Counterfeit Drugs: ప్రజారోగ్యంతో చెలగాటం
జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి.
నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం
ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం
ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు
కోకొల్లలుగా అనుమతి లేని మందుల దుకాణాలు
డీసీఏ తనిఖీల్లో ప్రతిచోటా నివ్వెరపోయే ఉదంతాలు
మచ్చబొల్లారంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.4.35 కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులు
హైదరాబాద్ సమీపంలోని మచ్చబొల్లారంలో ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థపై దాడి చేసినప్పుడు... దానికి ఎలాంటి లైసెన్సు లేదని వెల్లడైంది. ఈ కంపెనీ ఏకంగా 36 రకాల మందుల్ని తయారు చేస్తోంది. వాటిలో క్యాన్సర్ నివారణ మందులూ ఉండటం గమనార్హం.
- అల్సర్లను తగ్గించేందుకు కూకట్పల్లిలో నకిలీ మందులను తయారు చేసి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది.
చౌటుప్పల్ సమీపంలోని కొయ్యలగూడెంలో ఎస్వీ ల్యాబ్స్, జిన్నారం మండలం గుండ్లపోచంపల్లిలో మేకా ల్యాబ్స్, గుమ్మడిదల మండలం బొంతపల్లిలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే ఔషధాలు తయారు చేస్తున్న వ్యవహారం వెల్లడైంది.
ఖమ్మం శివారులోని టీఎస్ఐఐసీ పారిశ్రామికవాడలో నకిలీ మందుల తయారీకి వాడుతున్న పదార్థాలు, యంత్రాలు
ఈనాడు, హైదరాబాద్: జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి... అవి నాణ్యమైనవా, కల్తీవా అనేది గుర్తించలేని పరిస్థితి... నోట్లో వేసుకున్న మందు, ఒంటికి రాసుకున్న ఆయింట్మెంట్ పనిచేస్తోందో లేదోననే ఆందోళన... వీటికితోడు కాలం చెల్లిన మందులు, వాటిని విక్రయించే అనుమతిలేని మెడికల్ షాపులు... అధిక ధరలతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దైవాధీనంగా తయారైంది. ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశాలన్నీ సాక్షాత్తూ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) చేస్తున్న దాడులు, తనిఖీల్లో వెల్లడైనవే కావడం గమనార్హం. హైదరాబాద్తోపాటు వివిధ జిల్లాల్లో గత ఏడెనిమిది నెలలుగా డీసీఏ తనిఖీలు చేస్తోంది. ఒకవైపు కేసుల నమోదు, నకిలీ మందుల స్వాధీనం వంటివి జరుగుతున్నా... మరోవైపు యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ ఔషధాలు రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా తీసుకొస్తుండగా మరికొన్ని రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.
ఉత్తరాది నుంచి ఉత్తుత్తి ఔషధాలు
హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కాశీపుర్, కొత్ద్వార్లలో తయారైన నకిలీ మందులు రాష్ట్రానికి యథేచ్ఛగా వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ రాకెట్ను డీసీఏ ఛేదించింది. అక్కడ నుంచి కొరియర్ కంపెనీల ద్వారా మందులను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. వాటిలో యాంటీబయాటిక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించేవి ఉన్నాయి. ప్రముఖ తయారీ సంస్థలైన సన్ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మా వంటి సంస్థల మాత్రలు, మందులకు నకిలీలను తయారు చేయిస్తున్నారు.
అనుమతి లేని మెడికల్ షాపులు
రాష్ట్రంలో లైసెన్సు లేని మెడికల్ షాపులు భారీగా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మండల కేంద్రాలు, గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. వివిధ నర్సింగ్హోంలు సైతం అనుమతి తీసుకోకుండానే మెడికల్ షాపులను నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారు.
ఇష్టారాజ్యంగా ధరలు
ధరల సీలింగ్ ఉన్న మందులకు తప్పుడు గరిష్ఠ ధరలను ముద్రిస్తూ 30-40% వరకు అధికంగా తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఇటీవల 50కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని బీరంగూడ, మల్కాజిగిరిలో వాస్ఫిన్-ఓ 5 ఎంజీ ఆయింట్మెంట్ను రూ.113.60లకు కాకుండా రూ.140కి విక్రయించిన తీరు వెల్లడైంది. ఇట్రాకాప్-200 పది మాత్రలకు రూ.247.70 తీసుకోవాల్సి ఉండగా రూ.285కి అమ్ముతున్నారు.
క్యాన్సర్నూ తగ్గిస్తామని దగా
మధుమేహం, రక్తపోటు తగ్గిస్తాయని, కిడ్నీలు, గాల్బ్లాడర్లో రాళ్లను కరిగిస్తాయని చివరకు క్యాన్సర్లాంటి ప్రాణాంతక వ్యాధుల్నీ బాగు చేస్తాయని ఆయుర్వేద మందులను విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా కాస్మొటిక్ లైసెన్సు లేకుండా కుటీర పరిశ్రమల స్థాయిలో రకరకాల సౌందర్య లేపనాల తయారీ కొనసాగిస్తున్నారు.
తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు
- ఫుడ్లైసెన్స్ అనుమతి తీసుకుని మందు బిళ్లల తయారీ. పెప్టిక్ అల్సర్లను, జ్వరాలను తగ్గిస్తాయని పేర్కొంటూ నకిలీ మందుల విక్రయం. ప్రముఖ కంపెనీల దొంగ లేబుళ్లు, అల్యూమినియం ఫాయిల్స్, ఇతర ప్యాకింగ్ మెటీరియల్ తయారీకి ప్రత్యేకంగా వెలిసిన సంస్థలు.
- ధరల నియంత్రణ ఉన్న ఔషధాలను సైతం ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయించడం.
- అక్రమంగా బ్లడ్బ్యాంకుల నిర్వహణ. అనుమతి లేకుండానే దాతల నుంచి ప్లాస్మాను సేకరించడం.
- ఇన్సులిన్లాంటి వాటిని సైతం గది ఉష్ణోగ్రత వద్దే భారీ పరిమాణంలో నిల్వ ఉంచడం. భారీ పరిమాణంలో ఔషధాలను బిల్లులు లేకుండానే కొనడం. నిబంధనలకు విరుద్ధంగా దగ్గు మందుల నిల్వ, విక్రయం. లక్షల రూపాయల విలువైన గడువు ముగిసిన మందులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల