర్వరంగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ సూచించింది.
ఇంజినీర్ల టెలికాన్ఫరెన్స్పై మంత్రి సీరియస్!
కాళేశ్వరంపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకావడానికి సీనియర్ ఇంజినీర్లు టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని.. అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకోవడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశారని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ టెలికాన్ఫరెన్స్ అంశం ప్రస్తుతం నీటిపారుదలశాఖలో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం నుంచి తమ ఎదుట హాజరుకావాలని నీటిపారుదలశాఖ సీనియర్ ఇంజినీర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లకు నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఏడెనిమిది మంది ఇంజినీర్లతో ఓ సీనియర్ ఇంజినీర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిసింది. ఓ విశ్రాంత ఇంజినీర్ కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అందరూ ఒకే మాట మీద ఉండాలని, ఒకరు చెప్పిన దాంతో మరొకరు విభేదించవద్దని.. డిజైన్, ఓ అండ్ ఎం తదితర సమస్యల వల్ల జరిగినట్లు మాట్లాడవద్దని సూచించినట్లు తెలిసింది. విచారణలో తదుపరి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే.. ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఓ సీనియర్ ఇంజినీర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విషయం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి రావడంతో.. ఇందుకు బాధ్యులైన వారిపై సోమవారం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నంలా ఉందని, ఇలాంటి వాటిని ప్రభుత్వం సహించదని హెచ్చరించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..