Counterfeit Drugs: ప్రజారోగ్యంతో చెలగాటం
జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి.
నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం
ప్రజల ప్రాణాలు పణంగా వ్యాపారం
ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయాలు
కోకొల్లలుగా అనుమతి లేని మందుల దుకాణాలు
డీసీఏ తనిఖీల్లో ప్రతిచోటా నివ్వెరపోయే ఉదంతాలు
మచ్చబొల్లారంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.4.35 కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులు
హైదరాబాద్ సమీపంలోని మచ్చబొల్లారంలో ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థపై దాడి చేసినప్పుడు... దానికి ఎలాంటి లైసెన్సు లేదని వెల్లడైంది. ఈ కంపెనీ ఏకంగా 36 రకాల మందుల్ని తయారు చేస్తోంది. వాటిలో క్యాన్సర్ నివారణ మందులూ ఉండటం గమనార్హం.
- అల్సర్లను తగ్గించేందుకు కూకట్పల్లిలో నకిలీ మందులను తయారు చేసి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది.
చౌటుప్పల్ సమీపంలోని కొయ్యలగూడెంలో ఎస్వీ ల్యాబ్స్, జిన్నారం మండలం గుండ్లపోచంపల్లిలో మేకా ల్యాబ్స్, గుమ్మడిదల మండలం బొంతపల్లిలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే ఔషధాలు తయారు చేస్తున్న వ్యవహారం వెల్లడైంది.
ఖమ్మం శివారులోని టీఎస్ఐఐసీ పారిశ్రామికవాడలో నకిలీ మందుల తయారీకి వాడుతున్న పదార్థాలు, యంత్రాలు
ఈనాడు, హైదరాబాద్: జ్వరం, దగ్గు, నొప్పులు, రక్తపోటు, మధుమేహం, చివరికి ప్రాణాంతక క్యాన్సర్కు మనం వాడుతున్న చాలా మందుల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియని దుస్థితి... అవి నాణ్యమైనవా, కల్తీవా అనేది గుర్తించలేని పరిస్థితి... నోట్లో వేసుకున్న మందు, ఒంటికి రాసుకున్న ఆయింట్మెంట్ పనిచేస్తోందో లేదోననే ఆందోళన... వీటికితోడు కాలం చెల్లిన మందులు, వాటిని విక్రయించే అనుమతిలేని మెడికల్ షాపులు... అధిక ధరలతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దైవాధీనంగా తయారైంది. ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశాలన్నీ సాక్షాత్తూ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) చేస్తున్న దాడులు, తనిఖీల్లో వెల్లడైనవే కావడం గమనార్హం. హైదరాబాద్తోపాటు వివిధ జిల్లాల్లో గత ఏడెనిమిది నెలలుగా డీసీఏ తనిఖీలు చేస్తోంది. ఒకవైపు కేసుల నమోదు, నకిలీ మందుల స్వాధీనం వంటివి జరుగుతున్నా... మరోవైపు యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ ఔషధాలు రాష్ట్రానికి కుప్పలు తెప్పలుగా తీసుకొస్తుండగా మరికొన్ని రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.
ఉత్తరాది నుంచి ఉత్తుత్తి ఔషధాలు
హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కాశీపుర్, కొత్ద్వార్లలో తయారైన నకిలీ మందులు రాష్ట్రానికి యథేచ్ఛగా వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ రాకెట్ను డీసీఏ ఛేదించింది. అక్కడ నుంచి కొరియర్ కంపెనీల ద్వారా మందులను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. వాటిలో యాంటీబయాటిక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించేవి ఉన్నాయి. ప్రముఖ తయారీ సంస్థలైన సన్ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మా వంటి సంస్థల మాత్రలు, మందులకు నకిలీలను తయారు చేయిస్తున్నారు.
అనుమతి లేని మెడికల్ షాపులు
రాష్ట్రంలో లైసెన్సు లేని మెడికల్ షాపులు భారీగా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో మండల కేంద్రాలు, గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. వివిధ నర్సింగ్హోంలు సైతం అనుమతి తీసుకోకుండానే మెడికల్ షాపులను నిర్వహిస్తున్నాయి. గ్రామాల్లో ఆర్ఎంపీలు ఇళ్లలోనే మందుల దుకాణాలు నడుపుతున్నారు.
ఇష్టారాజ్యంగా ధరలు
ధరల సీలింగ్ ఉన్న మందులకు తప్పుడు గరిష్ఠ ధరలను ముద్రిస్తూ 30-40% వరకు అధికంగా తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఇటీవల 50కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని బీరంగూడ, మల్కాజిగిరిలో వాస్ఫిన్-ఓ 5 ఎంజీ ఆయింట్మెంట్ను రూ.113.60లకు కాకుండా రూ.140కి విక్రయించిన తీరు వెల్లడైంది. ఇట్రాకాప్-200 పది మాత్రలకు రూ.247.70 తీసుకోవాల్సి ఉండగా రూ.285కి అమ్ముతున్నారు.
క్యాన్సర్నూ తగ్గిస్తామని దగా
మధుమేహం, రక్తపోటు తగ్గిస్తాయని, కిడ్నీలు, గాల్బ్లాడర్లో రాళ్లను కరిగిస్తాయని చివరకు క్యాన్సర్లాంటి ప్రాణాంతక వ్యాధుల్నీ బాగు చేస్తాయని ఆయుర్వేద మందులను విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా కాస్మొటిక్ లైసెన్సు లేకుండా కుటీర పరిశ్రమల స్థాయిలో రకరకాల సౌందర్య లేపనాల తయారీ కొనసాగిస్తున్నారు.
తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలు
- ఫుడ్లైసెన్స్ అనుమతి తీసుకుని మందు బిళ్లల తయారీ. పెప్టిక్ అల్సర్లను, జ్వరాలను తగ్గిస్తాయని పేర్కొంటూ నకిలీ మందుల విక్రయం. ప్రముఖ కంపెనీల దొంగ లేబుళ్లు, అల్యూమినియం ఫాయిల్స్, ఇతర ప్యాకింగ్ మెటీరియల్ తయారీకి ప్రత్యేకంగా వెలిసిన సంస్థలు.
- ధరల నియంత్రణ ఉన్న ఔషధాలను సైతం ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయించడం.
- అక్రమంగా బ్లడ్బ్యాంకుల నిర్వహణ. అనుమతి లేకుండానే దాతల నుంచి ప్లాస్మాను సేకరించడం.
- ఇన్సులిన్లాంటి వాటిని సైతం గది ఉష్ణోగ్రత వద్దే భారీ పరిమాణంలో నిల్వ ఉంచడం. భారీ పరిమాణంలో ఔషధాలను బిల్లులు లేకుండానే కొనడం. నిబంధనలకు విరుద్ధంగా దగ్గు మందుల నిల్వ, విక్రయం. లక్షల రూపాయల విలువైన గడువు ముగిసిన మందులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు
భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. -
ఖాళీల్లోనే ఆ పాఠశాలలు ఆదర్శం!
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. -
అంతిమ లబ్ధిదారులే కీలకం
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడుకు పరిహారం చెల్లించాల్సిందే
గ్యాస్ సిలిండర్ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. -
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఇన్ఛార్జి వీసీలే
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు. -
నిన్నటి మనస్తత్వంతో రేపటి పోరాటం చేయలేం
-
ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల ధర్నా
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నల్లమలలో చిరుత మృతి
నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. -
మొలకెత్తింది కష్టాలే
జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. -
బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి
ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి
కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. -
నియంతృత్వ, నిర్బంధ పోకడలు తగవు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
రమేశ్కార్తీక్ నాయక్ను వరించిన ‘యువ పురస్కార్’
ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. -
అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు
తెలంగాణలో వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
రుషికొండలో రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం